ShareChat
click to see wallet page
search
*_స్త్రీ జన్మ....??_* *ధర్మరాజుకొక ధర్మసందేహం* *వచ్చింది. ‘స్త్రీ* *పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం వుంటుంది’ అని.* *ఇదే విషయం భీష్ముడిని అడిగాడు*. *దానికి భీష్ముడు నవ్వి “నీకొక కథ చెబుతాను. అందులో సమాధానం దొరకవచ్చు” అని చెప్పడం ప్రారంభించాడు*… *“పూర్వము భంగస్వనుడు అనే రాజు వుండేవాడు. అతను ధర్మ నిరతుడు, సత్య సంధుడు. ప్రజలను కన్న బిడ్డల కన్న మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు  సంతానము కలుగ లేదు*. *‘అపుత్రస్య గతిర్నాస్తి’ట అని పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడయినా లేడే అనే బాధతో  అగ్ని దేవుడిని ప్రార్ధించి అగ్నిస్తుత యజ్ఞం చేసాడు. అగ్ని దేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు*. *విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజయిన తన అనుమతి లేకుండా భంగస్వనుడు యజ్ఞము చేసి నూరుగురు కుమారులను కన్నందుకు ఆగ్రహం తెప్పించింది.* *అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలనుకున్నాడు. తగిన సమయం కోసం వేచివున్నాడు*. * ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్లాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారి తప్పేలా చేసాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటోతీసుకుని వెళ్ళింది.* *ఇంతలో అతడికి బాగా దాహము వేసింది. అటూ ఇటూ చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది*. *వెంటనే గుర్రము దిగి కొలనులో నీటిని సేవించాడు*. *స్పటికంలా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించి అందులో మునిగాడు*. *మునిగి పైకి లేచే సరికి ఆ రాజు  ఆశ్చర్య కరంగా స్త్రీ గా మారిపోయాడు. అయాచితం గా ప్రాప్తించిన స్త్రీత్వానికి  చాలా చింతించాడు*. *“ఈ రూపముతో రాజధానికి వెళ్ళి నేను నా భార్యా పిల్లలకు, పుర జనులకు ఎలా ముఖము చూపించగలను !?” అని విచారించి*... *“అయినా ఇలా అడవిలో ఉండలేను కదా!" అనుకుని చివరకు రాజధానికి వెళ్ళాడు*.        *ఓ5మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కొడుక్కి రాజ్యాభిషిక్తుడిని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించ సాగాడు*. *కాలక్రమంలో, ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి  మోహించి వివాహమాడారు*.  *స్త్రీగా ఆ మునివలన అత్యంత బలసంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు*. *వారు పెరిగి పెద్దయిన తరువాత ఆ నూరుగురు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో....*         *"కుమారులారా ! నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను*. *స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను పొందాను. కనుక వీరు కూడా మీ సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకుని పాలించండి" అంది.* *స్త్రీ గా మారినా ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృ వాక్య పాలకులుగా* *తండ్రిమాట పాటించి వారు రాజ్యాన్ని* *పంచుకుని పాలించసాగారు*. *ఇది చూసిన* *ఇంద్రుడు ‘నేను ఈ రాజుకు కీడు* *చేద్దామనుకుంటే అది* *అతడికి మేలు అయ్యింది.* *ఎలాగైనా వీరి మధ్య బేధము కల్పించాలని’* *సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి భంగస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి....* *"రాజకుమారులారా ! ఏమిటీ వెర్రి! ఎవరో ఎవరినో తీసుకు వచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా!? అసలు వీరి తండ్రి ఎవరు? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు?" అని వారిలో కలతలు రేపాడు*. *అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నపుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేని పోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిల్చాడు*. *అన్నదమ్ములు బద్ధశత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. చని పోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకుని రోదించసాగింది*. *ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమీ ఎరుగని వాడిలా బ్రహ్మణ రూపుడై...“అమ్మా నీవు ఎవరవు?ఎందుకిలా రోదిస్తున్నావు?" అని అడిగాడు*. *అప్పుడు ఆమె తాను యజ్ఞము చెయ్యడము కుమారులను కనడము అడవిలో దారి తప్పి కొలనునీరు త్రాగి స్త్రీగా మారడము మునిద్వారా కుమారులను కనడము పూసగ్రుచ్చినట్లు చెప్పింది*. *అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై .. "రాజా! నేను ఇంద్రుడను*. *నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను" అని చెప్పాడు*. *దానికి  ఆమె "దేవా !* *అజ్ఞానంతో* *తెలియక పొరపాటు చేసాను. అయినా దేవతలకు* *అధిపతివైన నీవు పగ తీర్చుకోడానికి నేను తగిన వ్యక్తినా ! కనుక నన్ను దయతో రక్షించు" అని వేడుకోగా....* *ఆ మాటలకు కరిగి పోయిన ఇంద్రుడు "రాజా ! నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రుల నైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను ఎవరు కావాలో నీవే ఎంచుకో " అన్నాడు*. *ఆమె (భంగస్వనుడు) సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకుంది.* *"అదేమిటి రాజా ! మిగిలిన వారు నీ కుమారులు కాదా !?" అని అడిగాడు.* *భంగస్వనుడు "వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా!” అని చెప్పింది*. *ఇంద్రుడు సంతోషంతో  "రాజా ! నీ సత్యనిష్టకు సంతోషించాను*. *నీకుమారులు అందరినీ బ్రతికిస్తాను" అని... “రాజా ! నీకు ఇంకొక వరము ఇస్తాను నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగిఇస్తాను" అన్నా దానికి ఆమె "మహేంద్రా ! నా కుమారులను బ్రతికించావు అదే చాలు స్త్రీగానే ఉంటాను" అంది*. *ఇంద్రుడు ఆశ్చర్యంతో  "అదేమిటి రాజా ! పురుషుడవైన నీవు స్త్రీగా ఉండి పోతాననడానికి కారణం ఏమిటి?" అని అడిగాడు*. *స్త్రీగా ఉన్న భంగస్వనుడు సిగ్గు పడి "మహేంద్రా ! నేను స్త్రీగా ఉండడంలో ఆనంద పడుతున్నాను. ఇందులో వున్న తృప్తి నాకు పుంసత్వములో కనబడలేదు కనుక ఇలాగే ఉండి పోతాను" అంది.* *దేవేంద్రుడు నవ్వి “అలాగే అగుగాక”అని ఆశీర్వదించాడు.* *అని పై కథంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు..* *“యుధిష్టిరా! ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం!” అని అడిగాడు*. *స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమయిన ధర్మజుడు మౌనంగా తల పంకించాడు*.  *“ఒకతెకు జగములు* *వణకున్ అగడితమై* *ఇద్దరు కూడిన* *అంబులు ఇగురున్।* *ఓముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరాపట్టపగలె చుక్కలు రాలున్ ..!”* *[ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి*, *ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది?* *పట్టపగలే నక్షత్రాలు రాలతాయి*. *అంటే స్త్రీ చాలా శక్తివంతురాలని భావము]* #మన సంప్రదాయాలు సమాచారం