ShareChat
click to see wallet page
search
#💪పాజిటీవ్ స్టోరీస్ *సొంతగడ్డపై సన్​రైజర్స్ హైదరాబాద్ నిరాశ పర్చింది...* తాజాగా లఖ్​నవూ సూపర్ జెయింట్స్​తో జరిగిన మ్యాచ్​లో పోరాడి ఓడింది. *సన్​రైజర్స్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని లఖ్​నవూ 5 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది.* కెప్టెన్ రిషభ్ పంత్ (68 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో ప్రస్తుత సీజన్​లో హైదరాబాద్​కు రెండో ఓటమి ఎదురైంది. ఇక సన్​రైజర్స్ బౌలర్లలో హర్ష్ దూబే 2, ఎషన్ మలింగ, శివాంగ్ కుమార్ చెరో 1 వికెట్ పడగొట్టారు. పంత్ ఛేదనలో లఖ్​నవూ తొలి నుంచి విజయం దిశగానే సాగింది. ఓపెనర్ ఎయిడెన్ మార్​క్రమ్ (45 పరుగులు) రాణించాడు. పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. అయితే చివర్లో వికెట్లు తీసి లఖ్​నవూపై సన్​రైజర్స్ కాస్త ఒత్తిడి తెచ్చింది. 30 బంతుల్లో 43 రన్స్ కావాల్సిన దశలో 16వ ఓవర్లో ఉనాద్కత్ 14 పరుగులు ఇచ్చాడు. దీంతో మ్యాచ్ లఖ్​నవూ వైపునకు మొగ్గింది. అయితే 18వ ఓవర్లో హర్ష్ దూబే ఆరే పరుగులిచ్చి 1 వికెట్ తీయడంతో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. కానీ, పంత్ ఎక్కడా అనవసర షాట్లకు పోకుండా జట్టును విజయం వైపునకు నడిపించాడు. *చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం* కాగా స్ట్రైకింగ్​లో ఉన్న పంత్ తొలి రెండు బంతులను ఫోర్లుగా మలిచి బౌలర్​ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత రెండు బంతులు డాట్ కావడంతో 2 బంతుల్లో 1 పరుగు కావాల్సి వచ్చింది. ఇక ఐదో బంతిని బౌండరీకి తరలించిన పంత్ లఖ్​నవూకు తొలి విజయం ఖాయం చేశాడు...
💪పాజిటీవ్ స్టోరీస్ - ShareChat