#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #నాయనార్ల చరిత్రలు - కోచెన్ గాట్ చోళ నాయనారు" (లోహితాక్షుడు)**చరిత్ర
🚩 శివభక్తిలో తరించిన మహారాజు: కోచెన్ గాట్ చోళ నాయనారు (లోహితాక్షుడు) చరిత్ర 🚩
శివ భక్తికి కులమతాలే కాదు, జన్మలతో కూడా సంబంధం లేదని నిరూపించిన మహనీయుడు కోచెన్ గాట్ చోళ నాయనారు. ఈయన పూర్వజన్మ వృత్తాంతం నుండి రాజుగా మారే వరకు అంతా ఒక శివలీల!
🕸️ పూర్వజన్మ వృత్తాంతం (సాలెపురుగు - ఏనుగు భక్తి):
'గజారణ్యం'(జంబులింగేశ్వరం)అనే శైవక్షేత్రం చుట్టూ అలంకరించిన పూలమాలికవలె, దివ్య కావేరీవారి ప్రవాహం ఉంది. అక్కడ వేదం తెల్లనేరుడు చెట్టురూపం ధరించి తపం చేస్తుండగా, వేదమూలమైన శంకరుడు ఆ జంబూవృక్ష మూలంలో లింగరూపంలో సన్నిధి చేసాడు. ఈశ్వరుడు పూర్వం పార్వతీదేవిచే జలలింగంగా అక్కడ ఆవిర్భవించి, స్వయంజ్యోతి రూపమై వెలసి సేవనీయుడు అయ్యాడు.
అక్కడికి ఒక ఏనుగు కావేరీ నదీజలాలను తన తుండంతో కొనితెచ్చి, ఆ శివలింగాన్ని అభిషేకించేది. ఆ చెట్టుపై నివసించే ఒక సాలెపురుగు తన నోటినుంచి ఉద్భవించే దారాలతో, ఆ శివలింగం మీద గొడుగువలె చాందినీలు నిర్మించేది. ప్రతిదినం ఏనుగు లింగాభిషేకం చేయుటకు అడ్డుగా ఉన్న సాలెపురుగు అల్లిన తంతు వితానమును, తన తుండంతో తొలగించివేసేది. అది సాలెకు కోపంతెచ్చింది. ఒకనాడు ఎప్పటిలాగే, మదేభం నీటిని తీసుకొని వచ్చి, లింగంపైని సాలెగూళ్ళను ఛేదించి లింగాన్ని అభిషేకించింది. సాలెకు ఒళ్ళుమండి, చెట్టుపైనుంచి వేలాడి ఏనుగు తుండంమీదకు ఉరికింది. ఏనుగు దానిని గుర్తించకముందే, అది తుండ రంధ్రంలోంచి లోపలికి పోయి అక్కడ కుట్టసాగింది. ఏనుగు ఆ దారుణ బాధను తట్టుకోలేక, తొండం నేలకేసి కొట్టుకునీ ఆ శివసన్నిధిలోనే ప్రాణం విడిచింది. సాలెపురుగు మెలికపడి తుండంనుంచి బయటకు రాలేక, ఊపిరి ఆడక మత్తేభ దేహంలోనే సమాధి అయింది.
పరమేశ్వరుడు ఏనుగుకు మోక్షాన్నిచ్చాడు. స్వీయతంతు సముదాయంతో నిత్యం తనకు ఛత్రసేవ చేసినా, 'సాలెపురుగు యొక్క శుభకర్మలో గజహింస అంతర్భవించుటచేత, మోక్షార్హం కాదు' అని నిర్ణయించి, దానికి మరొక జన్మ విధించాడు శివుడు.
👶 "లోహితాక్షుడు" పేరు వెనుక ఉన్న రహస్యం:
చోళ రాజు శంభుదేవుడు, రాణి కమలావతి సంతానం కోసం పరమశివుడిని ప్రార్థించారు. ఫలితంగా ఆ సాలెపురుగు వారి గర్భాన జన్మించింది. రాణి ప్రసవ వేదన పడుతున్నప్పుడు, జ్యోతిష్కులు ఒక అద్భుతమైన గడియ గురించి చెప్పారు. "మరో కొద్ది నిమిషాలు ఆగి బిడ్డ పుడితే, అతడు ముల్లోకాలను ఏలే చక్రవర్తి అవుతాడు" అని చెప్పారు.
శివభక్తురాలైన ఆ తల్లి, గొప్ప యోగ వేత్త కూడ తన బిడ్డ గొప్ప రాజు కావాలని కోరుకుంటూ.. తన కాళ్ళను పైకి కట్టి, తలకిందులుగా వేలాడదీయమని కోరింది. సరిగ్గా శుభ ముహూర్తానికి బిడ్డ పుట్టాడు. ప్రసవం ఆలస్యం కావడం వల్ల, రక్త ప్రసరణ సరిగ్గా లేక బిడ్డ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అందుకే ఆ బిడ్డకు **"కోచెన్ గన్నన్"** (తమిళంలో 'చెన్' అంటే ఎరుపు, 'కణ్' అంటే కన్ను - ఎర్రని కన్నులు కలవాడు) అని పేరు వచ్చింది. సంస్కృతంలో దీనినే **"లోహితాక్షుడు"** అంటారు.ఆ బిడ్డకు జన్మ ఇచ్చి తల్లి మరణించింది, బాలుడు శుక్ల పక్ష చంద్రుడి వలె పెరిగి పెద్దవాడు అయ్యాడు, రాజు అతనిని బాధ్యతలు అప్పచెప్పి వానప్రస్తు గా మారాడు.
🏰 మాడ కోవెలల నిర్మాణకర్త (Elephant-Proof Temples):
రాజు అయ్యాక లోహితాక్షుడు మంత్రిమండలి యొక్క వివేక ధర్మోపదేశాల ప్రకారం నడుచుకొంటూ, మనుచక్రవర్తిలా పాలించాడు. అతడు పూర్వజన్మ స్మృతి కలిగి గజారణ్యమునకు వెళ్ళి, జంబూ వృక్షపు మొదట ఉన్న జంబుకేశ్వర స్వామిని అర్చించి, శ్రీకర్మ నిర్వర్తించి, శిల్పులచే ఆలయాన్ని నిర్మాణం చేయించసాగాడు. గర్భాలయం, విమానం, మహామండపం, దానికి ఎదురుగా అర్థమండపం మొదలైనవి నిర్మించాక, ఆలయంలో పరివార దేవతా మూర్తులను ప్రతిష్ఠింపచేసాడు. ప్రాకార నిర్మాణం మొదలయ్యేసరికి నిధులు నిండుకున్నాయి.
అప్పుడు జంబులింగేశ్వరుడు తాపసి వేషంలో వచ్చి పని చేసే వారికి, శిల్పులకు భస్మం ఇచ్చి మీ శక్తి కొలది శివ కైంకర్యంగా పని చేయండి భస్మే బంగారం అవుతుంది అని ఉత్సాహం నింపాడు అలా సప్త ప్రాకారాలు పూర్తి అయ్యాయి తాపసి మాయం అయ్యాడు. నమ్మి భస్మ తీసుకుని గుడి నిర్మాణం చేసిన వారికి నిజంగానే బంగారంగా మారి సంపన్నులను చేసింది.నమ్మని వారికి బూడిద గానే మిగిలింది.
శోణాక్షుడు వచ్చి ఈ మహాద్భుతాన్ని తిలకించి, సాక్షాత్ శివుడే వచ్చి నిర్మింపచేసిన ఆ 'శ్రీభస్మసాలము'ను ఒక శుభముహూర్తంలో పరమేశ్వరునికి అంకితం చేసి, శివప్రీతికై ఆవిష్కరించాడు. మహాదేవుడికి మహోత్సవాన్ని నిర్వహించాడు.
వీటితో పాటుగా
పూర్వజన్మలో ఏనుగు తన సాలె గూటిని పాడు చేసిందన్న జ్ఞాపకం ఈ జన్మలో కూడా ఆయనకు ఉంది. అందుకే ఆయన తన రాజ్యంలో సుమారు **70 శివాలయాలను** నిర్మించారు. వీటిని **"మాడ కోవెలలు"** అంటారు.
> **ప్రత్యేకత:** ఈ ఆలయాల గర్భాలయంలోకి వెళ్లే దారి చాలా ఇరుకుగా, ఎత్తుగా ఉంటుంది. ఒక ఏనుగు లోపలికి ప్రవేశించలేని విధంగా మెట్లు, ద్వారాలు నిర్మించారు. ఏనుగుల వల్ల శివుడికి ఆటంకం కలగకూడదనేది ఆయన ఉద్దేశ్యం.
🔱 ఆధ్యాత్మిక జీవనం - ముక్తి:
ఇలా అనేక శైవక్షేత్రాల నిర్మాణ, పునర్నిర్మాణ కార్యక్రమాలను ఎన్నో చేపట్టి, చివరికి చిదంబరం చేరుకున్నాడు. అక్కడ పది సంవత్సరములు ఉండి, ఆ నటేశునికి శక్తివంచన లేకుండా సేవా కైంకర్యములను నిర్వర్తించి, మేదినీ వలయాన్ని (రాజ్యాన్ని)గొప్పదక్షతతో పాలించి, చిత్సభాపతి కరుణచే ముక్తిని పొందాడు.
**నీతి:**
మన భక్తి ద్వేషం తో కూడి ఉండకూడదు నిర్మలంగా ఉండాలీ. నిర్మల భక్తి తో సేవ చేసిన ఏనుగు అదే జన్మలో ముక్తి పొందింది. సాలె గూడు తీయడంలో దానికి దురుద్దేశం లేదు ఇది చెత్త అనుకుంది,కానీ సాలెపురుగు నేను అల్లింది ఇది తీస్తుందా అన్న అహంకారం కల్గి ఉంది అందుకే మళ్ళీ జన్మ వచ్చింది. ద్వేషం తో ఉన్నా భక్తి భక్తే కనుక గొప్ప రాజుగా భక్తుడిగా పుట్టాడు,మళ్ళీ ఆ ద్వేషం పోలేదు అందుకే ఏనుగులు దూరనీ శివాలయాలు కట్టాడు. ఈసారి హృదయం లో ప్రేమ ఉంది ఏనుగు వల్ల స్వామికి ఇబ్బంది కలగ వద్దు అని అందుకే ముక్తి కలిగింది.
భక్తితో చేసే చిన్న పని అయినా (సాలెపురుగు అల్లిన గూడు వంటిది), భగవంతుడు దానిని మెచ్చి గొప్ప జన్మను, కీర్తిని ప్రసాదిస్తాడు అన్న గొప్ప నీతి ఇందులో ఉంది.
**ఓం నమః శివాయ!** 🕉️🙏
ఈ మహనీయుడి చరిత్ర మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో షేర్ చేసి వారు కూడా శివానుగ్రహం పొందేలా చేయండి.


