పాతగుండాలపాడులో ప్రజల వద్దకే ప్రజావాణి – సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే జారే ములకలపల్లి మండలం పాతగుండాలపాడు గ్రామంలో నిర్వహించిన ప్రజావాణి (రచ్చబండ) కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అధికార యంత్రాంగాన్ని ప్రజల ముంగిటికే తీసుకువచ్చి సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపడమే ప్రజా పాలన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజల అవసరాలను గుర్తించి, అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ ములకలపల్లి మండలాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేర్కొన్నారు. #🏛️రాజకీయాలు #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ
5 shares

More like this