ShareChat
click to see wallet page
search
*_అమ్మమ్మ నేర్పిన అద్భుతపాఠం_* *_శ్రీమతి సుధామూర్తి,చైర్మన్,_* *_ఇన్ఫోసిస్ ఫౌండేషన్_*. *_ఓ ప్రముఖ సంస్థ 'కార్పొరేట్ సామాజిక బాధ్యత' అన్న అంశంపై ప్రసంగించేందుకు కొన్నేళ్ళ క్రితం నన్ను ఆహ్వానించింది._* *_ఉత్సాహంగా ఉపన్యసించాను;_* *_ఉపన్యాసం అయిన తరువాత చాలామంది యువతీ యువకులు ఉత్తేజితులై, పాత వస్త్రాలు, ఇంటిసామగ్రి మా ట్రస్టుకు పంపుతామని బాస చేశారు._* *_వాళ్ళ ప్రతిస్పందన నన్ను ఆనందపరచింది. “ఇవ్వదలచుకున్న వాటన్నింటిని సంచుల్లో పెట్టండి; ఆ సంచుల్ని నా కార్యాలయానికి పంపండి; అవి అవసరమైన వారికి అందేలా చూస్తాను” అని అన్నాను_*. *_వారం తిరక్కముందే మా కార్యా లయానికి వందలకొద్దీ సంచులు వచ్చిపడ్డాయి._* *_నా ఉపన్యాసంతో జనాన్ని బ్రహ్మాండంగా ప్రభావితం చేయగలిగానని గర్వపడ్డాను._* *_ఒక ఆదివారం సంచులు తెరిచాం. వాటిలోని వస్తువులను చూసి, ఆశ్చర్యానికి గురయ్యాం. రకరకాల వస్తువులను సంచుల నిండా కుక్కారు._* *_చినిగిన దుస్తులు, ఉతకని చొక్కాలు, కట్టుకుంటే ఒళ్ళంతా కనబడే చీరలు, రంగూ రూపం లేని ఆట వస్తువులు, ఉపయోగపడని దుప్పట్లు, అల్యూమినియం పాత్రలు, పగిలిన క్యాసెట్లు - ఇలాంటివే అన్నీ కుప్పగా పోశారు. వాటిలో పనికొచ్చే చీరలు, చొక్కాలు కొన్ని మాత్రమే!_* *_చెత్తకుండీల్లో వెయ్యకుండా, పాత సామాన్లవాడికి అమ్మ కుండా,_* *_విరాళమంటూ జనం వాటన్నిటినీ_* *_నా కార్యాలయానికి పంపారు._* *_నేను కలిసిన యువతీ యువకులు నిజానికి చాలా తెలివిగలవాళ్ళు, పెద్ద ఉద్యోగస్థులు, హోదా ఉన్నవారు, సంపన్నులు. వీరే ఇలా ప్రవర్తిస్తే- ఇక విద్యాగంధం అబ్బనివారి పరిస్థితి ఎలా ఉంటుంది?_* *_చదువులేకపోయినా ఉన్నత భావాలుగలవారు ప్రవర్తించే తీరు ఎలా ఉంటుందో గుర్తుచేసే నా చిన్ననాటి జ్ఞాపకం ఇది.._* *నా బాల్యమంతా కర్ణాటకలోని మారుమూల పల్లెలోని అమ్మమ్మ, తాతయ్యల ఇంట గడిచిపోయింది.* *తాతగారు విశ్రాంత ఉపాధ్యాయులు. అమ్మమ్మ ఇంటికే అంకితమైన సాధారణ గృహిణి. ఆ ఊరు దాటి బయటకు వెళ్ళడమే అరుదు. వారు మనఃస్ఫూర్తిగా శ్రమించేవాళ్ళు. ఎవరి నుంచీ ఏమీ ఆశించని వాళ్ళు. కొద్దిపాటి సంపదనైనా, ఆనందాన్ని అయినా నలుగురితో పంచుకోవాలని తపన పడేవాళ్ళు. గ్రామంలో మాకు పొలాలుండేవి; పండిన ధాన్యాన్ని పాతర్లలో నిల్వచేసేవాళ్ళు. మాకు ధాన్యపు పాతరలు రెండు ఉండేవి. ఒకటి ఇంటి ముందు; మరొకటి ఇంటి వెనుక. ఇంటిముందు పాతరలో నాణ్యమైన తెల్ల బియ్యం పోసేవాళ్ళు. గింజ పెద్దగా ఉండే తక్కువ రకమైన ఎర్రని బియ్యాన్ని వెనుక పాతరలో పోసేవాళ్ళు. భిక్ష కోసం ముస్లిం ఫకీర్లు, హిందూ దాసయ్యలు, మల్లమ్మ జోగినులు, పేద విద్యార్థులు, అంగవికలురు మా ఇంటికి వచ్చేవాళ్ళు*. *అమ్మమ్మవాళ్ళు ఆర్థికంగా అంతగా ఉన్నవాళ్ళేమీ కాదు. తాతయ్య బియ్యం రూపంలో మాత్రమే సహాయం చేసేవారు. అప్పుడు నేను చిన్నపిల్లను; ఇంటి ముందు మంచి బియ్యం ఉన్న పాతర ద్వారం క్రిందుగా ఉండేది: పెద్దవాళ్లు లోపలి కెళ్ళడం కష్టం; అందువల్ల నా చేతికి ఓ చిన్న బొక్కెన ఇచ్చి లోపలికి పంపేవాళ్ళు; బియ్యాన్ని అందులో నింపి పైకి అందించేదాన్ని. అలా భిక్షకు వచ్చిన వారికి దానం చేసేవారు*. *ఇంట్లో వంటకానికి అమ్మమ్మ నన్ను వెనుకనున్న పాతరలో ఉన్న నాసిరకం ఎర్ర బియ్యాన్ని తీసుకురమ్మని చెప్పేది. ఇలా చాలా ఏళ్ళు గడిచాయి. ఒకసారి అమ్మమ్మను “మంచి బియ్యం పేదవాళ్ళకు పంచి, మనం ఎర్రబియ్యం అన్నం ఎందుకు తినాలి?” అని ప్రశ్నించాను*. *అప్పుడు అమ్మమ్మ నవ్వుతూ చెప్పిన మాటల్ని నేనెన్నటికీ మరచిపోలేను*. *“పాపా! ఎప్పుడైనా, ఎవరికైనా, ఏమైనా ఇవ్వాలనుకున్నప్పుడు నీకున్న దాంట్లో మంచిదాన్ని ఇవ్వాలి; తక్కువ రకం వాటిని ఇవ్వకూడదు. నా అనుభవంలో నేను నేర్చుకున్నది ఇంతే! దేవుడు ఆలయంలోనో, మసీదులోనో, చర్చిలోనో కూర్చొని ఉండడు. ఆయన అందరిలోనూ ఉన్నాడు. నీకు ఉన్నదాంతో వాళ్ళను సేవిస్తే దేవుణ్ణి సేవించినట్లే!” అంటూ నన్ను అక్కున చేర్చుకుంది అమ్మమ్మ*. *అలా ఏ విశ్వ విద్యాలయమూ, మేధావి వర్గమూ నేర్పని అద్భుతమైన పాఠం మా అమ్మమ్మ నుంచి నేర్చుకున్నాను* #మన సంప్రదాయాలు సమాచారం