ShareChat
click to see wallet page
search
#✍️నేటి నుంచి టెన్త్ పరీక్షలు..తప్పక పాటించాల్సిన సూచనలు #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🗞ప్రభుత్వ సమాచారం📻
✍️నేటి నుంచి టెన్త్ పరీక్షలు..తప్పక పాటించాల్సిన సూచనలు - NEWS UPDATE LIVE TPG Tegipoinagalipatam BREAKING NEWS నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు . తెలంగాణలో పదో తరగతి ( ఎస్ఎస్ఎసీ ) పబ్లిక్ పరీక్షల సందడి నేటి ( శనివారం ) నుంచి ప్రారంభం కానుంది . రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 28 వేల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు . ఇందుకోసం 2,676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది . ఏప్రిల్ 16 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి . ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా , విద్యార్థులు ఉదయం 8:30 గంటలకల్లా కేంద్రాలకు చేరుకోవాలని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు సూచించింది . ఆలస్యంగా వచ్చేవారికి ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని తెలిపింది . హాల్ టికెట్లను ఇప్పటికే పాఠశాలలకు పంపించామని , అధికారిక వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు . పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు 144 ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించుతున్నారు . మొబైల్ ఫోన్లు , స్మార్ట్ వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించరు.ఈసారి పరీక్షలను సుదీర్ఘంగా 33 రోజుల పాటు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది . సాధారణంగా 10-12 రోజుల్లో ముగిసే పరీక్షలను ఈసారి సీబీఎస్ఈ తరహాలో పేపర్ల మధ్య ఎక్కువ రోజుల విరామం ఇచ్చారు . విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి , మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ షెడ్యూల్ రూపొందించామని విద్యాశాఖ చెబుతుండగా , ఇది అశాస్త్రీయమని విద్యార్థి సంఘాలు , పాఠశాలల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి . - ShareChat