chaitu
526 views 1 days ago
గ్రూప్‌ 1 స్కాంలో గౌతం సవాంగ్ ? ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్‌లో మాజీ ఐపీఎస్, నాటి చైర్మన్ గౌతమ్ సవాంగ్‌పై ఉచ్చు బిగుస్తోంది. కమిషన్ ఆమోదం లేకుండా దొంగ మూల్యాంకనాలు పూర్తి చేసి, రికార్డులు మాయం అయినట్లు గుర్తించారు. విజయవాడలో చేపట్టిన మాన్యువల్ మూల్యాంకనంలో డిజిటల్ ఫలితాలకు ఏకంగా 62% వ్యత్యాసం రావడం, వందలాది పేపర్లలో దిద్దుబాట్లు జరగడం వెనుక సవాంగ్ కుట్ర పన్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. హాయ్‌ల్యాండ్ రిసార్ట్‌లో రాత్రికి రాత్రులు పేపర్లు దిద్దించిన వ్యవహారాన్ని దాచిపెట్టి, హైకోర్టును సైతం తప్పుదోవ పట్టించి అర్హులైన వేలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకున్న ఘనత గౌతమ్ సవాంగ్‌దేనని భావిస్తున్నారు. ప్రభుత్వం మారగానే జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి కనిపించకుండా పోయినా, ఫోరెన్సిక్ సాక్ష్యాలు , కామ్‌సైన్ ప్రతినిధుల వాంగ్మూలాలు నేరుగా ఆయన వైపే వేలు చూపిస్తున్నాయి. డీజీపీగా ఉన్న ఆయనతో బలవంతంగా వీఆర్ఎస్ ఇప్పించి మరీ ఎపీపీఎస్సీ చైర్మన్ చేశారు జగన్. ఓ సిన్సియర్ పోలీసును స్కాంకు టూల్‌గా వాడుకున్నట్లుగా క్లారిటీ వస్తోంది. #APPSCGroup1Scam #GautamSawang #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #📖బిజినెస్
15 likes
5 shares

More like this