#డిప్యూటీ_సీఎం_పవన్_కళ్యాణ్_గారిని_కలిసిన_గిద్దలూరు_ఎమ్మెల్యే_ముత్తుముల
#అమరావతి: #వెలగపూడి సచివాలయం లో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు ఏపీ డిప్యూటీ సీఎం Pawan Kalyan గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఛాంబర్లో కలిసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. ముఖ్యంగా రేపు వచ్చే #శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయాలకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వస్తున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తకుండా గిద్దలూరు నియోజకవర్గనికి నిధులు కేటాయించి, ట్యాంకర్ల ద్వారా అవసరమైన ప్రదేశాలలో నీటిని తరలించి ప్రజలకు అందించేందుకు నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం గారికి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం నియోజకవర్గ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి తెలిపారు.
#IdhiManchiPrabhutvam
#NaraChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #NDAGovernment #NDAkutami #GiddalurMLA #MuthumulaAshokReddy
#మనగిద్దలూరుమనముత్తుముల
#🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్


