#🌸మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💖 మహిళల సాధికారత,స్వేచ్చ,వారి హక్కులకు పూర్తి స్థాయిలో మోక్షమెప్పుడు? ( 8 - 3 - 2026)!
లేదా
మన భారతవాణికి స్వాతంత్య్రం సిద్దించి దాదాపు 79 సంవత్సరాలు కావస్తున్న ఇంకను మహిళలకు రక్షణ గగనకుసుమమే?
ఈ నెల అంటే మార్చి 8న మనమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ ప్రత్యేక సందర్బంగా మరోసారి మనం మహిళల సాధికారత,స్వేచ్చ,వారి హక్కులు,రక్షణ గురించి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఈనాటికి కూడా మహిళలు వారి మా నాన వారు పూర్తి స్థాయిలో స్వేచ్చ,వాయువులు పీల్చుకోలేక పోతున్నారు అనే మాట మనకు చాలా స్పష్టంగా హితబోధ అవుతున్నది.ఎందుకంటే ఈనాటికి మహిళలు అనేక విధాలుగా గృహ హింస,లైంగిక దాడులు,భృణ హత్యలు,అత్యాచారాలు,పురిటిలోనే పసిపాపలను కడతెర్చడం,లింగ సమానత్వం వంటి విషయాల్లో తీవ్రస్థాయిలో అధిపత్య ధోరణి, దౌర్జన్యాలను,అమానుష ఘటనలను నిత్యం ఎదుర్కొంటుండటం ఈ ప్రజాస్వామ్యానికి సంబందించి అత్యంత దురదృష్టకరం.ముఖ్యంగా చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత 30 శాతానికి మించక పోవడం కూడా మహిళల పాలిట ఓ శాపంగా పరిణమించి వారి ప్రశ్నించే గొంతుకకు కళ్లెం వేసినట్లయింది. అయినప్పటికీ మహిళలు ఈ మధ్యకాలంలో పురుషులతో సమానంగా అన్ని రంగాలలో వందే భారత్ ఎక్ష్ప్రెస్స్ లా దూసుకుపోతున్నారు అనే మాట అక్షర సత్యం.అయితే మహిళా ఉద్యోగులు అతి తక్కువగా వున్న రంగాలలో మహిళలు పనిచేసేటప్పుడు మాత్రం వారికి రక్షణ అనేది ఓ గగన కుసుమంగా,
ప్రశ్నార్థకంగా మారిపోయి పలు సందర్భాలలో వారు అనేకమైన ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనే విషయం మనందరికి తెలిసిన పచ్చి యదార్థమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఓక విధంగా మన భారతవాణికి స్వాతంత్య్రం సిద్దించి 79 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఎందుకనో ఇంకను మహిళలు ఇంటా బయట అనేక అవమానాలను,అవహేళనలను, ఛీత్కారాలను,చీవాట్లను,భరించలేని హింసను పురుష ప్రపంచం నుంచి ఎదుర్కొంటూనే వున్నారు అనే మాట అక్షర సత్యం.అంటే కొన్ని గృహలలో తమ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి తమ కుటుంబ సభ్యుల బాగోగులను చూసుకోవడమే పరమావదిగా భావిస్తూ మహిళలు ఓ వెట్టిచాకిరి చేసే యంత్రంలా మారిపోతుండటం అత్యంత జూగుస్సకరమైన,కడు బాధాకరమైన విషయం.ఇందుకు ప్రదాన కారణం అయా కుటుంబాలలో మహిళలను ఓ మరబొమ్మగా భావించే అనాగరిక సంస్కృతి నేటికీ కొన్ని కుటుంబాలలో రాజ్యమేలుతుండటం ఈ ప్రజాస్వామ్యానికి సంబందించి అత్యంత హేయమైన, సిగ్గుచేటైన విషయం.అయినప్పటికీ అనేక మంది మహిళలు ఈ మధ్యకాలంలో తరచుగా అయా రంగాలలో మంచి విద్యావంతులుగా,చదువులమ్మ సుపుత్రికలుగా మారి మంచి ఉన్నత స్థాయికి చేరుకొని తమ ఉనికిని పురుషులతో సమానంగా చాటుకుంటుండటం ఎంతైనా ఎంతో ఆరోగ్యకరమైన పరిణామం.
ఏదిఏమైనా మహిళలు ఇంకను పూర్తిస్థాయిలో నిరక్షరాస్యతను జయించలేకపోతుండటం,చైతన్యవంతుగా మారే అవకాశం లేకపోవడం,పురుషాదిక్యత సమాజం వారికి తగినంత స్థానం కల్పించకపోవడం వెరసి మహిళలు అయా రంగాలలో ఆశాజనకమైన స్థాయిలో,చెప్పుకొదగ్గ రీతిలో ముందంజ వేయలేకపోతున్నారు అనే మాట ఎవ్వరూ కాదనలేని ఓ అక్షర సత్యం.అయితే ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో సైతం మహిళలు అనేక సందర్భాలలో తాము ' అబలలం కాదు సబలం ',వీర నారీమణులం అని నిరూపించుకుంటూ న్యాయ,పోలీస్,న్యావి మిలిటరీ,ఐ.పి.ఎస్,ఐ.ఏ.ఎస్,శాస్ర్ర,సాంకేతిక,సైన్స్ & టెక్నాలజీ రంగాలలో అన్యూహంగా ఓ తారజువ్వలా దూసుకువస్తూ పట్టుదలతో,ఎనలేని చిత్తశుద్ధితో,అవిరళ కృషితో తామేంటో ఈ సభ్య సమాజం ముందు తమను తాము నిరూపించుకుంటుండటం ఓ విప్లవాత్మక,ఆదర్శమైన మార్పుకు ఓ అతి గొప్ప సంకేతం.ఏమైనా కనీసం వచ్చే ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే సమయానికన్నా మహిళలు మరింత ప్రతిభావంతులుగా రాటుదేలి అయా రంగాలలో తమ ఉనికిని అత్యంత ఘనంగా చాటుకోవాలని,తమలో దాగి వున్న శక్తి,యుక్తులకు జీవం పోసి, అభద్రతభావానికి చరమగీతం పాడి అత్యంత ధైర్యసాహసాలతో ఓ రాణి రుద్రమదేవిలా,' నైటింగేల్ అఫ్ ఇండియా ' గా పేరుబడ్డ సరోజినీదేవి నాయుడు లాగా,ఉక్కు మహిళగా ఖ్యాతి నార్జించిన మాజీ భారత ప్రధాని దివంగత ఇందిరాగాంధీ గారిలా,నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన మాజీ ఐ.పీ.ఎస్ అధికారిణి కిరణ్ బేడీ గారి లాగా,ఇన్ఫోసిస్ అధినేత్రి ఓ సుధామూర్తి గారిలాగా నేటి మహిళలు తమ సర్వశక్తులు ఒడ్డి,ఉన్నత విద్యావంతులుగా మారి తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగినప్పుడే మహిళలు తమ ప్రత్యేకతను,గొప్పతనాన్ని ఈ ప్రజాస్వామ్యంలో మరింత గొప్పగా చాటి చెప్పగలుగుతారు అనడంలో ఎలాంటి సందేహం ఇసుమంతైనను తావు లేదు.మహిళల హక్కులు వర్ధిల్లాలి మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా!నారీ శక్తిమణులు అయిన మహిళలకు ఓ లాల్ సలాం! సెల్యూట్ టూ మహిళా ప్రపంచం! జైహింద్! మేరా హిందూస్తాన్ మహాన్!🤵♀️🤵♀️🤵♀️🤵♀️👭👭👭
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా!


