ShareChat
click to see wallet page
search
*_చిరంజీవులు_* *_చిరంజీవులు అంటే చిరకాలం జీవించి వుండే వారని అర్థం._* *1)అశ్వత్థామ,* *2)బలిచక్రవర్తి,* *3)వ్యాసుడు,* *4)హనుమంతుడు,* *5)విభీషణుడు,* *6)కృపాచార్యుడు మరియు* *7)పరశురాముడు.* *వీరు ఏడుగురు చిరంజీవులు. నిత్యం వీరిని స్మరించడం వల్ల ఆనందంగా జీవిస్తారు.* *సప్త చిరంజీవులు (ఏడుగురు అమరజీవులు) గురించి స్మరించే శ్లోకం ఇది.* *హిందూ సంప్రదాయం ప్రకారం ఈ శ్లోకాన్ని ఉదయాన్నే పఠించడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు*. *శ్లోకం:~* *అశ్వత్థామా బలిర్వ్యాసో హనూమాంశ్చ విభీషణః |* *కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః ||* అర్థం:~ *1) అశ్వత్థామ:~* *ద్రోణాచార్యుని కుమారుడు*. *2) బలి చక్రవర్తి:~* *ప్రహ్లాదుని మనుమడు, దానగుణానికి ప్రసిద్ధి.* *3) వ్యాసుడు:~* *వేదాలను విభజించి, మహాభారతాన్ని రచించిన మహర్షి*. *4) హనుమంతుడు:~* *రామ భక్తుడు,శక్తికి రూపం.* *5) విభీషణుడు:~* *రావణుని సోదరుడు, ధర్మానికి కట్టుబడినవాడు*. *6) కృపాచార్యుడు:~* *కౌరవ-పాండవుల గురువు*. *7) పరశురాముడు:~* *విష్ణుమూర్తి ఆరవ అవతారం*. *ఈ ఏడుగురిని స్మరించడం వల్ల అపమృత్యు భయం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. కొన్ని ప్రాంతాలలో మార్కండేయ మహర్షి పేరును కూడా కలిపి "అష్ట చిరంజీవులు" (ఎనిమిది మంది) అని పిలుస్తారు*. *అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।* *కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥* *సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయ తథాష్టమం ।* *జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥*``` శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థామ, వామనానుగ్రహము వలన బలిచక్రవర్తి, లోకహితముకై వ్యాసుడు, శ్రీరామభక్తితో హనుమంతుడు, రామానుగ్రహము వలన విభీషణుడు, విచిత్రజన్మము వలన కృపుడు, ఉత్క్రుష్ట తపోధనుడైన పరశురాముడు సప్తచిరంజీవులైనారు. *_శివానుగ్రహము_* *చేత* కల్పంజయుడైన మార్కండేయ మహాఋషిని ప్రతినిత్యం తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై శతాయుష్మంతులు అవుతారని ఈ శ్లోకం తాత్పర్యము_*.``` *_1. అశ్వద్ధామ స్త్రోతం:~_* *_బ్రహ్మసుత్రోజ్వలభుజో రాజత్ కృష్ణా జినాసనః !_ _అశ్వత్థామ చిరంజీవి దీర్ఘాయుర్ దదాతుమే !!_* *_2. బలి చక్రవర్తి స్త్రోతం:~_* *_పాతాళ నిలయో ధనుర్భాణ ధనో నృపః ! విష్ణు పాదాంకిత శిరా: చిరంజీవి ప్రసీదతు!_!* *_3. వ్యాస మహర్షి స్త్రోతం:~_* *_వ్యాసః సమస్త ధర్మాణం వక్తా మునివరేడితః !_ _చిరంజీవి దీర్ఘమాయుః దదాతు జటిలో మమ !!_* *_4. హనుమత్ స్త్రోతం:~_* *_హనుమాన్ రామ పాదాబ్జ సంగీవర్ని వరసుచిః !_ _సంజీవనో స హర్తాచ రోగ శాంతిం దాదాతుమే !!_* *_5. విభీషణ స్త్రోతం:~_* *_విభీషణో ధర్మపరో రామార్చన పరాయణ:! దదాతు చిరoజీవిత్త్వం చిరంజీవి జితేంద్రియః !!_* *_6. కృపాచార్య స్త్రోతం:~_* *_కృపః కృపా పయోరాసిః తపస్వీ చిరవస్త్రద్రుతు ! వితనోతు ప్రసన్నాత్మ యావజ్జీవం ఆరోగతాం !!_* *_7. పరశురామ స్త్రోతం:~_* *_పరసూజ్వల హస్తా హస్తాభ్జో జటా మండల మండితః_ ! _దదాతు చిరoజీవిత్త్వం ప్రసన్నాత్మ భృగూద్వః !!_* *వీరితో పాటు మార్కండేయమహర్షి, ధృవుడు మరియు ప్రహ్లాదుడు కూడా జన్మతః చిరంజీవులు అని చెప్పబడుచున్నారు*. *ఆవు పాలు, బెల్లము, నల్లనువ్వులు కలిపిన మిశ్రమాన్ని నివేదన చేసి సప్త చిరంజీవి శ్లోకాన్ని చదివి తీర్ధంగా మూడు సార్లు తీసుకోవడం ద్వారా అపమృత్యు దోషం తొలుగుతుంది* #మన సంప్రదాయాలు సమాచారం