ShareChat
click to see wallet page
search
సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు పై గిద్దలూరు నియోజకవర్గంలో ఫిర్యాదుల వెల్లువ.. ​గిద్దలూరు : ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల వైకాపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన అసభ్యకర, వ్యక్తిగత విమర్శలను గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు గిద్దలూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంబటి రాంబాబు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ​ఎమ్మెల్యే గారి మార్గదర్శకత్వంలో మండల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎక్కడా సంయమనం కోల్పోకుండా, చట్టం పై గౌరవంతో శాంతియుత వాతావరణంలో ఫిర్యాదులు అందచేశారు. గిద్దలూరు నియోజకవర్గంలోని ​అర్ధవీడు, ​కంభం,​ బెస్తవారిపేట, రాచర్ల,​ కొమరోలు, ​గిద్దలూరు పోలీస్ స్టేషన్లలో లిఖితపూర్వక ఫిర్యాదులు అందజేశారు. ​ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, అంబటి రాంబాబు తీరు పై నిప్పులు చెరిగారు. ​వ్యక్తిగత దూషణలు తగవని, ప్రజాస్వామ్యంలో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ, పదే పదే వ్యక్తిగత దూషణలకు దిగడం అంబటి రాంబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. గత ఎన్నికల్లోనే ప్రజలు వైకాపాకు తగిన గుణపాఠం చెప్పారని, ఇంకా ఇటువంటి వ్యాఖ్యలు కొనసాగిస్తే ఆ పార్టీకి రాష్ట్రంలో ఉనికి కూడా ఉండదని హెచ్చరించారు. "ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని, కోట్లాది మంది ఆరాధ్య దైవమైన చంద్రబాబు గారిని దూషించడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి పై బురద జల్లడం మానుకోవాలని, లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని గిద్దలూరు టీడీపీ నాయకులు హెచ్చరించారు.. #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
🎯AP రాజకీయాలు - ShareChat