*_MAAGHA PURANAM -- 25_*
*_25వ అధ్యాయము_*
*_సులక్షణ మహారాజు వృత్తాంతము_*
*వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి నూరుగురు భార్యలు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తనదిగా భావించి నివారణ చేసేవాడు*.
*సులక్షణ మహారాజు రాజాధిరాజైనా, తరగని సంపత్తికలవాదు అయినప్పటికీ “అపుత్రస్యగతిర్నాస్తి” అన్నట్టుగా పుత్రసంతానము లేకపోవడముచే తనకు గతులు లేవు కదా! తన వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది ? తనతో తన వంశం అంతరించి పోవలసినదేనా? అని దిగులు పడుతూ ఉండేవాడు*.
*ఒకనాడు తన రధమెక్కి నైమిశారణ్యములో మునులు తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునకు వెళ్ళి వారికి నమస్కరించి*-
*“మునిశ్రేష్ఠులారా! నేను వంగ దేశాధిపతిని. నా పేరు సులక్షణుడు. నాకు నూరుగురు భార్యలు*. *ఒక్కరికీ సంతానము కలుగలేదు. నాకు ఎలా పుత్రసంతానము కలుగుతుందో వివరించమని అంజలి ఘటించి ప్రార్థించాడు*. *మహారాజు మాటలకు మునులు జాలికలిగి - “రాజా! నీకు సంతానము లేకపోవుటకు కారణము –* *పూర్వజన్మలో నువ్వు సౌరాష్ట్రమును పాలిస్తున్నప్పుడు ఆ జన్మలో ఒక్కసారి అయినా మాఘస్నానము చేయలేదు. ఏ ఒక్క దానము ఇవ్వలేదు*. *ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయను అయినా దానము చేసి ఉంటే ఈ జన్మలో పుత్రసంతతి కలిగి ఉండేది. వెనుక జన్మ కర్మఫలం వలన నీకు ఈ జన్మలో పుత్రసంతతి కలుగలేదు*. *ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండమును దానము చేసినవారికి సందేహము లేకుండా తప్పక పుత్రసంతానము కలుగుతుంద” ని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజుకిచ్చి “దీనిని నీ భార్యలతో తినిపించమని ” చెప్పారు. మహాభాగ్యం అని ఫలమును కండ్లకద్దుకొని ఇంటికి వెళ్ళిపోయాడు.*
*భర్త రాక విని భార్యలు ఎదురెళ్ళి మంగళహారతులు ఇచ్చి సేద దీర్చారు*. *రాజు తెచ్చిన మంత్రఫలము గురించి వివరించి “భోజనానంతరం తినమ” ని చెప్పి తన గదిలో ఫలమును భద్రపరచి పత్నులతో భోజనశాలకు వెళ్ళాడు*. *నూరుగురు భార్యలలో చివరి భార్యకు మిక్కిలి ఆశకలిగి ఫలమంతయు నేనే భుజించాలని తలపోసి, రహస్య మార్గమున రాజు పడకగదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీ ఎరుగని దానివలె అందరితో కలిసి తిరుగుతున్నది*.
*సులక్షణ మహారాజు, అతని భార్యలు భోజనము చేసి మంత్రఫలము వద్దకు రాగా బంగారు పళ్ళెమందు ఉంచిన ఫలము కనిపించలేదు. రాజుకు ఎక్కడలేని కోపంవచ్చి సింహగర్జన చేసాడు*. *మాకేమియు తెలియద” ని అందరూ ప్రమాణముగా చెప్పారు*.
*ఎంతో కష్టపడి మహామునుల అనుగ్రహము వలన సంపాదించిన మంత్ర ఫలమును చేతులారా పోగొట్టుకున్నాను అని దిగులుచెంది బెంగ పెట్టుకున్నాడు. చివరి భార్య “నాధా ! ఆశతో ఆ ఫలము నేనే తిన్నాను*. *క్షమింపుమ” ని వేడుకొన్నది*. *వంశోద్ధారకుడు ఒక్కడైనా పుట్టగలడని రాజు కొంత తృప్తి చెంది ఊరుకున్నాడు.* *గర్భవతి అయిన ఆమెను ఎంతో గారాబముగా చూసుకుంటున్నాడు.*
*కనిష్ఠభార్య గర్భవతి అయి నవమాసములు నిండుచున్నందున మిగిలిన భార్యలు కన్నెర్రతో ఓర్వలేక ఆమె పుత్రవతి అయినచో తమను రాజు సరిగా చూడడని ఆలోచించి ఆమె గర్భము చెడిపోయేలా, ఆమె తినే ఆహారములో ఔషధము కలిపి పెట్టారు*. *వరపుత్రుడు పుడుతున్నాడు గనుక గర్భంలోని శిశువునకు ఏ అపాయము కలుగలేదు.* *ఔషధము యొక్క తీవ్రత వలన ఆమెకు పిచ్చి పట్టింది*. *ఆ పిచ్చి వలన ఒకనాటి రాత్రి ఆమె అడవిలోనికి వెళ్ళిపోయింది.* *అప్పటికే నిండు చూలాలయి ఉన్నందున ఆ అడవిలో ఒక బండరాతి మీద మగశిశువును ప్రసవించింది.* *ఆమె ప్రసవించిన చోట ఒక పులి ఉన్నది. అది పురిటి వాసనను పసికట్టివచ్చిఆమెను చంపి తినేసింది.*
*ఆహారము కొరకు అడవిలో తిరుగుతున్న రాజహంసలు రక్తపు మరకలతో ఉన్న ఆ రాజబిడ్డను చూచి దగ్గరకు వచ్చి రెక్కలతో ఆ బాలుని తడియార్చి వాటి ముక్కులతో మెత్తటి గడ్డి తెచ్చి పరచి దానిపై పడుకో పెట్టి ఆ బాలునికి తేనె, పండ్లు తినిపించి ఒక ఏడాదివరకు పెంచాయి*. *ఎండాకాలం వస్తున్నందున అక్కడ వాటికి నీరు దొరకదని ఆ బాలుని కొంత దూరములో ఉన్న తమ జాతి హంసలకు అప్పగించి వెళ్ళిపోయాయి.*
*ఆ హంసలు ఆ బాలునికి కావలసిన పండ్లు, తేనె మొదలగునవి తెచ్చి పెట్టి పెంచుతుండగా ఒక తపస్వి తన ఇద్దరి భార్యలతో వచ్చి ఆ కోనేటిలో స్నానం చేసి దుస్తులు మార్చుకునే సమయములో హంసలతో తప్పటడుగులు వేస్తూ కొలను వద్దకు వస్తున్నబాలుని చూచి మక్కువ కలిగి వారివెంట తీసుకుని వెళ్ళారు*.
*వారి ఆశ్రమములో రాజకుమారునకు మూడు సంవత్సరములు వచ్చాయి. కొద్దికొద్దిగా మాటలు వస్తున్నాయి. వాడిని చూచి పెద్దభార్యకు ఈర్ష్య కలిగి, సాయంత్ర సమయమున ఆడుకొనుచుండగా పిల్లవాడిని ఎత్తుకోనిపోయి అడవిలో దిగబెట్టి వచ్చింది. భర్త వచ్చి పిల్లవాడు ఏడని అడిగినా అసలు సంగతి చెప్పలేదు* #మన సంప్రదాయాలు సమాచారం


