*_అతిధిదేవో భవ_*
*ఒక అడవిలో జంట పావురాలు నివసిస్తున్నాయి. ఒకరోజు వేటగాడు ఆడపావురాన్ని బాణంతో కొట్టి చంపాడు*.
*అదిచూసిన మగపావురం తన నివాసమైన చెట్టుపై దుఃఖంతో ఉన్నది*.
*ఆ సమయంలో గాలివాన వచ్చింది. ఆ వేటగాడు, పావురం ఉన్న చెట్టు క్రిందచేరి చలికి వణుకుతూ, ఆకలితో బాధ పడుతున్నాడు*.
*వాన తగ్గగానే, తన నివాసం వద్దకు చేరిన ఆ వేటగానిని తన అతిధిగా భావించి, కొన్ని ఎండుపుల్లలు సేకరించి, మంటచేసి వాడికి వెచ్చదనం కల్పించింది. ఆ వేటగాడు ఆకలితో బాధపడటం చూసిన ఆ పావురం ఆ మంటలో దూకి ,వాడికి ఆహారం గా మారింది.*
*తన ఆడ తోడును చంపిన వాడైనా తన నివాసం వద్దకు వచ్చినాడు కనుక వాడిని తన అతిధిగా భావించి తన ప్రాణాలను త్యాగం చేసి మరీ, ఆకలి తీర్చింది ఆ పక్షి.*
*ఈ సంఘటనను శ్రీ రాముడు, విభీషణుడు తనను శరణుకోరి వచ్చినపుడు, విభీషణునితో స్నేహాన్ని వ్యతిరేకించిన వానర వీరులతో చెప్పుతాడు... “ఒక పక్షి, తన భార్యను చంపిన వాడు తన నివాసం వద్దకు వచ్చి ఆకలితో బాధ పడుతుంటే అతిధిగా భావించి ప్రాణాలు వదలి ఆకలి తీర్చిందికదా! అటువంటిది మానవుడిని, నేనురక్షణ బాధ్యత కలిగిన క్షత్రియుడను, చక్రవర్తి కుమారుడను, శరణుకోరి వచ్చిన వానిని తిరస్కరించను!” అని వారిని సమాధాన పరచి విభీషణునికి అభయం ఇచ్చి, తన సోదరులలో ఒకనిగా స్థానం ఇచ్చాడు, శ్రీరాముడు*.
*ఒకసారి శరణన్నవానిని కూడా రక్షించడమే నా వ్రతం అని ప్రకటిస్తాడు రాముడు*.
*”మిత్రునిగా కాకపోయినా, మిత్రభావంతో నన్ను ఆశ్రయించినా, వాని దోషాలను పరిగణనలోకి తీసుకోకుండా రక్షిస్తాను” అంటాడు*.
*అతిధిని దైవ భావంతో సత్కరించటం గృహస్తు బాధ్యత, అని శాస్త్రాలు చెప్పుతున్నాయి* #మన సంప్రదాయాలు సమాచారం

