ShareChat
click to see wallet page
search
రూ. 53 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తా... #ముత్తుముల మార్కాపురంజిల్లా : గిద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ డిపో ప్రాంగణంలో ప్రయాణికుల సౌకర్యార్థం చేపట్టనున్న అభివృద్ధి పనులకు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు శనివారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిమెంట్ (CC) రోడ్ల పనులకు ఎమ్మెల్యే మరియు ఆర్టీసీ ఉన్నత అధికారులు కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. ​ ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ ​మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఆర్టీసీ బస్టాండును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా, ప్రయాణికులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.​కేవలం ప్రయాణికులకే కాకుండా, నిరంతరం ప్రజలకు సేవలందించే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా బస్టాండ్ ప్రాంగణంలో మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. గత కొంతకాలంగా బస్టాండ్ ఆవరణలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం రూ. 53 లక్షల రూపాయల నిధులతో నాణ్యమైన రోడ్లను నిర్మిస్తున్నట్లు త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడతామన్నారు. #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
🎯AP రాజకీయాలు - +75~105 Tauiiue E Cqup r೪ 0 ೧;is  +75~105 Tauiiue E Cqup r೪ 0 ೧;is - ShareChat