ShareChat
click to see wallet page
search
ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. "ఇందిరమ్మ రాజ్యం" అని చెప్పుకుంటూ, రేవంత్ రాష్ట్రాన్ని పూర్తిగా "గూండాల రాజ్యం"గా మార్చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయంపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా? లేనట్లా? పోలీసులు చట్టాన్ని కాపాడాల్సింది పోయి కాంగ్రెస్‌కు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరించడం దుర్మార్గం. దాడులకు పాల్పడుతున్న మూకలను పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదు? కాంగ్రెస్ సన్నాసుల్లారా! మీ చిల్లర దాడులకు బీఆర్ఎస్ ఏమాత్రం భయపడదు. గ్రామ సభల్లో ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొంటాం. ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం! #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👨‍💼కె. టీ. రామారావు #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్
📽ట్రెండింగ్ వీడియోస్📱 - ShareChat
01:05