S.HariBlr (Bangalore)
5K views • 22 days ago
#😇My Status #విజయవాడ కనక దుర్గ #కనక దుర్గమ్మ ప్రసాదం
*ఇంద్రకీలాద్రి అమ్మ వారి భక్తులకు గుడ్ న్యూస్...*
దుర్గమ్మ ఆలయంలో సరికొత్త టెక్నాలజీ.
ఏటీఎం మిషన్ నొక్కితే చాలు చేతిలోకి లడ్డు ప్రసాదం.
లడ్డుల కోసం ఇంకా క్లూలో వేచి ఉండవలసిన పని లేదు.
ఆన్లైన్ లో బుకింగ్ ఏటీఎంలో ప్రసాదం.
ఆన్లైన్లో బుక్ చేసుకోగానే ఫోన్ కి ఒక ఓటీపీ వస్తుంది.
ఆ ఓటీపీ మిషన్ లో ఎంటర్ చేస్తే లడ్డూలు భక్తుల చేతిలోకి వస్తాయి.
సుమారు ఒకటి నుండి ఆరు లడ్డుల వరకు మిషన్ లో పొందే అవకాశం.
దసరా నవరాత్రుల కల్లా మొదలు పెట్టాలని దుర్గగుడి అధికారుల ప్లాన్.
ప్రణాళిక సిద్ధం చేస్తున్న ఆలయ అధికారులు.
మొత్తం ఆలయంలో 6 మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన ఆలయ అధికారులు.
దసరా లాంటి ఉత్సవాల టైమ్లో లడ్డుల అమ్మకాలు గణనీయంగా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయి.
సుమారు 30 లక్షల నుండి 35 లక్షల లడ్డులు ప్రతి సంవత్సరం అమ్మకాలు జరుగుతున్నాయి.
ఈ ఏడాది ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో భక్తుల సౌకర్యార్థం ఈ ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు.
భక్తుల రద్దీ దృష్ట్యా క్లూ లైన్లో భక్తులు గంటల తరబడి వేచి ఉండవలసిన అవసరం లేకుండా ఈ విధానాన్ని అమలు చేస్తున్న ఆలయ అధికారులు.
81 shares