ShareChat
click to see wallet page
search
🪷96శ్రీలింగమహాపురాణం🪷 🍀మహదేవుని పూజలు🍀 #తొంభై ఆరవ భాగం# మహాదేవుని పూజకు సుగంధితమైన గోమయ జలము చల్లి ఒక పద్మ మండలము ఏర్పాటు చేయాలి. ముత్యాలు, ఇంద్రనీలాలు, పద్మరాగాలు, మరకతాలు, స్ఫటికములు, స్వర్ణములను పద్మ మండల నిర్మాణానికి ఉపయోగించాలి. ఇలా చేయడానికి శక్తి సామర్థ్యాలు లేని వ్యక్తులు పైన చెప్పినవాటికి సమానమైన వర్ణము (రంగు) గల ఇతర పదార్థములను ఉపయోగించి వచ్చును. ఈ మండలము పది చేతుల విస్తారము కలిగి మహాదేవునికి సమీపంలో ఉండాలి. మండలములోకి దశ శక్తులతో కూడిన మహాదేవుని ఆవాహన చేయాలి. ఐదు, ఆరు జ్ఞానేంద్రియాలు, ఎనిమిది పృథ్వాది శరీరాలు ద్వారా కోరిన కోరికలు ఇచ్చేట్టు పూజ చేయాలి. తరువాత భక్తులు దశ కోణములు గలిగిన మండలములలో ఎనిమిది శరీరాలు, పది జ్ఞానేంద్రియాల ద్వారా ఈశానుని పూజించాలి. పిదప సాష్టాంగ ప్రణామం చేసి దేవాదిదేవునకు నైవేద్యం సమర్పించాలి. ఈవిధంగా పూజ చేసినవారికి భూదాన ఫలము లభిస్తుంది. ఇలా చేయడానికి ధన సంపదలు లేని వ్యక్తి తండూల చూర్ణాది పదార్థములను పద్మ మండలము చేయడానికి ఉపయోగించాలి. భక్తితో ఈ విధంగా చేసిన పూజకు సమానమైన పుణ్యఫలం లభిస్తుంది. ద్వాదశ కోణముల గల మండపమును ఏర్పరచి రత్నముల చూర్ణము చేత కమల మండలము చిత్రము ఏర్పరచాలి. మండప మధ్యలో ద్వాదశ దేవీ సహిత ఆదిత్యులు స్థాపించాలి. గ్రహములతో చుట్టుకొనబడిన సూర్యుని పూజించాలి. ఈ పూజ చేసిన భక్తులకు సూర్య సాయిజ్యం లభిస్తుంది. భక్తుడు ప్రకృతిలో గల దేవీ విగ్రహములను ఎఱ్ఱని పదార్థములతో గీసిన షట్కోణములు గల చిత్రము గీసి స్థాపన చేయాలి. చిత్ర మధ్యభాగంలో బ్రహ్మరూపిణిని నుంచి ప్రకృతిదేవి పూజలు చేయాలి. కుడి వైపున సత్త్వగుణము గల విగ్రహము, :ఎడమవైపు రజోగుణము గల విగ్రహము, ఎదురుగా దశ గుణములు గల విగ్రహమును, మధ్యతో అంబికాదేవిని ఉంచి పూజలు చేయాలి. దక్షిణములో పంచ భూతాలను, తన్మాత్రలను పూజించాలి. ఉత్తరాన పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రయాలను విధి ప్రకారం పూజించాలి. షట్కోణములలో ద్వి ఆత్మలను అనగా ఆత్మ, అంతరాత్మలను, బుద్ధి, అహంకారములను మహాతత్త్వ సహితముగా పూజించాలి. అప్పుడు యజ్ఞ ఫలము సంపూర్ణంగా లభిస్తుంది. మునులారా! దశ ప్రాకృత మండలములలో జరిగే పూజ విధానాలు తెలిపాను. ఇప్పుడు సర్వ కోరికలు తీర్చే పూజా విధానం చెబుతాను. మంత్రాలతో భక్తుడు భూమిని జలముతో చిలకరించి గోమయముతో అలకాలి. గోచర్మముతో సమానంగా నూట యాభై చేతులు గల ఒక వర్ణ కర మండలము ఏర్పరచాలి. దీనిని మనోహరమైన ఛత్రముల చేత అలంకరించాలి. అశ్వత్థ పత్రములు (రావి ఆకులు) చేతగాని, బంగారము చేత చేయబడిన అర్థచంద్రాకారపు రేకుల చేతగాని అలంకరింప చేయాలి. వికసించిన నీల, శ్వేత, రక్త వర్ణ పద్మ పుష్పాల చేత అలంకరించాలి. మండపంలో ముత్యాల దండలు వ్రేలాడదీయాలి. తెల్లటి కేతనాలు, తెల్లటి పతాకాలతో అలంకరించాలి. వైజయంతీ మృత్తికతో (మట్టితో) చేసిన శ్వేత పాత్రను, జలముతో నింపిన కుంభమును ఉంచాలి. పంచ ప్రకారం ధూపములను, దీపములను ఒక వరుసలో ఉంచాలి. వివిధ రంగులతో గానీ, శ్వేత వర్ణ చూర్ణముతో గానీ యాభై పత్రము గల ఒక సుందర కమలము ఏర్పాటు చేయాలి. కమల విస్తీర్ణం ఒక చేయి అంత ఉండాలి. వేదిక పై దేవి సహితంగా రుద్రుని ప్రతిష్ఠించాలి. పద్మ దళములలో పూర్వ దిశ క్రమములో రుద్రులతో పాటు మంత్రాలు వ్రాయాలి. మంత్రములకు మొదట ప్రణవమును (ఓం) ఉంచి రుద్ర నామాలు వ్రాయాలి. గంధ,ధూపాలు, సుగంధ పుష్పాలతో పూజలు చేయాలి. యాభై మంది బ్రాహ్మణులకు విధి పూర్వకంగా భోజనాలు పెట్టిన తరువాత వారికి జపమాల యజ్ఞోపవీతం కుండలములు కమండలములు, ఆసనము, దండము, మకుటము, వస్త్రములు దానముగా ఇవ్వాలి. మహాశివునకు మహాచరువు నైవేద్యంగా సమర్పించాలి. ఒక నల్లని గోవును, వృషభాన్ని శివునకు సమర్పించాలి. చివరన చూర్ణముతో చేయబడిన మండలమును శివునికి సమర్పించి ఉపయోగించిన సామాగ్రిని నివేదనగా ఇవ్వాలి. భక్తుడు ఓంకారముతో ఆరంభించి ప్రతి అక్షరమును, శివమంత్రమును పూజ సమయంలో జపించాలి. వివిధ వర్ణములు గల మండలము ఏర్పాటు చేసి ఈవిధంగా పూజించిన భక్తునికి యోగికి లభించిన ఫలము లభిస్తుంది. శివాలయ ముందుభాగంలో ఏ పదార్ధములతో నైనా పూత పూసి, శివాలయ ఉత్తర, దక్షిణ లేక పశ్చిమ భాగాలలో చతుష్కోణ మండలము ఏర్పాటు చేసి, పుష్పాలు, అక్షతలు, చూర్ణములతో అలంకరించి, విగ్రహమును పుష్పాక్షతల చేత పూజించిన వ్యక్తి సర్వ పాపాల నుండి విముక్తి పొందుతాడు. దేవాలయ గర్భగృహాపు నాలుగు వైపుల ఒక సారైన అలికి, సుగంధ పుష్పాలతో అలంకరించి, సుగంధ ధూపాలతో సుగంధితం చేసి శివుని ప్రార్థించిన వ్యక్తి తప్పక శివలోకానికి వెళతాడు. నూరు కోట్ల కల్పాల వరకు సుఖభోగాలు అనుభవిస్తాడు. శివమందిరమును సుగంధ పుష్పాలతో సుగంధితం చేసిన వ్యక్తి శరీరము సుగంధితము అవుతుంది. సుగంధిత దేహముతో ఆ వ్యక్తి మొదట గంధర్వ లోకములో పూజితుడై సుఖభోగాలు అనుభవించి భులోకములో రాజుగా జన్మిస్తాడు. మునులారా! ఆదిదేవుడైన శివుడే సృష్టి స్థితి లయ కారకుడు. మోక్షము లభించడానికి శివ పూజను మించిన ఉత్తమ సాధనం లేదు. భూలోకమున జన్మించిన మానవులందరు నిత్యానిత్యుడు, వ్యక్తావ్యక్తుడు, లింగ స్వరూపుడు, విగ్రహ స్వరూపుడు అయిన శివుని నిత్యం పూజించాలి. *తరువాతకధ రేపటి భాగంలో చదువుదాం*. https://chat.whatsapp.com/DnFG7pWG3BkH6MKxaSFRFb #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ 🌹శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో🌹 💜 ఓం శ్రీఉమా మహేశ్వరాయ నమ:💜 🙏లోకా:సమస్తాః సుఖినోభవన్తు🙏 రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.* (సర్వం శ్రీశివార్పణమస్తు) 🌷🙏🌷 శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి. 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
🌅శుభోదయం - ShareChat
భగవాన్ రమణ
WhatsApp Group Invite