జయ జయహో మన జననేత వైఎస్ జగనన్న గారి రాజ్యం!సుభిక్ష్యంగా వర్ధిల్లాలి మరో పది కాలాల పాటు వైస్సార్సీపీ పార్టీ! ( వైస్సార్సీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని)! ( 12 - 3 - 2026)
సంక్షేమ పతకాల అమలులో,పేద, సామాన్య,బడుగు,బలహీన వర్గాలను ఆదుకోవడంలో,మహిళల శ్రేయస్సుకు, అభివృద్ధికి పాటు పడటంలో,రైతుల పురోగతికి,సంక్షేమానికి పెద్ద పీట వేయడంలో సాటిరారు మరేవ్వరూ మన జననేత వైఎస్ జగనన్న గారి నాయకత్వానికి.కేవలం ప్రజలకు హామీ ఇవ్వడమే కాదు చేసి చూపించడంలో,ప్రజల కష్టాల,కడగండ్లను తీర్చడంలో మడమ తిప్పని నేత మన ప్రియతమ మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహనరెడ్డి గారు!
ఏదిఏమైనా ప్రాణసమానమైన తండ్రి దివంగత డాక్టర్ వైస్సార్ నింగికి పయనమై వెళ్ళినప్పుడు పుట్టెడు దుఃఖసాగరంలో మునిగిపోయి కూడా తన తండ్రి వైస్సార్ అశువులు బాసిన సందర్భాన్ని తట్టుకోలేక మరణించిన ఎందరో పార్టీ అభిమానుల కుటుంబాలను ఓదార్చేందుకు,వారికి అండగా ఉండేందుకు,వారికి నేనున్నాను అనే భరోసా ఇచ్చేందుకు ఓదార్పు యాత్ర చేపట్టి వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేద,సామాన్య,బడుగు,బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి పట్ల తన అంకితభావాన్ని,చిత్తశుద్ధిని వ్యక్తం చేయడమే కాదు తాను అధికారం లోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తన తండ్రి దివంగత డాక్టర్ వైస్సార్ లా ఓక మంచి పరిపాలన దక్షకుడిగా అనంత పేరు,ప్రఖ్యాతలు గడించారు మన జనం మెచ్చిన జన హృదయనేత వైఎస్ జగనన్న గారు.ఏమైనా పేద, సామాన్య,బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి,రైతుల పక్షపాతి తన తండ్రి గారు అయిన దివంగత డాక్టర్ వైస్సార్ అడుగుజాడల్లో నడవాలనే ఏకైక లక్ష్యం తో వైస్సార్సీపీ పార్టీని స్థాపించి ఆ పార్టీని అత్యంత సమర్థవంతంగా ముందుకు నడిపించి నేటికి 16వసంతాలు పూర్తి అయిన ఈ ప్రత్యేక సందర్బంగా మన ప్రియతమ మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహనరెడ్డి గారికి,రాష్ట్ర వ్యాప్తంగా వున్న వైస్సార్సీపీ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు,అభిమానులకు ఇవే నా అభిమాన,ఆత్మీయ పూర్వక శుభాకాంక్షలు!
- బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా. #ysr
00:29

