*_🔟_*
*_శ్రీ మహావిష్ణు పురాణం_*
*_పదవ భాగం_*
*_బ్రహ్మ సృష్టి ప్రారంభం:_*
*నారాయణుడు,లక్ష్మీదేవి బ్రహ్మకి, సరస్వతికి సృష్టి బాధ్యత అప్పగించి అదృశ్యమయ్యారు*.
*తండ్రి శ్రీమహావిష్ణువు ఆదేశం ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి కార్యం ఆరంభించాడు. తనతో సృష్టిలో పాల్గొనటానికి మనస్సులో సంకల్పించి సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే నలుగురు మానస పుత్రులను సృష్టించాడు*.
*సనకసనందాదులు నలుగురు బాలుర రూపంలో నారవస్త్రాలతో, దండకమండలాలతో జన్మించి తండ్రి బ్రహ్మకు నమస్కరించారు. బ్రహ్మ వారిని చూసి "మీరు నలుగురు బ్రహ్మ మానస పుత్రులుగా ప్రసిద్ధి చెందుతారు. నా తండ్రి నారాయణుని ఆదేశం ప్రకారం చేయబోయే సృష్టిలో నాకు సహకరించండి" అని అడిగాడు*.
*సనకసనందాదులు బ్రహ్మతో "తండ్రీ! మాకు సృష్టి కార్యం పై ఆసక్తి లేదు. లోకాల నిర్మాణమే ఇంకా జరుగలేదు. మీ మానసం ద్వారా జన్మించిన మాకు నారాయణుడే ప్రియ దైవం. మా జీవితమంతా నారాయణ సంకీర్తనంలో గడుపుతాము. శ్రీహరి పాద సేవ చేయడమే మా కర్తవ్యం. మమ్మల్ని క్షమించండి" అని నారాయణ నామ సంకీర్తనం చేస్తూ వెళ్లి పోయారు*.
*బ్రహ్మదేవుడికి నిరాశ కలిగింది. సనకాదులు చెప్పినట్టు ముందు లోకాల నిర్మాణం చేస్తాను అని నిర్ణయించుకుని నారాయణుని సహకారం కోరుతూ అష్టాక్షరి మంత్రం నియమ నిష్టలతో జపం చేశాడు. శ్రీమహావిష్ణువు కరుణించి బ్రహ్మకు సహాయం చేయడానికి తన అంశతో విశ్వకర్మను సృష్టించి పంపాడు*.
*దేవశిల్పి బ్రహ్మ వద్దకు వచ్చి బ్రహ్మ మనస్సులో గల లోకాల నిర్మాణం ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాడు. ఆ ప్రకారం లోకాల నిర్మాణం చేశాడు. సృష్టి సౌలభ్యం కోసం బ్రహ్మాండాన్ని మూడు లోకాలుగా విభజించాడు. వాటికి భూ, భువర్లోక, సువర్లోకాలు అని పేరు పెట్టారు*.
*ఆకాశంలో సూర్య కిరణాలు ఎంత వరకు ప్రసరిస్తాయో అంతవరకు భూలోకం ఏర్పాటు చేయబడింది. భూమికి లక్ష యోజనాల దూరంలో చంద్ర మండలం, చంద్ర మండలానికి పదివేల యోజనాల దూరంలో సూర్య మండలం ఏర్పాటు చేయబడ్డాయి. రెండు లక్షల యోజనాల దూరంలో నక్షత్రం మండలం ఏర్పాటు అయ్యింది. ఆపైన రెండు లక్షల యోజనాల దూరంలో బుధ లోకము, బుధలోకానికి రెండు లక్షల యోజనాల దూరంలో శుక్రలోకము ఏర్పడింది.*
*శుక్రలోకానికి రెండు లక్షల ఆమడల దూరంలో కుజ లోకము, కుజలోకానికి రెండు లక్షల ఆమడల దూరంలో గురు (బృహస్పతి) లోకము, గురులోకానికి రెండు లక్షల ఆమడల దూరంలో శనిలోకము ఏర్పడ్డాయి. శని లోకానికి పది లక్షల ఆమడల దూరంలో సప్తఋషి మండలము, సప్త ఋషి మండలానికి లక్ష ఆమడల దూరంలో ధృవమండలము ఏర్పాటు చేయబడ్డాయి. భూమి పైన ఇంతవరకు ఏర్పాటు చేయబడిన లోకాలన్నింటిని కలిపి "భువర్లోకాలు" అంటారు.*
*భూమి నుండి రెండు కోట్ల ఆమడల దూరంలో జనలోకము, భూమి నుండి నాలుగు కోట్ల దూరంలో తపోలోకము ఏర్పడ్డాయి. తపోలోకానికి నాలుగు కోట్ల దూరంలో బ్రహ్మదేవుని నివాసానికి సత్యలోకం ఏర్పడింది. సత్యలోకం నుండి ఎనిమిది కోట్ల దూరంలో లక్ష్మీనారాయణుల నివాసం కోసం వైకుంఠం నిర్మించబడింది. వైకుంఠానికి ఎడమవైపున పదహారు కోట్ల ఆమడల దూరంలో శివుని నివాసము కోసం కైలాసం ఏర్పాటు చేయబడింది. లోకాలన్నిటి పైన కృష్ణుడు, రాధదేవిల శాశ్వత నివాసమైన గోలోకము ఉంది. జనలోకము నుండి గోలోకము వరకు గల లోకాలను సువర్లోకాలు అంటారు*.
*భూమి క్రింద సప్త మహా రంధ్రాలు ఉన్నాయి. ఒక్కొక్క బిలం యోజనాల విస్తీర్ణం ఉంటుంది. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళము అనే ఏడు అధోలోకాల నిర్మాణం ఈ బిలాలలో జరిగింది. వీటినన్నింటిని కలిపి పాతాళ లోకాలు అంటారు.*
*పద్నాలుగు లోకాలలో ఆ లోకవాసులు నివసిండానికి అసంఖ్యాక భవనాలు ఏర్పరచబడ్డాయి. బ్రహ్మ ఇచ్చిన దివ్య దృష్టితో భూత వర్తమాన, భవిష్యత్తు కాలాల అవసరాలు గమనించి విశ్వకర్మ తన శిల్పకళా నైపుణ్యంతో ఈ లోకాల నిర్మాణం చేశాడు.*
*ఈ భూ భువర్లోక సువర్లోకాలు అన్ని అశాశ్వతాలు. వైకుంఠం, గోలోకం మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉంటాయి.* *కల్పాంత ప్రళయంలో లోకాలన్ని పరబ్రహ్మలో విలీనం అవుతాయి.* *మహావిష్ణువు తిరిగి సృష్టి చేయ సంకల్పించినప్పుడు లోకాలు పునః ఉత్పన్నమవుతాయి. బ్రహ్మతో సహా పునఃసృష్టి ప్రారంభం అవుతుంది* #మన సంప్రదాయాలు సమాచారం

