#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు ఈసీ నిద్రపోతున్నదా❓కాంగ్రెస్ దౌర్జన్యం చేస్తుంటే ఏం చేస్తున్నది❓
క్యాతనపల్లిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి ✅
📢 రాజ్యాంగం ఖూనీ అవుతుంటే రాహుల్ ఎందుకు స్పందించరు?
⚠️ గాంధేయవాదిగా చెప్పుకొంటున్న మీనాక్షీ నటరాజన్ ఏం చేస్తున్నరు?
🚨 చట్టం కాంగ్రెస్కు చుట్టం అన్నట్టుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోము
📣 రేవంత్ ప్రజామోదం కోల్పోయారు. అందుకే పోలీసు లాఠీని నమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నరు
💥 మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజం
♦️ ఆదిలాబాద్ జైలులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు పరామర్శ
క్యాతనపల్లి, జనగామలో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరించారు. ఇదంతా యూట్యూబ్ లైవ్లో చూస్తున్న ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా? అలాంటప్పుడు ఎన్నికలు పెట్టడం ఎందుకు? ఈ ఘటనలపై గవర్నర్ నివేదిక తెప్పించుకొని మున్సిపల్ ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారులపై, ఎన్నికల కమిషన్పై చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రంలో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే చరఖా తిప్పుతూ గాంధేయవాదిగా చెప్పుకొనే రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్ ఎందుకు స్పందించడం లేదు?
చట్టాన్ని అతిక్రమించి, పరిధి దాటి అతిగా వ్యవహరించిన పోలీసులు, అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారం శాశ్వతం కాదు, పోస్టింగ్లు, ఇతర వాటి కోసం తప్పులు చేస్తే కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదులతో బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారు, దీనిని బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, రేవంత్రెడ్డి, వివేక్లు ఎవరూ మిమ్మల్ని కాపాడలేరు.


