ShareChat
click to see wallet page
search
#రెండు కళ్ళ సిద్ధాంతం.. 🤠 అమ్మ బాబోయ్! ఈ మధ్య "ఏడు కొండలని రెండు కొండలు చేసేశారు" అంటూ బాబు గారు, పవన్ గారు మైకులు విరగ్గొట్టి ఊదరగొట్టిన మాటలు గుర్తున్నాయిగా? ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆ మాటలన్నీ కూటమి నేతలకే రివర్స్ కొట్టి 'సెల్ఫ్ గోల్' అయిపోయాయి. పాపం, జగన్ గారు నిన్న ప్రెస్ మీట్‌లో ఒరిజినల్ జీవోలు, పాత వీడియోలు బయటపెట్టేసరికి కూటమి నేతల ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. వైఎస్సార్ హయాంలో ఏడుకొండలను రెండు కొండలు చేశారని ఇన్నాళ్లూ గాలిలో మేడలు కట్టారు కానీ, తీరా చూస్తే ఆ ఏడు శిఖరాలను పవిత్రమైనవని చట్టబద్ధం చేస్తూ 2007లో వైఎస్సార్ ప్రభుత్వం జీవో 746 ఇచ్చింది. అంటే ఏడుకొండల అస్తిత్వాన్ని కాపాడింది రాజశేఖర్ రెడ్డి గారైతే, "మాకా సాక్ష్యాలు అక్కర్లేదు.. మేము చెప్పిందే నిజం" అన్నట్టు కూటమి నేతలు రెచ్చిపోయారు. ఇప్పుడు ఒక్కటంటే ఒక్క డాక్యుమెంట్ కూడా చూపలేక ఒక్కరూ నోరు మెదపకపోవడం చూస్తుంటే వీరి బలహీనత ఏంటో అర్థమైపోతోంది. ఇక వేరే మతాల ప్రచారాన్ని అడ్డుకుంటూ వైఎస్సార్ జీవో 747 ఇస్తే, 2009లో చంద్రబాబు నాయుడు గారు ఒక వేదికపై నిలబడి "*ఆ జీవోలను నేను అధికారంలోకి రాగానే రద్దు చేస్తా*" అని హామీ ఇచ్చిన వీడియో ఇప్పుడు బయటపడింది. ఏడుకొండల పవిత్రత గురించి ఇప్పుడు గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చే బాబు గారు, ఆనాడు మత ప్రచారానికి పచ్చజెండా ఊపాలని చూసింది పచ్చి నిజం కాదా? దీనికి ఎవరైనా సమాధానం చెప్తారా అంటే అదీ లేదు. లడ్డూలో బాత్‌రూమ్ కెమికల్స్ కలిపారని, భక్తులు జబ్బు పడ్డారని బాంబులు పేల్చారు కానీ, ఆ జబ్బు పడ్డ భక్తులు ఏ హాస్పిటల్‌లో ఉన్నారో, ఆ మెడికల్ రిపోర్టులు ఎక్కడ ఉన్నాయో అడిగితే మాత్రం దిక్కులు చూస్తున్నారు. కేవలం భక్తుల సెంటిమెంట్‌తో ఆడుకుని రాజకీయం చేయాలనుకున్న కూటమికి, జగన్ చూపించిన సాక్ష్యాలు ఇప్పుడు పెద్ద చెంపపెట్టులా మారాయి. జగన్ ఇప్పుడు బంతిని కూటమి కోర్టులోకి తన్ని పారేశారు. ఏడుకొండలను తగ్గించారన్న దానికి ఒక్కటంటే ఒక్క జీవో చూపాలని లేదా ఆనాడు జీవో 747ని రద్దు చేస్తానని బాబు గారు ఎందుకు అన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తే, ఇటువైపు నుంచి ఉలుకూ లేదు పలుకూ లేదు. దేవుడి పేరుతో రాజకీయం చేయాలని చూస్తే అది ఎలా రివర్స్ అవుతుందో ఈ ఎపిసోడ్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. జగన్ డాక్యుమెంట్లతో సహా కొట్టేసరికి, ఇప్పుడు కూటమి నేతల దగ్గర సరైన ఆన్సర్ లేదు, ఆ అవతారం కూడా లేదు. ఇన్నాళ్లూ 'రెండు కొండల' కథ నడిపించిన ఎల్లో మీడియా కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయి ముఖం చాటేస్తోంది.😬
రెండు కళ్ళ సిద్ధాంతం.. 🤠 - ShareChat