ShareChat
click to see wallet page
search
శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి బ్రహ్మోత్సవం ఏర్పాట్లపై సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ముత్తుముల భక్తుల భద్రత, సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గం #రాచర్ల మండలంలోని #రంగస్వామిగుండం గ్రామంలో ఏప్రిల్ 2 నుండి 5 తారీకు వరకు జరగనున్న #శ్రీనెమలిగుండ్లరంగస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికార యంత్రాంగంతో సమావేశం నిర్వహించిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు, ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవాలయ ప్రాంగణంలో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఆర్డబ్ల్యుఎస్ (తాగునీరు), వైద్య మరియు అగ్నిమాపక శాఖల మధ్య సమన్వయంతో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.భక్తుల రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక వైద్య శిబిరాల ఏర్పాటు, సముచిత లైటింగ్ సౌకర్యాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, 24 గంటల పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 2, 3, 4, 5 తేదీలలో నిర్వహించబడనున్న బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు మరియు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. #GiddalurTelugudesamparty #GiddalurMLA #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
📰ప్లాష్ అప్‌డేట్స్ - ShareChat