#📰జాతీయం/అంతర్జాతీయం #🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 Bihar Politics: బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా? నేడు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్
Bihar Politics: ఎత్తుగడలు వెయ్యడంలో నితీశ్ కుమార్ దిట్ట. అలాంటి ఆయన్ని మించిపోయింది బీజేపీ. బీహార్లో రాజకీయాల్ని మలుపులు తిప్పుతూ.. నితీశ్ కుమార్కి సీఎం పదవిని దూరం చెయ్యబోతోంది. ఎందుకీ మార్పు? ఇప్పుడే ఎందుకు?
బీహార్లో కొత్త రాజకీయం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ నేడు (మార్చి 5) రాజ్యసభ సభ్యత్వం కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన నామినేషన్ పేపర్లపై సంతకం చేశారనీ, ఈరోజు (చివరి తేదీ) పాట్నాలో దాఖలు చేయనున్నారని సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పాట్నాలో పర్యటించి, NDA అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారని తెలిసింది. రాజ్యసభ ఎన్నికలు మార్చి 16న జరగనున్నాయి. వీటిలో 5 సీట్లను బీహార్ నుంచి ఫిలప్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ కీలక మార్పుతో 75 ఏళ్ల నితీశ్ కుమార్, సీఎం పదవికి రాజీనామా చేసి, కేంద్ర రాజకీయాలకు అంటే.. రాజ్యసభ ఎంపీగా ఉండటం లేదా రాజ్యసభ నుంచి క్యాబినెట్లో స్థానం పొందే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత లేదా మార్చి 16 తర్వాత రాజీనామా చేస్తారని తెలుస్తోంది. తద్వారా సీఎంగా తన 22ఏళ్ల రికార్డుకు బ్రేక్ పడుతుంది. ఐతే.. ఇప్పటికే 10 సార్లు సీఎంగా పనిచేసిన నితీశ్.. అంత ఈజీగా ఆ సీటును వదులుకునే రకం కాదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ, జేడీయూ కూటమికి బంపర్ మెజార్టీ వచ్చింది. 243 సీట్లు ఉండగా.. 202 సీట్లు ఈ కూటమికే దక్కాయి. అంటే ప్రజల్లో ఆయనకి మంచి ఆదరణ ఉన్నట్లే. మరెందుకు సీఎం పదవిని వదులుకుంటున్నారు అంటే.. బీజేపీ వ్యూహమే కారణం


