ShareChat
click to see wallet page
search
#🏫విద్యార్థులకు శుభవార్త..ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్
🏫విద్యార్థులకు శుభవార్త..ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన - NEWS UPDATE LIVE TPG Tegipoinagalipatam BREAKING NEWS విద్యార్థులకు శుభవార్త .. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన తేలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి . ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసం నుంచే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి . ఉదయం ఎనిమిది గంటల నుండి ఎండ తీవ్రత పెరుగుతూ 10 , 11 అయ్యేసరికి ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.మధ్యాహ్నం వేళ రోడ్ల పైన జనసంచారం బాగా తగ్గిన పరిస్థితి ఉంది . ఈసారి ఎండలు బాగా మండుతున్న క్రమంలో తెలంగాణ విద్యాశాఖ ప్రస్తుతం కీలక నిర్ణయం తీసుకుంది . ఎండల తీవ్రత దృష్ట్యా మార్చి 16 వ తేదీ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ , ఎయిడెడ్ , ప్రైవేటు పాఠశాలలలో ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది . ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పని దినమైన ఏప్రిల్ 23 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది . ఈ మేరకు పాఠశాల పని వేళలను విద్యాశాఖ నిర్ణయించింది . పాఠశాలలు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పనిచేస్తాయి . ప్రభుత్వ పాఠశాలలలో 12:30 కు మధ్యాహ్న భోజనాన్ని ఇస్తారు . ప్రైవేట్ పాఠశాలలు సైతం ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి . ఇక మధ్యాహ్నం తరువాత ఎట్టి పరిస్థితులలోను పాఠశాలలు నిర్వహించకూడదని విద్యాశాఖ స్పష్టం చేసింది . ఈ మేరకు ఎవరికి , ఎటువంటి మినహాయింపులు లేవని పేర్కొంది . - ShareChat