* దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగఫలమే మనం అనుభవించే స్వేచ్చా వాయువులు..
* అమరవీరుల ప్రాణ త్యాగం - దేశానికి గర్వకారణం..
* అమరవీరుల స్తూపం ప్ర్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు...
* గిద్దలూరు నియోజకవర్గంలో దేశ భక్తికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవ కార్యక్రమం రాచర్ల మండలం, ఆవీడు గ్రామంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, మరియు మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మొదటగా జాతీయ జెండాను ఆవిష్కరణ చేసి జెండా వందనం చేశారు అనంతరం రిబ్బన్ కట్ చేసి అమరవీరుల స్తూపాన్ని ప్రారంభించారు. దేశ రక్షణలో అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పించి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు..
* దేశ రక్షణలో సైనికుల పాత్రను కొనియాడుతూ ప్రసంగం చేశారు. దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ, మనందరి క్షేమం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికుల త్యాగం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు పేర్కొన్నారు. అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించిన ఈ స్తూపం, రాబోయే తరాలకు దేశభక్తిని పెంపొందించే స్ఫూర్తి కేంద్రంగా నిలుస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు గారు ఆకాంక్షించారు. గిద్దలూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందని, ఇక్కడ నుంచి అత్యధిక సంఖ్యలో యువత భారత సైన్యంలో (Army) చేరుతున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. దేశ సేవ కోసం ప్రాణాలకు తెగించి పోరాడే ధైర్యవంతులు గిద్దలూరు మట్టిలో పుట్టడం మనందరికీ గర్వకారణమన్నారు. ప్రతి గ్రామం నుండి ఎవరో ఒకరు దేశ రక్షణలో పాలుపంచుకోవడం ఈ ప్రాంత గొప్పతనానికి నిదర్శనమన్నారు. మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించడంలోనూ, వారి సంక్షేమ పథకాలను చేరవేయడంలోనూ ముందుంటానని హామీ ఇచ్చారు. "సైనికుడు అంటే కేవలం ఒక వృత్తి కాదు, అది ఒక పవిత్రమైన బాధ్యత అని గిద్దలూరు గడ్డపై ఇంతమంది దేశభక్తులు ఉండటం నాకెంతో సంతోషాన్నిస్తోందన్నారు.
* ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.. #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు


