ShareChat
click to see wallet page
search
*జగ్గీ వాసుదేవ్ ప్రయాణం కర్ణాటకలోని మైసూర్ వీధుల్లో ఒక సాదాసీదా కోళ్ళ ఫారం యజమానిగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మొదలైంది*. *లాభనష్టాల లెక్కల మధ్య సాధారణంగా సాగుతున్న ఆయన జీవితం ఒక్కసారిగా 'ఆధ్యాత్మిక గురువు'గా మలుపు తిరగడం వెనుక అనేక మిస్టరీలు ఉన్నాయి*. *ముఖ్యంగా 1997లో ఆయన భార్య విజయకుమారి మరణం ఈ కథలో అత్యంత చీకటి అధ్యాయం. ఆరోగ్యంగా ఉన్న 31 ఏళ్ల మహిళ 'మహాసమాధి' పేరుతో ప్రాణాలు వదిలిందని జగ్గీ ప్రకటించినప్పటికీ*, *అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని ఆమె తండ్రి గంగాధరన్ అప్పట్లోనే బెంగళూరు, మైసూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగ్గీకి ఆశ్రమంలోని మరో మహిళతో ఉన్న సంబంధం వల్లే తన కూతురిని వదిలించుకున్నారని ఆయన ఆరోపించారు*. *అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఆమె మృతదేహానికి పోస్టుమార్టం జరగకుండా, పోలీసులు వచ్చేలోపే అత్యంత వేగంగా దహనం చేయడం వెనుక సాక్ష్యాలను రూపుమాపే కుట్ర ఉందనేది నేటికీ ఒక బలమైన వాదన*. *ఇక్కడ గమనించాల్సిన కీలకమైన విషయం ఏమిటంటే, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రకారం సిద్ధులను లేదా మహాసమాధి పొందిన యోగులను ఎన్నడూ దహనం (తగలబెట్టడం) చేయరు, కేవలం ఖననం (పూడ్చిపెట్టడం) మాత్రమే చేస్తారు*. *కానీ జగ్గీ మాత్రం ఆమె సిద్ధురాలు అని చెబుతూనే, నిబంధనలకు విరుద్ధంగా ఆమె శరీరాన్ని తగలబెట్టించడం వెనుక ఏదో పెద్ద క్రైమ్ దాగి ఉందనే అనుమానాలు అప్పుడు ఇప్పుడు వున్నాయి* *మైసూర్ నుండి తమిళనాడులోని కోయంబత్తూర్ వెళ్ళిఆర్ కొండల పాదాల వద్దకు చేరినఇతడి ఈషా ఆశ్రమం, అక్కడ ఉన్న అమాయక గిరిజనుల కొంపలు ముంచింది*. *'పల్లాంటి' అనే తెగకు చెందిన గిరిజనులను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి వారి భూములను లాక్కోవడం ద్వారా ఆశ్రమ సామ్రాజ్యం విస్తరించింది*. *ఇది కేవలం మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా శాపమైంది. ఏనుగుల సహజ సంచార మార్గాలను ఆక్రమించి భారీ కట్టడాలు నిర్మించడంతో, దారి తప్పిన ఏనుగులు జనారణ్యంలోకి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయి*. *ప్రకృతి ప్రేమికుడినని చెప్పుకునే వ్యక్తి, వన్యప్రాణుల మరణాలకు కారణమవుతున్నారనేది కచ్చితమైన ఆరోపణ*. *ఇక ఇతడి ఆర్థిక కోణం చూస్తే, 'కావేరీ కాలింగ్' మరియు 'ర్యాలీ ఫర్ రివర్స్' వంటి కార్యక్రమాల పేరుతో సామాన్య ప్రజల నుండి వందల కోట్ల రూపాయల విరాళాలు సేకరించారు*. *ఒక్కో మొక్కకు 42 రూపాయల చొప్పున వసూలు చేసిన ఆ నిధులు ఏమయ్యాయో చెప్పే లెక్కల్లో పారదర్శకత లేదని కాగ్ (CAG) వంటి ప్రభుత్వ సంస్థలే వేలెత్తి చూపాయి*. *మరోవైపు, ఆశ్రమానికి వచ్చే యువతీ యువకులను 'మైండ్ కంట్రోల్' చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తన స్వంత కూతురికి వైభవంగా పెళ్లి చేసి విదేశాల్లో స్థిరపరిచిన జగ్గీ,* *ఇతరుల కూతుళ్లను మాత్రం సన్యాసినులుగా మారాలని ప్రబోధించడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనం. తమ పిల్లలను అక్రమంగా నిర్బంధించారంటూ తల్లిదండ్రులు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు*. *ఈ వివాదాలన్నీ ఒకెత్తయితే, తాజాగా తన 'కాలు ఫోటోను' భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని 3200 రూపాయలకు విక్రయానికి పెట్టడం ఆధ్యాత్మికత పతనానికి పరాకాష్టగా కనిపిస్తోంది.అతడికి గుడ్డి భక్తుల మీద ఉన్న నమ్మకం తెలియజేస్తుంది* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat