జాతీయ గీతం, గేయాలను..
అవమానిస్తే ఇక జైలు శిక్షే
జాతీయ గేయంపై కొత్త మార్గదర్శకాలు
జాతీయ గేయం (వందేమాతరం) పాడే విధానంపై కేంద్ర హోంశాఖ కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు జనవరి 28 విడుదల చేసింది. ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలలు, కళాశాలలు, పబ్లిక్ మీటింగులలో ఈ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
అవమానిస్తే జైలు శిక్ష
జాతీయ గీతం, గేయం పాడుతున్నప్పుడు ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, అగౌరవపరిచినా కఠిన శిక్షలు పడతాయి. కొత్త నియమాల ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
పాటించాల్సిన నియమాలు
వందేమాతరం పాడే ముందు అందరూ నిలబడాలి. పాట పూర్తయ్యే వరకు శ్రద్ధగా, గౌరవంగా ప్రవర్తించాలి. వందేమాతరం పాడుతున్నప్పుడు మాట్లాడటం, నవ్వటం, మొబైల్ ఉపయోగించకూడదు.
ఉపాధ్యాయుల పాత్ర
పాఠశాలలు, కాలేజీలు విద్యార్థులకు జాతీయ గీతం గౌరవం గురించి అవగాహన కల్పించాలని ప్రభుత్వం సూచించింది. మొదట వందేమాతరం పాటతోనే స్కూలు మొదలుపెట్టాలని చెప్పింది. పిల్లలు సరైన విధంగా పాడటం, వినటం, గౌరవించడం గురించి ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలని సూచించిది.
వందేమాతరం తర్వాతే జనగణమన
జాతీయ గేయం వందేమాతరం, జాతీయ గీతం జనగణమన... రెండింటినీ పాడాల్సి వస్తే మొదట వందేమాతరం పాడాలని హోంశాఖ నిర్ణయించింది. అధికారిక కార్యక్రమాలు, వేడుకల్లో తొలుత 3 నిమిషాల 10 సెకన్ల పాటు వందేమాతర గేయంలోని 6 చరణాలను ఆలపించాలని సూచించింది. ఆ తరువాత జనగణమన పాడాలని వివరిచింది. #🇮🇳దేశం #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📰జాతీయం/అంతర్జాతీయం #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢


