గిద్దలూరు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి..
ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలి..
విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే ముత్తుముల సమీక్షా సమావేశం..
గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు శనివారం మధ్యాహ్నం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నియోజకవర్గ అభివృద్ధిలో కీలక అడుగుగా నిలిచింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి.
ఈ సమావేశంలో ముఖ్యంగా లో-వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని,
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య లో-వోల్టేజ్. దీనివల్ల గృహోపకరణాలు పాడైపోవడమే కాకుండా, రాత్రి సమయాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిని అధిగమించడానికి అవసరమైన అదనపు లైన్లు మరియు కెపాసిటర్ల ఏర్పాటు పై చర్చించారు. రైతులకు సాగునీరు అందడంలో విద్యుత్ కొరత ఉండకూడదని అశోక్ రెడ్డి గారు స్పష్టం చేశారు. లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వెంటనే కొత్త ట్రాన్స్ ఫార్మర్లను మంజూరు చేయాలని కోరారు. సాగులో ఉన్న ప్రతి ఎకరాకు నాణ్యమైన విద్యుత్ అందేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశించారు.
నియోజకవర్గంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా, పాత సబ్ స్టేషన్ల పై భారం తగ్గించేందుకు కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం అత్యవసరమని చర్చించారు. ఇందుకోసం ప్రతిపాదించిన స్థలాలు మరియు నిధుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు APCPDCL ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు, ట్రాన్స్ కో ఎస్.ఈ రాజగోపాల్ నాయుడు, ఈ.ఇ కిషోర్ కుమార్, కృష్ణారెడ్డి, డీఇఇ మేకల రవిశంకర్, మరియు APCPDCL ఈ.ఈ నాగేశ్వర రావు, కన్స్ట్రక్షన్ డీ.ఇ.ఇ సత్యనారాయణ, కన్స్ట్రక్షన్ ఈ.ఇ నాగేశ్వరరావు, కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ ఈ.ఈ రమేష్, గిద్దలూరు, కంభం డీఈ లు శేషగిరిరావు, శ్రీనివాసరెడ్డి, మరియు APCPDCL, ట్రాన్స్ కో ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.. #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు


