ShareChat
click to see wallet page
search
*_1️⃣_* *_నేటి నుండి ప్రారంభం.._* *_శ్రీ మహావిష్ణు పురాణం_* *_1 వ భాగం_* *_ప్రారంభం - పురాణ ప్రశంస - వేదవ్యాస జననం_* *_#మొదటి భాగం#_* *మహావిష్ణు పురాణం వ్యాసుని జన్మ వృత్తాంతం, వ్యాసుని తండ్రి అయిన పరాశర మహర్షి వృత్తాంతంతో ఆరంభంఔతుంది.* *వ్యాస మహర్షి మహావిష్ణు పురా ణం రచించారు. కానీ కథనం పరాశర మహర్షి తన శిష్యుడు మైత్రేయ మహర్షికి చెప్పడంతో ఆరంభమవుతుంది*. *నైమిశార్యణంలో శౌనకాది మునులు యజ్ఞయాగాదులు చేస్తున్న సమయంలో సూత మహర్షి శిష్యులతో వచ్చి మునుల కోరిక పై పురాణ ప్రవచనాలు చేస్తూ వచ్చి వెళ్లుతుండేవారు. అలా ఒకసారి సూత మహర్షి వచ్చినప్పుడు శౌనకాది మునులు ఎదురేగి స్వాగత సత్కరాలు చేసి ఉచితాసనం సమర్పించి కుశల ప్రశ్నల తరువాత నమస్కరించి* *"పురాణ ప్రవచనోత్తమా! మీ ద్వారా వ్యాస భగవానుడు రచించిన అనేక పురాణ ఇతి హాసాలు వినే భాగ్యం మాకు లభించింది.* *ఈసారి శ్రీమన్నారాయణుని దివ్య లీలలతో నిండిన "శ్రీ మహావిష్ణు పురాణం" వినాలని ఉంది. ముందు మహావిష్ణు పురాణం రచించిన వ్యాస మహర్షి గురించి తెలియచేసి పురాణాన్ని విని పించండి" అని ప్రార్ధించారు.* *సూత మహర్షి సంతోషించి "మునులారా! మా గురువైన వ్యాస మహర్షిని స్మరణ చేసుకునే భాగ్యం మరోక సారి నాకు కలిగింది. వ్యాస మహర్షి పరాశర మహర్షి, మత్స్యగంధి సత్యవతికి జన్మించారు. పరాశర మహర్షి వసిష్ట మహర్షి కుమా రుడైన శక్తికి జన్మించారు*. *ఈవిధంగా వ్యాసుడు వసిష్ట మహర్షికి మునిమనవడు అవుతాడు. ఇరువురి జనన కథనం వినండి*. *ఉపరిచర వసువు ఆకాశంలో విహారం చేస్తుంటే అతని రేతస్సు యమునా నదిలోని ఒక ఆడచేప నోటిలో పడింది. ఫలితంగా ఆ చేపకు ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల జన్మించారు. చేపలు పట్టే వృత్తి చేస్తున్న దాశరాజుకు ఆ చేప లభించి, కడుపు కోయగా ఇరువురు పిల్లలు కనిపించారు. మగ పిల్లవాడిని ఆ దేశరాజు తీసుకుని వెళ్ళి మత్స్యదేశానికి రాజుని చేశాడు, ఆడపిల్లను దాశరాజు సత్యవతి అని నామకరణం చేసి పెంచి పెద్ద చేసాడు.* *తండ్రికి సహాయంగా చేపల వేటకు వెళ్లిన సత్యవతి శరీరం నుండి చేపల వాసనలు రావడం తో ఆమెను మత్స్యగంధి అని పిలిచేవారు. ఒకసారి గంగానది తీరంలో సత్యవతి నావతో నదిలోకి వెళ్ళబోతుంటే పరాశర మహర్షి గంగానది దాటటానికి అక్కడకు వచ్చి సత్యవతిని నది దాటించమని అడిగాడు. మహర్షి తేజో స్వరూపము చూసి భయ పడిన సత్యవతి అంగీకరించి నావలో ఎక్కించుకుని తీసుకెళ్ల సాగింది*. *నదిమధ్యలో సత్యవతి రూపం పరాశర మహర్షిని ఆకర్షించింది. ఆమె మత్స్యగంధి కాదు ఉపరి చర వసువు కుమార్తె అని గ్రహించాడు. ఈమె ద్వారా వ్యాస మహర్షి జననం జరగాలని విధి నిర్ణయం అని గ్రహించి ఆమెను తనతో దాంపత్యం చేయమని అడిగాడు. సత్యవతి "తండ్రి అనుమతి లేదని, కన్యత్వం భంగం అవుతుందని, పగటి పూట తప్పు అని, తన శరీరం నుండి చేపల వాసన వస్తుంది" అని తన సంశయాలను చెప్పింది.* *పరాశర మహర్షి ఆమెతో "వేద పురాణ ఇతిహాస కర్త వ్యాసుడు తన ద్వారా సత్యవతి గర్భాన జన్మించాలని విధాత నిర్ణ యించారు. కనుక ఆమె కన్యా త్వానికి ఎటువంటి భంగం కలుగదని, ఇక నుంచి ఆమె శరీరం నుండి సుగంధ పరిమళాలు వచ్చి యోజన దూరం వరకు వ్యాపించి ఉంటా యని, ఆమెను యోజనగంధి అని పిలుస్తారని" అని వరాలు ఇచ్చి తన తపశక్తితో అక్కడ ఒక ద్వీపాన్ని సృష్టించి, పగటి వాతావరణాన్ని రాత్రి వాతావర ణంగా మార్చివేశాడు. ద్వీపంలో చక్కటి గృహం నిర్మింపచేశాడు*. *సత్యవతి అంగీకరించింది. ఇద్దరి కలయికతో వ్యాస మహర్షి జన్మించాడు. పుట్టి పుటడ్డం తోనే దండ కమండలాలు, జడలు ధరించి ఋషిగా మారాడు. పరాశర మహర్షి వెళ్లి పోయాడు. వ్యాసుడు తల్లికి నమస్కరించి "అమ్మా! నేను తపస్సుకి హిమా లయాలకు వెళుతున్నాను. అక్కడే ఉంటాను. నీకు ఆవసరమైనప్పుడు నన్ను తలచుకుంటే, నేను వచ్చి నీ సమస్యలను తీరుస్తాను" అని మాట ఇచ్చి తపస్సుకి వెళ్లి పోయాడు. నల్లని జింకలు సంచరించే ద్వీపంలో పుట్టాడు కనుక ఈయనకు "కృష్ణద్వైపా యనుడు" అని పేరు వచ్చింది. వేదాలను నాలుగు వేదాలుగా విభజించి లోకానికి అందించాడు కావున వేదవ్యాసుడు అని ప్రసిద్ది చెందాడు. వేదవ్యాసుడు అనే పేరు వెనుక గల కథ వినండి.* *మహాపురుషుల జన్మ వృత్తాం తాలు విలక్షణంగా ఉంటాయి. సాధారణ మనుష్యుల బుద్దికి అర్థం కాని అంతరార్థాలు, పర మార్థాలు అందులో ఉంటాయి. వ్యాస మహర్షి నారాయణుని అవతారము. అందుకేఆయనను వ్యాస భగవానుడు అంటారు.* *ద్వాపరంలో జన్మించినవ్యాసుడు మొట్టమొదటగా నారాయణునికి మానసపుత్రుడిగా అపాంతరము డు అనే పేరుతో జన్మించాడు*. *మనస్సు లోపల గల అజ్ఞానమనే చీకటిని తొలగించుకున్నవాడు, తొలగించేవాడిని అపాంతర ముడు అంటారు*. *మహావిష్ణువు బ్రహ్మ ముఖం నుండి వెలువడిన వేదమును శ్రద్దగా విని లోకానికి అర్ధమ య్యేలా విభజించమని అపాంతరముని ఆదేశించాడు. అపాంతరముడు ఆదేశం పాటించి వేదాలను ఋగ్వే దము, యజుర్వేదము, సామ వేదము, అధర్వణ వేదము అని నాలుగు వేదాలుగా విభజించి లోకానికి అందించాడు.* *బ్రహ్మ సంతోషించి అతనిని వేదవ్యాసుడు అని పిలిచి ప్రతి మన్వంతరంలో ఇలాగే జన్మించి వేద విభాగం చేస్తుండమని కోరాడు. అప్పటి నుంచి ప్రతి ద్వాపరంలోను వేద విభజన జరుగుతూ ఉంటుంది. వేదావ్యాసుడనే పేరు ఒక పదవి అయ్యింది ప్రథమ ద్వాపరంలో స్వయంభువు, రెండవ ద్వాపరంలో ప్రజాపతి, మూడవ ద్వాపరంలో శుక్రుడు, నాలుగవ ద్వాపరంలో బృహస్పతి ఈ పదవి అలంకరించారు. ప్రస్తుత ద్వాపరంలో పరాశర మహర్షి, సత్యవతిల పుత్రుడైన కృష్ణ ద్వైపా యనుడు వేదవ్యాసుడు అయ్యాడు* #మన సంప్రదాయాలు సమాచారం