ShareChat
click to see wallet page
search
🪷98శ్రీలింగమహాపురాణం🪷 🍀పాశుపతవ్రతమహత్మ్యం🍀   #తొంభై ఎనిమిదవ భాగం# శౌనకాది మునులు సూత మహర్షిని "రోమహర్షణ మహర్షీ! త్రిపురాసుర సంహారం కోసం పరమశివుని పశుపతి చేయడం కోసం పశుత్వం పొందిన దేవతాగణాలు ఆ పశుపాపం నుండి ఎలా విముక్తి పొందారో తెలియజేయండి" అని అడిగారు. సూత మహర్షి సరేనని కథనం చెప్పడం ఆరంభించారు. "మునులారా! త్రిపురాసుర సంహారం తరువాత పరమేశ్వరుడు తన శివగణాలతో కైలాసం వెళ్లిపోయాడు. దేవతలు తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు. కొంతకాలం గడచిన తరువాత దేవతలు తమలో త్రిపురాసుర సంహారం సమయంలో వచ్చిన పశుత్వం తొలగిపోలేదని గ్రహించి బ్రహ్మ వద్దకు వెళ్లారు. బ్రహ్మదేవుడు వారిని తీసుకుని విష్ణువు వద్దకు వెళ్లి దేవతలలో గల పశుత్వం తొలగించాలని కోరాడు. విన్న విష్ణువు "పశుపతి అయిన పరమేశ్వరుడు మాత్రమే   పశుత్వం తొలగించి గలడని" పలికి బ్రహ్మ ఇంద్రాది దేవతలతో కలసి కైలాసం బయలుదేరి వెళ్ళాడు.  శివుని నివాసమైన కైలాసం చేరి గరుత్మంతుడి పై నుంచి దిగి కైలాసానికి నమస్కరించి శివనగరం లోకి దేవతలతో కలసి లోనికి వెళ్లారు. భవన ద్వారము వద్ద  గణములతో ఉన్న నందిని చూసి నమస్కరించారు. నంది వారికి ప్రతి నమస్కారం చేసి "బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలారా! తమరందరు ఇక్కడకు రావడానికి కారణం ఏమిటి? నేను చేయగల సేవను తెలియజేయండి" అని అడిగాడు. బ్రహ్మ "నందీశ్వరా! త్రిపురాలను దహనం చేసే సమయంలో దేవతలకు పశుత్వము కలిగింది. ఈ పశుత్వం తొలగాలంటే పాశుపత వ్రతము చేయాలని పరమేశ్వరుడు అప్పుడు చెప్పారు.  ఆయన అనుమతి, అనుగ్రహం పొంది పాశుపత వ్రతము చేసి పశుత్వం తొలగించుకోవాలని కైలాసం వచ్చాము. మాకు శివ దర్శనం కలుగచేయండి" అని కోరాడు. నంది సరేనని లోనికి వెళ్లి పరమేశ్వరుని నుంచి అనుమతి పొంది బయటకు వచ్చి బ్రహ్మ విష్ణువు ఇంద్రాది దేవతలను తన వెంట శివుని వద్దకు తీసుకు వెళ్ళాడు. పరమశివుడు ఉమాదేవితో గణములతో, మునులతో విరాజమానుడై దేవతలకు దర్శనమిచ్చాడు. బ్రహ్మ విష్ణువులు, ఇంద్రాది దేవతలు శివునికి నమస్కరించి స్తుతించారు. పరమేశ్వరుడు చిరునవ్వుతో వారిని చూసి రాకకు కారణం అడిగాడు. దేవతలందరు ప్రణమిల్లి "తమను పశు పాశము నుండి విముక్తి కలిగించిమని. పాశుపత వ్రతము చేయడానికి అనుగ్రహించమని" ప్రార్థించారు. వృషభ ధ్వజుడైన శివుడు ప్రసన్నుడై "దేవతల ఆత్మలను పశుత్వం నుండి శుద్ది పరుచు పాశుపత వ్రత విధానము" చెప్పి వ్రతము చేసి విముక్తి పొందమని అనుగ్రహించాడు. అప్పటి నుండి దేవతలు పశుపత సంబంధులుగా ప్రసిద్దులయ్యారు. పశుపతి అయిన శివుడు వారిని స్వీకరించి వారికి అధిపతి అయ్యాడు. దేవతలందరు పరమేశ్వరుడు చెప్పినట్టు పాశుపత వ్రతము చేసి పశుత్వం నుండి విముక్తి పొందారు. పాశుపత వ్రతము చేసిన దేవతలు పాశుపతులయ్యారు. దేవతలు మొదటిసారి ఆచరించిన పాశుపత వ్రత విధానమున నంది సనత్కుమారునికి చెప్పాడు. సనత్కుమారుడు మా గురువు వేదవ్యాసుల వారికి చెప్పారు. నేను వారి నుంచి విని మీకు తెలియ చేస్తాను. "పశువు" లనగా ప్రతి వ్యక్తి యొక్క ఆత్మలను "పాశ" అనగా సంసారిక బంధనముల నుండి విముక్తి కలిగించు పాశుపత వ్రతమును దేవతలు, అసురులు, గంధర్వులు, సిద్దులు, ఋషులు మొదలైన వారు చేసారు. సంసార సంబంధ భోగ యోగ కామ మోక్షములను ఈ వ్రతము చేయడం వలన లభిస్తాయి. ఈ వ్రతము విధానము షడంగ సహితమైన వేదములను శోధించి మధించి ఏర్పరచబడింది. ఈ వ్రతము సర్వ వ్యాధులను హరిస్తుంది. అశ్వమేధాది యాగముల కంటే ఎక్కువ ఫలము లభిస్తుంది. సర్వమంగళ దాయకమైన ఈ పాశుపత వ్రతమును బ్రహ్మ విష్ణువులు మొదట ఆచరించి పశుపతి నాథుని అనుగ్రహం పొందారు. *పాశుపత వ్రత పూజా విధానము రేపటి భాగంలో చదువుదాం*. https://chat.whatsapp.com/DnFG7pWG3BkH6MKxaSFRFb #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ 🌹శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో🌹 💜   ఓం శ్రీఉమా మహేశ్వరాయ నమ:💜 🙏లోకా:సమస్తాః సుఖినోభవన్తు🙏 రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*      (సర్వం శ్రీశివార్పణమస్తు)                 🌷🙏🌷 శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి. 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
🌅శుభోదయం - ShareChat
భగవాన్ రమణ
WhatsApp Group Invite