*ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో నిరుపేదల ఇళ్ల కూల్చివేత… హృదయ విదారక దృశ్యాలు* .😭.
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల ప్రాంతంలో నిరుపేదల ఇళ్లను కూల్చివేయడంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. సంవత్సరాలుగా నివసిస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడటంతో కన్నీటి పర్యంతమయ్యాయి.
ఇళ్ల అవశేషాల మధ్య చిన్నపిల్లలు, వృద్ధులు నిరాశ్రయులుగా కనిపించటం హృదయ విదారకంగా మారింది. తమ సామాన్లు, గృహోపకరణాలు శిధిలాల మధ్యే మిగిలిపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల ప్రకారం ముందస్తు నోటీసులు సరైన విధంగా ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ఆక్రమణలపై చర్యల్లో భాగంగానే కూల్చివేత చేపట్టినట్లు చెబుతున్నారని సమాచారం. #🆕Current అప్డేట్స్📢
01:04

