ShareChat
click to see wallet page
search
సమిష్టిగా రాణించి ముచ్చటగా మూడోసారి టి20 ప్రపంచ కప్ విశ్వవిజేతగా ఆవిర్భవించిన టీం ఇండియా! లేదా టీం ఇండియా దూకుడుకు,పరాక్రమానికి చేతులెత్తేసిన ' కివీస్ ' జట్టు! గతంలో 2007,2024లలో టి20 వరల్డ్ కప్ ను సాధించిన టీం ఇండియా ఇప్పుడు వరుసగా మూడోసారి 2026లో టి20 ప్రపంచ కప్ ను ముద్దాడింది మన టీం ఇండియా.అహ్మదాబాద్ వేదికగా ఆదివారం నరేంద్ర మోదీజీ స్టేడియంలో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సూర్య కుమార్ కెప్టెన్సీ సారథ్యంలో భారత్ ఏకంగా 96 పరుగుల తేడాతో కివీస్ జట్టును చిత్తు చేసి కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల హృదయాలను ఆనందడొలికల్లో ముంచెత్తింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఈ మెగా టోర్నమెంట్ లో ఒక్క దక్షిణాప్రికాజట్టుతో మ్యాచ్ లో మినహా మిగతా ఎనిమిది మ్యాచుల్లో సూర్యకుమార్ కెప్టెన్సీలోని టీం ఇండియా తమ అమోఘమైన,అసాధారణ ఆటతీరుతో తమ స్థాయికి తగ్గట్లు రాణించి అందరి చేత శెబాష్ అనిపించుకుంది.ఈ టి20 ప్రపంచకప్ టోర్నమెంట్ లో టీం ఇండియా అటు బ్యాటింగ్,ఇటు బౌలింగ్,ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లో అద్భుతమైన ప్రతిభ చూపి ప్రత్యర్థి జట్లను ఆట కట్టించడంలో నూటికి నూరుపాళ్ళు సపలీకృతం కావడం ఎంతైనా హర్షణీయం.అన్నింటికి మించి సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ను,ఫైనల్లో కివీస్ వంటి అత్యంత ప్రొఫెషనల్ ఆటతీరు కలిగిన ప్రతిభావంతమైన జట్లను బురిడీ కొట్టించి మరీ టీం ఇండియా టి20 విశ్వకప్ విజేతగా ఆవిర్భవించడం ఓక గొప్ప విశేషం.అదేవిధంగా చావో రేవో తేల్చుకోవాల్సిన ఈ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించిన సంజు సామ్సన్ ( 46 బంతుల్లో 89; 5 ఫోర్లు,8 సిక్స్ లు),ఇషాన్ కిషన్ ( 25 బంతుల్లో 54; 4 ఫోర్లు,4 సిక్స్ లు ),అభిషేక్ శర్మ ( 21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్స్ లు ) అర్థ సెంచరీలతో రాణించారు, చివరి ఓవర్లో శివం దూబే ( 8 బంతుల్లో 26 నాటౌట్, 3 ఫోర్లు,2 సిక్స్ లు ) చెలరేగిపోవడంతో అత్యంత భారీ స్కోరును టీం ఇండియా కివీస్ జట్టు ముందు ఉంచగలిగింది.ఇక అ తరువాత కాగల కార్యం గాంధర్వులు తీర్చినట్లు జస్టిస్ బుమ్రా ( 4 వికెట్లు ), అక్షర్ పటేల్ ( 3 వికెట్లు ) తమ బౌలింగ్ లలో మంచి వాడి వేడి ప్రదర్శించి ప్రత్యర్థి జట్ల బ్యాటర్ల పనిపట్టడంతో కివీస్ జట్టు 19 ఓవర్లలో కేవలం 159 పరుగులే సాధించి 96 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలు అయ్యింది.ఇంకా చెప్పుకుంటూ పోతే నిన్న మొన్నటి వరకు కూడా బ్యాటింగ్ లో ఫెయిల్ అవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంజు సామ్సన్ ఎట్టకేలకు కోల్పోయిన ఫామ్ ను దొరకబుచ్చుకొని ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ టి 20 విశ్వకప్ లో 5 ఇన్నింగ్స్ లలో 321 పరుగులు సాధించి ' ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు ' సైతం గెలుచుకొని జట్టులో ఎవరికీ అందనంత ఎత్తులో అతను నిలువడం ఎంతైనా భారత క్రికెట్ కు సంబంధించి ఓక గొప్ప శుభ పరిణామం.ఇక అన్యూహంగా టీంకు దూరమై తిరిగి వచ్చిన తరువాత ఇషాన్ కిషన్ ఈ టి20 విశ్వకప్ లో మరింత చేలరేగిపోయి పాకిస్తాన్ మ్యాచ్ తో పాటు, సెమిస్,ఫైనల్ మ్యాచ్ లలో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం,మరోవైపు అభిషేక్ శర్మ,హైదరాబాద్ బ్యాట్స్ మ్యాన్ తిలక్ వర్మ అడపదడప కీలక మ్యాచ్ లలో తమ బ్యాట్ కు పని చెప్పడం,స్లాగ్ ఓవర్లలో మొత్తం 17 సిక్సర్ లతో శివం దూబే ఓ చిచ్చర పిడుగులా చేలరేగిపోవడం,అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్ లో భారీ హిట్ లతో,బౌలింగ్ లో కొత్త బంతితో రాణించడం వెరసి ఈ టి20 వరల్డ్ కప్ విజయం టీం ఇండియాకు నల్లేరు మీద నడకే అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదిఏమైన బౌలింగ్ లో టీం ఇండియా బౌలర్లు బుమ్రా,ఆర్ష్ దీప్,వరుణ్ చక్రవర్తిలు తమ స్థాయికి తగ్గట్లు బౌలింగ్ విభాగంలో విశేషంగా రాణించడం సూర్య కుమార్ సారథ్యంలోని టీం ఇండియాకు ఓక ఆతి పెద్ద వరంలా మారింది అనే మాట అక్షర సత్యం. ముఖ్యంగా 2024 టొర్నీలో ' ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ' నిలిచిన బుమ్రా ఈసారి కూడా ఏ మాత్రం వన్నె తగ్గకుండా రాణించి తన బౌలింగ్ లో మంచి నైపుణ్యాన్ని కనబరచి ఏడు కంటే తక్కువ ఎకానమీతో అతను పరుగులు ఇచ్చిన తీరు చూస్తే ప్రత్యర్థి జట్ల బ్యాట్స్ మ్యాన్ల ను ఎంతగా బుమ్రా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాపించారో మనం ఇట్టే ఊహించవచ్చు.ఇక ఆర్ష్ దీప్ కూడా తానేమి తక్కువ తినలేదు అన్నట్లుగా అడపదడప ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మ్యాన్ లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు.ఇది ఇలా ఉంటే మిస్టరియస్ స్పిన్నర్ గా పేరుగాంచిన వరుణ్ చక్రవర్తి సైతం టోర్నీ ద్వితీయార్థంలో కొంత తడబడిన ఓవరాల్ గా అతని మ్యాజిక్ స్పిన్ ప్రభావం బాగానే పనిచేయడంతో ప్రత్యర్థి బ్యాట్స్ మ్యాన్ ల భరతం పెట్టగలిగాడు.ఇంకా చెప్పుకుంటూ పోతే కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ టోర్నీల్లో భారత క్రికెట్ జట్టును విశ్వవిజేతగా నిలుపడంలో టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర కూడా ఎంతో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.కీలక సమయాల్లో వ్యూహల విషయంలో గంభీర్ కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాదు,కెప్టెన్ గా పెద్దగా అనుభవం లేని సూర్య కుమార్ యాదవ్ ని సైతం సరైన రీతిలో మార్గ నిర్దేశనం చేయగలిగాడు.2025 ఛాంపియన్స్ ట్రోఫీ,2026 టి20 వరల్డ్ కప్ లను గెలిపించిన టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ తదుపరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్ ను టీం ఇండియాకు సాధించి పెట్టడమే.ఇప్పటికే 2007లో ఆటగాడిగా సైతం టి20 వరల్డ్ కప్ గెలిపించిన గంభీర్ ఇప్పుడు కోచ్ గా సైతం తన ఖాతాలో మరో ప్రపంచకప్ ను జమ చేసుకున్నాడు.అన్నింటికి మించి టి20 టోర్నమెంట్ లలో సూర్య కుమార్ సారథ్యంలోని టీం ఇండియా జట్టు విజయాల జైత్రయాత్ర ఇలాగే మున్ముందు కూడా అత్యంత దిగ్విజయంగా సాగిపోవాలని భారతదేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది టీం ఇండియా అభిమానుల ఉవాచ,అభిలాష కూడా,ఓక విధంగా చెప్పాలంటే వారంతా హృదయపూర్వకంగా,మనసా,వాచ,కర్మణ,ఎలాంటి పరిస్థితుల్లో ఇటు పొద్దు అటు పొడిచిన టీం ఇండియా ఘనవిజయాలు సాధించాలనే కోరుకుంటారు తప్ప మరో మాటకు తావు ఉండదు.జయ జయహో సూర్య కుమార్ యాదవ్ టీం! హ్యాట్సాఫ్ టూ టీం ఇండియా!🏏🏏🏏🇮🇳🇮🇳🇮🇳🇮🇳✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల, నంద్యాల జిల్లా! #🇮🇳టీమ్ ఇండియా😍
🇮🇳టీమ్ ఇండియా😍 - (Ce' FINAL IEIINDIII IN 2026 T20WC.. CHAMPIONS QD NDIA (Ce' FINAL IEIINDIII IN 2026 T20WC.. CHAMPIONS QD NDIA - ShareChat