వైష్ణవ ఆలయాలలో ఇచ్చిన శేష పుష్పాలని తల మీద ధరించాలి. శేషామాలని మెడలో ధరించాలి.
శైవ ఆలయాలలో శేషాపుష్పాన్ని నంది మీద పెట్టాలి. దీనిని భరించే శక్తి మనిషికి లేదు.
గురుద్రోహం, గురువుకి మాట ఇచ్చి తప్పడం, గురువుని ధిక్కరించడం వంటి పాపాలు మఱియు 7జన్మల పాపాలు వైష్ణవ ఆలయాలలో ఇచ్చిన శేషామాలలని శిరస్సు మీద ధరిస్తే తొలగిపోతాయి.
మిత్రద్రోహి చేతి అన్నం, కృతఘ్నుడి చేతి అన్నం, అధర్మపరుడి చేతి అన్నం తింటే నరకంలో పడతారు. ఈపాపాలు తొలగాలంటే వైష్ణవ ఆలయంలో గురువుచే పూజించబడి ఇవ్వబడిన ప్రసాదాన్ని పుష్పాన్ని స్వీకరిస్తే తొలగిపోతాయి.
మీ ఇంట్లో పాడైన దేవుడి పటాలని ఆలయాలలో పడేసి వస్తే నరకంలో పడతారు. ఎక్కడైనా గొయ్యి త్రవ్వి పాతి పెట్టాలి.
అర్చన లేని ఇళ్లల్లో, భక్తి లేని ఇళ్లల్లో, ఏ దానము చేయని ఇళ్లల్లో లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. సంతానం లేకపోవడం, ఆరోగ్యం లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, జుట్టు విరబోసుకున్న ఇళ్లల్లో, భక్తులని నిందించే చోట, భక్తులు లేని ఇళ్లల్లో, వేదాలను అమ్ముకునే వారి ఇళ్లల్లో, అతిథి ని నిందించే వారి ఇళ్లల్లో, గురువింద, అసత్యం, తినకూడనివి తినడం, గోళ్ళల్లో గడ్డిని గిల్లడం, కొరకడం, బొటన వేలితో భూమిని రాయడం, సూర్యోదయ సమయంలో అస్తమించే సమయంలో తినడం, ఆచార హీనుల ఇళ్లల్లో, దిగంవరంగా ఇంట్లో తిరిగే వారి ఇళ్లల్లో, తడి కాళ్లతో తిరగడం, పడుకోవడం చేయకూడదు.కీళ్లనొప్పులు వస్తాయి. దిగంవరంగా నిద్రపోరాదు. భార్యని తిట్టకూడదు. భర్తని కూడా తిట్టకూడదు. తల్లిదండ్రులను నిందించే వారి ఇళ్లల్లో, ఉపవసాలను వ్రతాలను చేసేవారిని తిట్టే వారి ఇళ్లల్లో, జీవహింస చేసే వారి ఇలాలల్లో లక్ష్మీ ఉండదు.
#తెలుసుకుందాం


