🌸
చైత్ర శుద్ధ నవమి
శ్రీరాముని జయంతి
శ్రీ రామ నవమి
▫️
దశావతారాల్లో ఏడవ అవతారంగా,
రావణ సంహరనార్ధమై,
శ్రీరాముడు వసంత రుతువులో
చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు
పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో
మధ్యాహ్నం 12గంటలకు
కోసల దేశాధీశ్వరుడైన దశరథునికి -
కౌసల్యా గర్భాన జన్మించారు.
రావణుడు బ్రహ్మవద్ద వరాలు పొంది
దేవతలను జయించి మునులను వేధిస్తుంటారు.
అతనికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల
చావులేదు. దేవతల ప్రార్ధనలు మన్నించి
శ్రీమహా విష్ణువు అతనిని సంహరించడానికి
నరుడై జన్మింపనెంచాడు.
విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్ముణునిగా,
శంఖ చక్రములు భరత శత్రుఘ్ర్నలుగా అవతరించారు.
శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై
జనక మహారాజు ఇంట పెరిగారు.
శ్రీరాముడు క్రమశిక్షణ కలిగనవాడై ,
మహ వీరుడై , సాహసికుడై , వేదాంతియై ,
కృతజ్ఞుడై , సత్యవాక్కు పరిపాలకుడిగా ,
అన్ని గుణాల్లోను ఉత్తముడిగా గుణవంతుడై ,
స్వీయ నిర్ణయాలు తీసుకోగలిగిన జ్ఞానియై ,
సర్వ జీవుల పట్ల దయకలిగినవాడై ,
అన్ని శాస్త్రాల్లోనూ పండితుడిగా ,
సమస్తకార్యాలలోను సమర్ధుడై ,
మంచి లక్షణాలు కలిగిన అందగాడిగా ,
అత్యంత ధైర్యవంతుడిగా ,
క్రోధాన్ని జయించిన ప్రశాంతచిత్తుడిగా ,
సమస్త లోకాల్లోనూ విజ్ఞానిగా ,
అసూయ లేని వాడై ,
దేవతలకు సైతం భయాన్ని కలిగించే ధీశాలియైన
శ్రీరామునికి చైత్ర శుద్ధ నవమి రోజున
మధ్యాహ్నం 12 గంటల అనంతరం
పూజను ఆరంభించి , తులసిమాలలను ధరింపజేసి ,
శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము,
శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము,
శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో
శ్రీరాముడిని స్తుతించాలి.
ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే
అధ్యాయమును పారాయణముతో పాటుగా ,
శ్రీరామ ప్రవర , సీతా దేవి ప్రవరలను స్మరించాలి.
శ్రీరాముని ప్రవర :
చతుస్సాగర పర్యంతం
గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ
ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...
అజ మహారాజ వర్మణః పౌత్రాయ...
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.
సీతాదేవి ప్రవర :
చతుస్సాగర పర్యంతం
గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ
ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...
జనక మహారాజ వర్మణః పుత్రీం...
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...
అంటూ ప్రార్తించినవారికి శుభఫలితాలు
చేకూరుతాయని శాస్త్ర వచనం.
అదేవిధంగా ... శ్రీరామనవమి రోజున
ప్రతి ఒక్కరూ స్మరించవలసిన
అత్యంత పరమ పవిత్రమైన మహ మంత్రం :
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే.
పరమశివుడు స్వయంగా
ఉపదేశించిన మహా మంత్రాన్ని
మూడు సార్లు మననం చేసుకొంటే
శ్రీమహావిష్ణువే స్వయంగా వచ్చి
మన భాధలను తొలగించి
మన జీవితాలను ఆనందమయం చేస్తాడని
రుద్రుడే చెప్పిన మంత్రమిది .
ర కారం - రుద్రున్ని
అ కారం - బ్రహ్మను
మ కారం - విష్ణువును సూచిస్తుంది .
రా కారంలో పర బ్రహ్మాన్ని
మ కారంలో జీవాత్మని అనగా ...
రామ నామ శబ్దంలో తత్ - త్వం అనగా
జీవాత్మ - పరమాత్మల కలయిక అని అర్థం .
రామనామం చాల గొప్పది . అత్యంత పవిత్రమైనది .
ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో
అక్కడ నిత్యం సుఖ సంతోషాలు వర్దిల్లగలవని పురాణాలు చెప్తున్నాయి .
రామనామం వలన
బ్రహ్మహత్య దోషము , మద్యపాన దోషము ,
గురుపత్ని సంయోగ పాపము మొదలైన
సమస్త పాపములు రామనామం వలన హరించిపోవును .
శ్రీరాముడు సర్వ మానవాళికి
ఆచరించి నేర్పిన అతి ముఖ్యమైన ధర్మాలు ..
* పాలనా ధర్మం ..
* కుటుంబ ధర్మం ..
* నైతిక ధర్మం ..
* దాంపత్య ధర్మం..
ఈ మహోత్తర పండుగ నాడు
మనమందరం శ్రీరామ అంటూ స్మరించుకొందాం .
శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
▫️
రామ మూల మంత్రం :
ఓం శ్రీ రామాయ నమః
▫️
మీకు .. మీ కుటుంబం అందరికీ ...
శ్రీరామ నవమి శుభాకాంక్షలు ....
▫️
తులసిమొక్కను నాటండి .
భగవద్గీతను చదవండి.
గోమాతను పూజించి సంరక్షించండి.
#🚩జై శ్రీరామ 🕉️ #🏹 జై శ్రీ రామ్! #తెలుసుకుందాం


