ఒకప్పుడు జనాలు ఎలా బ్రతికే వారు అంటే ....
కష్టపడి పని చేసుకొని వచ్చిన డబ్బులతో ఇంట్లో కుటుంబ సభ్యులను పోషించుకుంటూ సంతోషంగా గడిపేవారు. ఉన్న దాంట్లోనే నీతిగా నిజాయితీగా బ్రతికే వాళ్ళు.
అందుకనే అప్పట్లో వాళ్లకు ఎటువంటి రోగాలు గాని అనారోగ్య సమస్యలు గానీ ఉండేవి కావు.
ఎంత కాదనుకున్నా 70 ,
80 సంవత్సరాలు బ్రతికేవారు.
ఇప్పుటి జనాలు కష్టపడకుండా ఈజీ మనికి అలవాటు పడిపోయారు.
అవతల వాళ్లను అడ్డగోలుగా మోసం చేయాలి ఆ వచ్చిన డబ్బులతో కుటుంబ సభ్యులకు లగ్జరీ లైఫ్ ని ఇవ్వాలి.
కష్టపడి పని చేసుకొని నీతిగా నిజాయితీగా బ్రతకాలి అనే మనస్తత్వాలు ఇప్పటి మనుషులకు ఉండటం లేదు.
ఎవరిని కదిపిన అడ్డగోలుగా సంపాదించడమే....
తద్వార వచ్చిన డబ్బులను పోగుచేసుకుని లగ్జరీలైట్లను అనుభవించడం.
పోనీ సంతోషంగా కొన్నాళ్లు బ్రతుకుతారా అంటే ..... అది లేదు.
బ్రతకరు.
అలాంటివాళ్లు 30 40 సంవత్సరాలకే రోగాలతో పైకి పోతున్నారు.
ఎందుకంటే....
మనం చేసే ప్రతి పాపపు పనికి కర్మ అనేది ఒకటి ఉంటుంది.
ఒకప్పుడు ఎప్పుడో గాని చేసిన పాపాలకు ఫలితం అనుభవించేవారు.
కానీ ఇది కలియుగం.
మనం చేసిన పాపాలు మనం ఇంటికి రాకముందే మనకంటే ముందుగానే వచ్చి కూర్చుంటున్నాయి.
ఏ రూపంలో అంటారా.... భయంకరమైన వ్యాధుల రూపంలో....
ఒక్క రోగం వస్తే చాలు జీవితం సంక నాకి పోయినట్లే....
ఎదుటివారి పొట్టను కొట్టి మనకు పొట్టను నింపుకోవాలంటే ఎలా కుదురుతుంది ?
ఎదుటివారు ఉసురుతో నీకు వచ్చే ప్రతి పైసా పాపపు సొమ్ము.
అది నీ ఆయుష్ ను రోజురోజుకి దిగజారుస్తుంది. మనశ్శాంతి లేకుండా చేస్తుంది.
కాబట్టి....
ఎదుటివారి పొట్టను కొట్టి నీ కడుపుని నింపుకోవాలనుకుంటే... నీవు కడుపునిండా తినడానికి కూడా పనికిరాకుండా ఆ భగవంతుడు చేస్తాడు.
నీవు కష్టపడి చెమటోర్చి సంపాదించిన సంపాదన ఎప్పటికి అది నీ దగ్గరే ఉంటుంది.
అప్పనంగా వచ్చింది అప్పనంగానే పోతుంది.
పాపపు సొమ్ము ఎలా వచ్చిందో అలాగే పోతుంది.
నీతిగా నిజాయితీగా బ్రతకడం నేర్చుకోండి.
భగవంతుడు ప్రతీ ఒక్కరిని చూస్తూ ఉంటాడని మర్చిపోకండి.
ఇంకొక విషయం మనం చేసే ప్రతి పాప పని మన పిల్లలకే ఉంటుంది.
అత్యాశతో, మీ పిల్లల మీద ఉన్న ప్రేమతో.... అడ్డగోలుగా అవతల వాళ్లను మోసం చేసి
మీ పిల్లలకు ఆస్తులు సంపాదించి కూడబెట్టి ఆస్తులు సంపాదించి పెట్టడం దేవుడి ఎరుక.
మీతో పాటు మీ పిల్లలకు కూడా పాపాన్ని మూట కడుతున్నారని మర్చిపోకండి.
#💗నా మనస్సు లోని మాట #🗣️జీవిత సత్యం #😃మంచి మాటలు #తెలుసుకుందాం


