బేతంచెర్ల మండల ప్రజానీకం హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి,రారాజు లాంటి వారు దివంగత బుగ్గన మురళీధర్ రెడ్డి గారు! ( పెద్దాయన వర్ధంతిని పురస్కరించుకొని 7 - 1 - 2026)!
నిప్పు లాంటి మనిషి,పేద,సామాన్య,బడుగు,బలహీన వర్గాల పెన్నిధి,మాట మీద నిలబడే మడమ తిప్పని మహోన్నత వ్యక్తి,బేతంచెర్ల మండల సామాన్య ప్రజల శ్రేయోభిలాషి,వారికి ఏ సమస్య వచ్చిన మీ వెనుక నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి మరీ వారిని ఆపదల నుంచి గట్టేక్కించిన,పెద్ద మనిషి దివంగత బుగ్గన మురళీధర రెడ్డి గారు.అదేవిధంగా ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆమడ దూరంగా వుంటూ,సామాన్య ప్రజలపై దౌర్జన్యం చేసే నాయకుల పాలిట ఒక సింహ స్వప్నమై నిలిచిన ఓ కొదమ సింహం,బేతంచెర్ల మండలంలో ఒక మకుటం లేని మహారాజులా ఒక వెలుగు వెలిగిన దార్శనికుడు,నిలువెల్లా మానవత్వం మూర్తిభవించిన ఒక గొప్ప మానవతా వాది మన దివంగత బి.ఎస్.ఎం.ఆర్ గారు.ఆయన జీవించినన్ని రోజులు వీలయినంత వరకు బేతంచెర్ల మండల ప్రజానీకానికి మంచి చేయాలని చూశాడు తప్ప ఏనాడూ కూడా వారి ఆస్తులను కొల్లగొట్టడం,వారిపై దౌర్జన్యం చేయడం వంటి నీతి తప్పిన చర్యలకు పాల్పడిన దాఖలాలు మచ్చుకైనను లేవు.ఒక విధంగా చెప్పాలంటే అన్యాయలు,అక్రమాలు చేయడం దివంగత బుగ్గన మురళీధర్ రెడ్డి గారి డిక్షనరీ లొనే లేని విషయం.
ఏదిఏమైన బి.ఎస్.ఎం.ఆర్ గారు ఒక మచ్చ లేని వ్యక్తి.ఒక గొప్ప పేరు,ప్రఖ్యాతలు ఉన్న ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు మంచి పలుకుబడి,ప్రజాబలం మెండుగా ఉన్నప్పటికీ ఆయన ఒక సాధారణ వ్యక్తిలా అత్యంత నిరాడంబరంగా జీవించాడు.ఆయనకు పెద్ద పెద్ద నగరాలలో,మెట్రో పాలిటన్ సిటీస్ లో జీవించే ఆర్థిక స్తొమత ఉన్నప్పటికీ ఆయన చివరి శ్వాస విడిచేవరకు,అంతిమ ఘడియల వరకు కూడా తనకు జన్మనిచ్చిన బేతంచెర్ల నగరాన్నే అంటిపెట్టుకొని ఇక్కడి మండల ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడిన ఓ సమున్నత శిఖరం.ఇక్కడ నివసించే స్థానికులకు ఏ ఆపద వచ్చిన మొదట ఆయన ఇంటి తలుపునే తడతారు.ఎందుకంటే ఇక్కడి బేతంచెర్ల మండల ప్రజలకు ఆయన ఓ అపద్బాందవుడు లాంటి వారు.ఏమైనా ఆయన గారు లేని లోటు ఎప్పటికి పుడ్చలేనిది.కులాల,మతాలకు అతీతంగా అన్ని వర్గాలరికి మంచి చేసిన ఓ ఆత్మీయుడు లాంటి వారు,వేలాది మందికి జీవనోపాధి కల్పించిన వ్యక్తి.అన్నింటికి మించి ఇతర కొంతమంది నాయకుల మాదిరి ఆయన గారు దురాశ,వేలాది ఎకరాలను అప్పనంగా కొట్టేయాలనే దుర్బుద్ది కలిగిన వారు అయితే ఏనాడో వందలాది కోట్ల రూపాయలు వెనకేసుకునేవారు.కానీ ఏనాడూ ఆయన గారు అలాంటి నీచపు,అన్యాక్రాంతం చేసుకునే పనులకు పాల్పడలేదు.అందుకే ఆ మహానుభావుడు ఇప్పుడు మన మధ్య లేకపోయినా బేతంచెర్ల మండల ప్రజలకు ఆయన అందించిన వెలకట్టలేని,మహోన్నత సేవలు ఎంత కాలం అయిన,ఎన్ని తరాలు మారిన చెరిగిపోనివి,చిరస్మరణీయమైనవి.ఏమైనా బేతంచెర్ల మండలంలోని ప్రజల శ్రేయస్సును,అభివృద్ధిని మనసా,వాచ,కర్మణ ఆకాంక్షించిన ఓ ఉన్నతమైన వ్యకిత్వం ఈ పెద్దాయన దివంగత బుగ్గన మురళీధరరెడ్డి గారిది.అందుకే ఆయన గారు బేతంచెర్ల మండల ప్రజానీకం దృష్టిలో ఒక రారాజు,వారి హృదయాలలో కొలువై వున్న ఓ మహా పురుషుడు.ఇందులో ఎలాంటి సందేహానికి తావు లేదు.జోహార్ బి.ఎస్.ఎం.ఆర్ గారు!అమర్ రహే అమర్ రహే దివంగత,నిలువెత్తు శిఖరం బుగ్గన మురళీధరరెడ్డి గారు!
ఇట్లు
ఎల్లవేళలా వారి కుటుంబ శ్రేయస్సును కోరే,
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #🙏ఎందరో మహానుభావులు🙏


