బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
ఓక విప్లవ స్వర గొంతుక,ఓక గొప్ప చైతన్య దీప్తి మూగబోయింది!( 6 - 8 - 2026) ఆ మహానుభావుని మూడవ వర్ధంతిని పురస్కరించుకొని మనమంతా ఆ విప్లవ కెరటానికి గొప్ప నివాళులు అర్పిద్దాం!)
లేదా
తెలంగాణ ఉద్యమంలో ఎగిసిన కెరటం,తుది వరకు పీడిత వర్గ పక్షపాతిగా నిలిచిన ఓక ఉద్యమ నిలువెత్తు శిఖరం గద్దర్ ఇక లేరు! ( నేడు ఆయన మూడవ వర్ధంతి)!
బుర్రకథ విఠల్,తెలంగాణ ఉద్యమానికి వన్నెలద్దిన ప్రజా నాట్య శిఖమణి కళాకారుడిగా,అణగారిన వర్గాలపై భూస్వామ్య వర్గాలు అనుసరించిన పెత్తందారీ పోకడలను ప్రశ్నించిన తిరుగుబాటు గొంతుక,తుది వరకూ కూడా పీడిత వర్గ పక్షపాతిగా జీవనం సాగించిన ఉద్యమ ఊపిరి,అన్యాయం,దౌర్జన్యాలపై తిరుగుబాటు బావుట ఎగురవేసిన అరుణ కిరణం, విప్లవ సూరీడు గద్దర్ ఇకలేరు.దీంతో ఓక విప్లవ స్వర గొంతుక మూగబోయినట్లయింది.ఎల్లవేళలా సామాన్య, బడుగు,బలహీన వర్గ ప్రజల మధ్యనే వుంటూ వారికి ఏ సమస్య వచ్చిన తన తూటాల వంటి మాటలనే జోడించి వాటిని పాటలుగా మలుస్తూ వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఏకరువు పెట్టే ఓక సామాన్య ప్రజల శ్రేయోభిలాషి గద్దర్ గారు. ఊపిరితిత్తులు,మూత్రపిండాల సమస్యలతో ఆసుపత్రి లో చికిత్స పొందుతూ విధి వక్రించి చివరకు కోలుకోలేక మృత్యు కౌగిట్లోకి చేరుకోవడం అనేది నిజంగా అత్యంత దురదృష్టకరమైన విషయం.ఈ దుర్వార్త ఆయన సిద్ధాంతాలను,విప్లవ పంథాను ఇష్టపడే ఆశేష ప్రజానీకానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతి యొక్క నిరుపేద,సామాన్య ప్రజానీకానికి ఏ మాత్రం జీర్ణించుకోలేని, మింగుడు పడని విషయం. అదేవిధంగా విప్లవాన్ని, తిరుగుబాటు ధోరణి నే తన ఏకైక ఏజెండాగా మార్చుకున్న గద్దర్ గారి ప్రత్యేకతను, ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పాల్సివస్తే నడుముకు తెల్ల పంచె,ఒంటి పై నల్లటి గొంగడి,చేతికి కడియాలు,
కాళ్లకు గజ్జలు,తలకు ఎర్రటి వస్త్రంతో ఇలా ఆయన ఎక్కడికి వెళ్లిన ఓక ప్రత్యేక ఆకర్షణగా నిలువడం అనేది ఆయనకే సొంతం.ఇక తల్లి నుంచి జానపదాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్న ఆయన,అనంతర కాలంలో తన ఆట పాటలతో తెలుగు గడ్డను అలరించడం,ప్రజలకు ఆత్మీయ బంధువుగా మారడం, వారి తలలో నాలుక లాగా మెలగడమే కాదు,వివిధ సామాజిక రుగ్మతలపై పోరాడిన ఓక అగ్ని శిఖరం, ఉద్దండుడు,యోదానుయోధుడు ఈ గద్దర్ గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అంతేకాదు హైదరాబాద్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన ఆయన 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొని జైలుకు వెళ్లిన చరిత్ర, అలాగే తన ఉద్యమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏకంగా 1984 లో కెనరా బ్యాంకులో తనకు ఉన్న క్లర్క్ ఉద్యోగానికి సైతం రాజీనామా సమర్పించిన ఆయన తీరు తెన్నులు, ఆశయాలు,
వ్యక్తిత్వం,గుణ గణాలు ఎంతైన ఆసక్తిదాయకం.ఇక ఆయన ఉద్యమ ప్రస్థానం గురించి చెప్పాల్సివస్తే ఆరంభంలో అంబేద్కర్ పై,తర్వాత అల్లూరి సీతారామరాజుపై బుర్ర కథలు చెప్పారు.ఆ తర్వాత ఆర్ట్ లవర్స్ అసోసియేషన్ లో చేరి అనంతరం ఉద్యమంలోకి వెళ్ళాడు.అంతేగాకుండా తాను జన్మించిన సొంత ఊరు తుప్రాన్ కు ఏదైనా గొప్ప పని చేయాలనే దృఢ సంకల్పంతో కిషాపూర్ హల్దీ వాగుపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మింప చేయాలనే తలంపుతో అప్పటి తెలంగాణ సీఎం కెసిఆర్,మంత్రి హరీష్ రావును కలిసి దాని నిర్మాణానికి 3.50 కోట్లను విడుదల చేయించిన అంకుటిత దీక్ష పరుడు, కారణజన్ముడు ఈ విప్లవ జ్వాల గద్దర్ గారు.దీంతో ఇప్పుడు తుప్రాన్ చెరువు క్రింద వెయ్యి ఎకరాల అయకట్టుకు నీరందుతున్నది అంటే ఆయన చేసిన స్వయంకృషి,చూపిన పోరాటపటిమ ఎంతటి కార్యదీక్షతత్పరతను చాటుకుంటున్నదో మనమంతా ఇట్టే ఊహించవచ్చు.
ఏదిఏమైన సామాన్య,అణగారిన ప్రజల శ్రేయస్సే,అభివృద్దే లక్ష్యంగా తన చివరి చరమాంకం వరకు,ఆఖరి,అంతిమ మజిలీ వరకు జీవించిన గద్దర్ అలపించిన సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ అంటూ అమ్మకు గుండెల్లో గుడి కట్టిన పదం, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తొడబుట్టిన రుణం తీర్చుకుంటూనే చెల్లెమ్మ అంటూ రక్త సంబంధాన్ని రంగరించిన గొంతుక,పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు పతాకమై నిలిచిన గీతిక.ఇంకా చెప్పుకుంటూ పోతే నిత్యం ఎన్నో మరెన్నో పాటలు వ్రాసి దానికి అనుగుణంగా సామాన్య ప్రజల మధ్యలో నాట్యమాడుతూ ఆయన పాట పాడే,అలపించే విధానం నభూతో న భవిష్యత్ అని చెప్పవచ్చు.ఓక విధంగా ఇలాంటి చైతన్య,విప్లవ,తిరుగుబాటు పంథానే ఆయనకు కోట్లాది మంది అభిమాన గణం ఏర్పడేలా చేసింది.ఏమైనా ఓక గొప్ప మహానుభావుడు,మహా పురుషుడు,సామాన్య,నిరుపేద ప్రజల శ్రేయోభిలాషి అయిన గద్దర్ గారి శాశ్వత నిష్క్రమణ పీడిత, బడుగు,బలహీన వర్గాలకు తీరని లోటు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అమర్ రహే,అమర్ రహే ప్రజా చైతన్య స్ఫూర్తి అయిన ఈ గద్దర్ గారు. అదేవిధంగా ఆ నిలువెత్తు శిఖరం,విప్లవ జ్వాల గద్దర్ గారి రెండవ వర్ధంతి అయిన ఈ ప్రత్యేక విషాద,బాధాకరమైన సమయాన ఆయన పవిత్ర ఆత్మకు స్వర్గంలో శాంతి చేకూరాలని మానవతావాదులు అయిన ప్రతి ఒక్కరూ కూడా మనసా,వాచ,కర్మణ హృదయపూర్వకంగా కోరుకుంటారు అనడంలో ఎలాంటి సందేహనికి తావులేదు.అన్నింటికి మించి పేద,బడుగు,పీడిత వర్గాల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా,ఓక గొప్ప ఆశయంతో ఓ మంచి ఆదర్శమైన అమూల్యమైన జీవితాన్ని గడిపిన ఓ తారజువ్వ,అగ్ని జ్వాల వంటి గద్దర్ గారికి మనమంతా ఒక్కసారి చేయేత్తి ఈ ప్రత్యేక సందర్బంగా లాల్ సలాం చేద్దాం!🇮🇳🇮🇳🇮🇳✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #gaddar kannumutha