ShareChat
click to see wallet page
search
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు Harish Rao | పొంగులేటి కంపెనీ కొండలు మింగుతున్నా.. హైడ్రాకు పట్టదా.. హరీశ్‌రావు ధ్వజం... ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్‌ మండలం మానస హిల్స్‌లో పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తూ కొండలు పిండిచేసి కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ నెలల తరబడి కొండలు పిండి చేసి భారీగా కాంక్రీటు తరలిస్తున్నా సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నయి? విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార, పర్యావరణ మంత్రి కొండా సురేఖ, గనులశాఖ మంత్రి వివేక్‌ సహా యావత్‌ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నట్టు? ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయి? అక్రమంగా క్వారీ ‘చట్టపరమైన అనుమతులు లేకుండా క్వారీ నిర్వహణ చట్టవిరుద్ధం అనే సంగతి ప్రభుత్వానికి తెలియదా?’ అని హరీశ్‌ ప్రశ్నించారు. టీఎస్‌ పీసీబీ నుంచి క్వారీ ఏర్పాటుకు అనుమతి లేదని (సీఎఫ్‌ఈ), కార్యకలాపాల నిర్వహణకు లైసెన్స్‌ (సీఎఫ్‌వో) లేదని చెప్పారు. పర్యావరణ అనుమతి కూడా లేదని పేర్కొన్నారు. మైనింగ్‌/క్వారీయింగ్‌ లీజ్‌ అనుమతిని మైన్స్‌, జియాలజీ విభాగం ఇవ్వలేదని తెలిపారు. స్థానిక గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ అనుమతి లేదని, ల్యాండ్‌ యూజ్‌ మార్పిడీకి హెచ్‌ఎండీఏ క్లియరెన్స్‌ ఇవ్వలేదని గుర్తుచేశారు. విస్ఫోటక పదార్థాల వినియోగ లైసెన్స్‌ కూడా లేదని, గ్రౌండ్‌ వాటర్‌ వినియోగానికి సంబంధిత అనుమతులు లేవని, రెవెన్యూ అనుమతులు కూడా లేవని వివరించారు. ఏ అనుమతి లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలు మాయం చేస్తూ భారీ స్థాయిలో రాళ్లు-కాంక్రీట్‌ తరలించడం చట్టవిరుద్ధమనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. పప్పుబెల్లంలా ప్రభుత్వ భూమి రియల్‌ ఎస్టేట్‌ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మరోవైపు ప్రభుత్వ భూమిని పప్పుబెల్లంలా తనవారికి కట్టబెడుతున్నారని హరీశ్‌ విమర్శించారు.
📰ఈరోజు అప్‌డేట్స్ - ShareChat