#🕉️ సనాతన హిందూ ధర్మం 🚩
*తలరాతను మార్చుకోవడానికి వీలుంటుందా..❓*
మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అయితే బ్రహ్మ నుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాసాడంట.
'నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను. మీరు మీ ఉపాసనలతోటి, మీ అర్చనలతోటి మార్చుకోగలరు' అని రాసారంట... పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికి 50వ ఏట మరణ గండం ఉంది. ఆ మరణ గండాన్ని ఎవరూ తప్పించలేరని రాసాడు బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి, గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసినవాడు బ్రతికాడు...128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు, ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనునితో ఈడ్పించడం వలన, చేసిన పాపానికి 60 వ ఏట చనిపోయాడు.
జప, ధ్యాన, దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు..మనస్సులో నిరంతరం భక్తితో భగవన్నామ స్మరణ చేస్తే, అంతా ఆ కృష్ణయ్యే చూసుకుంటారు..!


