🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌻పంచాంగం🌻
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 25 - 01 - 2026,
వారం ... భానువాసరే ( ఆదివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
శుక్ల పక్షం,
*_నేటి విశేషం_*
*రథసప్తమి*
*రథసప్తమి విశిష్టత ఏమి?? - ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు?*
ప్రతి ఏటా మాఘ మాసంలో శుక్ల పక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు.
ఈ సందర్భంగా రథ సప్తమిని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాము!!...
భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే.
ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు,
మన సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది.
మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది, దీన్నే రథ సప్తమి అని కూడా అంటారు.
సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు, అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది.
మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు.
50 ఏళ్ల తర్వాత మూడు గ్రహాల అరుదైన కలయిక..
ఈ రాశులకు కనకవర్షం ఖాయం..!ఏడు గుర్రాలు ఎందుకంటే..
సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు.
ఈ ఏడు గుర్రాలను వేదఛందస్సులు అని అంటారు.
గాయత్రి, త్రిష్ణుప్, జగతి అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు.
మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తారు.
ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది.
సూర్యజయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు.. రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది.
ద్వాదశ రాశులలో సంచారం..
విశ్వం ఒక వృత్తంలా భావిస్తే.. దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణితశాస్త్రం చెబుతోంది.
సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తాడు.
అంటే ఒక సంవత్సరం, అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు.
సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు.
మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు.
వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశామాసాలకూ ఆధిదేవతలు.
వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి, సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు.
ఉత్తర దిశలో ప్రయాణం..
మాఘమాసంలో "అర్క'' నామంతో సంచరిస్తాడు.
మాఘ అంటే పాపం లేనిది అని అర్థం.
పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు.
నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైనా, రథసప్తమి నుంచే ఉత్తరాయణస్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది.
దక్షిణాయణం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు.
కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి, పితృ, దేవరుషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు.
శత్రు బాధలు తొలగిపోవడానికి.. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ.
కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి.
మన మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే ‘యోపం పుష్పం వేదా, పుష్పవాన్ ప్రజావాన్, పశుమాన్ భవతి’ అనే వాక్యాలు దీనికి సంబంధించినవే.
సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు.
సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ 'డి' లభిస్తుంది.
సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి.
అందుకే వైదిక వాజ్మయం.. సంధ్యావందనం, సూర్యనమస్కారాలు, ఆర్ఘ్యప్రధానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది.
*_🌻శుభమస్తు🌻_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023


