ప్రజల ఆరోగ్యం – విద్య అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది — ఎమ్మెల్యే జారె
ఉచిత ఆరోగ్య శిబిరం ప్రారంభం • పదవ తరగతి విద్యార్థులకు ధైర్యం నింపిన ఎమ్మెల్యే
11.03.2026 – బుధవారం
దమ్మపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందించడమే లక్ష్యమని తెలిపారు. క్యాంపుల ద్వారా వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించడంతో పాటు తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నట్లు చెప్పారు.
అలాగే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను ప్రత్యేకంగా పరిశీలిస్తూ ప్రభుత్వం ఆరోగ్య పథకాలపై అవగాహన కల్పిస్తున్నందున ప్రజలు ఈ ఉచిత ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు సమయానికి అందుబాటులో లేకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి, విధులను సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనంతరం త్వరలో నిర్వహించనున్న పదవ తరగతి చివరి పరీక్షల నేపథ్యంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు దమ్మపేట మండలంలోని పలు పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ధైర్యం, ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా పార్కలగండి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, పెద్దగొల్లగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, మల్కారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పరీక్షలను భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిరోజూ చదివిన పాఠాలను పునర్విమర్శ చేసుకుంటూ సమయపాలనతో చదివితే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. లక్ష్యంతో చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
అదే విధంగా ఉపాధ్యాయులతో సమావేశమై పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక మార్గదర్శనం అందించాలని తెలిపారు. విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ పగడాల రమాదేవి గారు, ఉపసర్పంచ్ ఆంగోత్ శ్రీనివాసరావు గారు, మందలపల్లి సర్పంచ్ గుజ్జుల శ్రీనివాసరావు గారు, కక్కిరాల రమేష్ గారు, టౌన్ అధ్యక్షులు చిన్నశెట్టి చిట్టిబాబు గారు, చిన్నశెట్టి యుగంధర్ గారు, పగడాల రాంబాబు గారు, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ గారు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
మహిళా విద్యకు మార్గదర్శి సావిత్రిబాయ్ ఫూలేకు ఘన నివాళులు — ఎమ్మెల్యే జారె
10.03.2026 - మంగళవారం
గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు గండుగులపల్లి క్యాంపు కార్యాలయం నందు భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయ్ ఫూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సావిత్రిబాయ్ ఫూలే మహిళల విద్యకు దారిచూపిన మహనీయురాలని అన్నారు. ఆమె తన భర్త జ్యోతిరావు ఫూలే తో కలిసి బాలికల విద్య కోసం తొలి పాఠశాలను స్థాపించి సమాజంలో అణగారిన వర్గాలకు విద్యా వెలుగులు పంచిన గొప్ప సంస్కర్తగా నిలిచారని పేర్కొన్నారు.
మహిళలు చదువుకుని స్వయం సమృద్ధితో సమాజంలో గౌరవంగా నిలవాలనే లక్ష్యంతో సావిత్రిబాయ్ ఫూలే జీవితాంతం పోరాడారని తెలిపారు. సమానత్వం, విద్యా హక్కుల కోసం ఆమె చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
#కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ
మహిళల సాధికారత మరియు విద్యాభివృద్ధి కోసం ఆమె చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
పరీక్షలకు భయపడకుండా ధైర్యంగా రాయాలి — ఎమ్మెల్యే జారె
09.03.2026 – సోమవారం
అశ్వారావుపేట మండలం మామిళ్లవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైనవని తెలిపారు. భయపడకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని, ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు పాటిస్తూ కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరని అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు మంచి నడవడిక అలవాటు చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.
శుభకార్యాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె
అశ్వారావుపేటలోని శ్రీ సత్యసాయి కళ్యాణమండపంలో సత్యవరపు జగదీష్ – లీలావతి దంపతుల మనవరాలు, నిఖిలేష్ – భవాని దంపతుల కుమార్తె సితార మీనాక్షి అన్నప్రాసన వేడుకలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.
అనంతరం సత్తుపల్లిలోని రాణి సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్లో చెలికాని భాస్కరరావు – రజిని దంపతుల కుమారుడు లోకేష్ – కృతి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి గారు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుత్ రావు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన చల్లా ఆదినారాయణ గారి భౌతిక కాయాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రావు గంగాధరరావు గారు, గ్రామ సర్పంచ్ సున్నం జయమ్మ గారు, ఉపసర్పంచ్ నూనె శ్రీనివాసరావు గారు, చల్లా రమణ గారు, నరదలు వీరాస్వామి గారు, జె. ప్రసాద్ గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
*అశ్వారావుపేటలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె*
*08.03.2026 – ఆదివారం*
అశ్వారావుపేటలో పర్యటించిన గౌరవ ఎమ్మెల్యే Jare Adinarayana గారు అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్పీవీ (HPV) టీకా ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ వ్యాధిని ముందుగానే నివారించేందుకు ప్రభుత్వం ఈ టీకాను ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా యుక్త వయస్సు బాలికలకు స్వయంగా టీకాలు అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధి రాకుండా ఉండేందుకు హెచ్పీవీ టీకా ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సేవలు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం అశ్వారావుపేట మండలంలోని అనంతారం, ఆసుపాక, తిరుమలకుంట గ్రామాలలో పలు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదే సందర్భంలో అనంతారం గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల మరియు పెద్దవాగు ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలను కూడా సందర్శించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యా సామర్థ్యం, వసతి సదుపాయాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత దృష్టి పెట్టి బలహీనంగా ఉన్న విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. గిరిజన ప్రాంతాల విద్యార్థులు కూడా ఉన్నత విద్యను సాధించి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని, ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు గారు, మున్సిపల్ చైర్ పర్సన్ జూపల్లి శశికళ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ గారు, మెడికల్ స్పెషల్ ఆఫీసర్ మౌనిక గారు, వినాయకపురం స్పెషల్ ఆఫీసర్ రాందాస్ గారు, సిహెచ్ఓ అమరావతి గారు, హెచ్వి దుర్గ గారు, హెచ్ఏలు గోపాల్ గారు, ప్రసాద్ గారు, సతీష్ గారు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #🏛️రాజకీయాలు
*లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే జారె*
02.03.2026 - సోమవారం
దమ్మపేట మండలం :-
లింగాలపల్లి ప్రభుత్వ పాఠశాలను గౌరవ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారు ఆకస్మికంగా సందర్శించారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలలో నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు ఏ తరగతి చదువుతున్నారు భవిష్యత్తులో ఏమవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారో తెలుసుకున్నారు కొంతమందిని పాఠాలు చదివిస్తూ మరికొంతమందిని ప్రశ్నలు అడిగి వారి శక్తిని పరిశీలించారు పిల్లలు ధైర్యంగా సమాధానాలు చెప్పడం పట్ల ఎమ్మెల్యే గారు సంతోషం వ్యక్తం చేశారు
ఈ పాఠశాలలో ఎమ్మెల్యే గారి శ్రీమతి వరలక్ష్మి గారు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న సందర్భంలో కూడా ప్రత్యేకత ఏమాత్రం చూపకుండా సాధారణంగానే పాఠశాల పనితీరును పరిశీలించారు అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ బోధన విధానం విద్యార్థుల హాజరు శాతం పాఠశాలలో వసతులు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
జితేష్ వి పాటిల్ గారి సేవలు మరువలేనివి — ఎమ్మెల్యే జారె
02.03.2026 – సోమవారం
నూతన కలెక్టర్ అంకిత్ గారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె
అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల బదిలీ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు.
ఆయన పదవీకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక స్థానం సంపాదించారని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసి మంచి అధికారిగా గుర్తింపు పొందారని కొనియాడారు. భవిష్యత్తులో మరింత ఉన్నత పదవుల్లో సేవలందించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా, నూతనంగా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అంకిత్ గారికి జిల్లాప్రజల తరఫున స్వాగతం పలికారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ప్రజాప్రతినిధులు మరియు అధికారులు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #🏛️రాజకీయాలు
*మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలి ---- ఎమ్మెల్యే జారె*
22.02.2026 - ఆదివారం
అశ్వారావుపేట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం మండల అధ్యక్షులు కురిశెట్టి నాగబాబు గారి అధ్యక్షతన మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన చైర్ పర్సన్ శ్రీమతి జూపల్లి శశికళ గారు వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ గారితో పాటు మున్నూరు కాపు సంఘానికి చెందిన ప్రజాప్రతినిధులు దండాబత్తుల ఆదిలక్ష్మి గారు కట్టా సింధుజ గారు కొట్టే నాగసునీత గారు అట్టం రమ్య (పోకల)గారు చిన్నంశెట్టి శ్రీను గారు, తిరుమలశెట్టి వెంకన్నబాబు గారిని శ్రీ సత్య సాయిబాబా కళ్యాణ మండపం నందు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారు హాజరై కాపుసంఘ నాయకులతో కలిసి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం ప్రజా సేవలో ముందుండాలని కోరారు కాపుసంఘం ఆధ్వర్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను సత్కరించడం అభినందనీయం అని తెలిపారు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు మున్సిపల్ చైర్ పర్సన్ జూపల్లి శశికళ గారు వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ గారు మాజీ సొసైటీ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ గారు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
*పలు ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె*
22.02.2026 - ఆదివారం
అశ్వారావుపేట మండల కేంద్రంలో కాకతీయ గేట్ సమీపంలో సెకపల్లి శ్రీనివాసరావు గారి నూతన టీ మ్యాజిక్ కేఫ్ ను ప్రారంభోత్సవం చేసి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా నారంవారిగూడెం గ్రామంలో పేరం వారి పంచకట్టు వేడుక దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలో ఇస్రం వారి నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #🏛️రాజకీయాలు
*అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ---- ఎమ్మెల్యే జారె*
22.02.2026 - ఆదివారం
దమ్మపేట మండలం
పట్వారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సత్తుపల్లి ప్రముఖ వైద్యశాలలు శ్రీనిధి హాస్పిటల్ మరియు లైఫ్ కేర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని గౌరవ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారు ఘనంగా ప్రారంభించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం చాలా అవసరముందని తెలిపారు నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు ఇటువంటి ఉచిత హెల్త్ క్యాంపులు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ముఖ్యంగా ముందస్తు వైద్య పరీక్షల ద్వారా వ్యాధులను తొందరగా గుర్తించి చికిత్స పొందే అవకాశం కలుగుతుందని అన్నారు
ఈ వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న శ్రీనిధి మరియు లైఫ్ కేర్ ఆస్పత్రుల యాజమాన్యాన్ని వైద్యులను సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు ఈ
కార్యక్రమంలో దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వాసం రాణి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు స్థానిక ప్రజా ప్రతినిధులు కూరం అర్జున్ రావు గారు బొల్లికొండ నాగేశ్వరరావు గారు వంకా జానకీరాముడు గారు మోకాళ్ల గురుమూర్తి గారు అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు గారు దమ్మపేట ఎస్సై సాయికిషోర్ రెడ్డి గారు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామపెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
*దమ్మపేటలో న్యాయవాదుల ధర్నాకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే జారె*
17.02.2026 - మంగళవారం
దమ్మపేటలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిర్వహించిన ధర్నా ర్యాలీలో ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారు పాల్గొని సంఘీభావం తెలిపారు హైదరాబాద్లో న్యాయవాది ఖాధీర్ గారి హత్యను ఖండిస్తూ రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేకంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులు సమాజంలో న్యాయం కోసం పోరాడే శక్తులని వారి భద్రత రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు ఖాధీర్ గారి హత్య ఘటన బాధాకరమని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు
న్యాయవాదుల రక్షణకు చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #🏛️రాజకీయాలు













![కాంగ్రెస్ - 585 ஓஒஸ6 09& 06 ನ್ಯಾಯವಾದುಲ ಐ5್ಯಲಿ ಏಶಿಲ್ಲಾಶಿ 885" న్యాయవాది ನಾಲೈನು' ఖండిస్తున్నాము . తీవ్రంగా ఇద్వకేట్ ప్రాటెక్షన్ యాక్టీను వెంటనే ಅನುಲು చేయాలి . న్యాయవాదులకు ప్రభుత్వం వెంటనే రక్షణ కల్పించాలి; - అసోసియేషన్ జిఠర பவ ae] భద్రాద్రి కొత్తగూదెం జిలా . 585 ஓஒஸ6 09& 06 ನ್ಯಾಯವಾದುಲ ಐ5್ಯಲಿ ಏಶಿಲ್ಲಾಶಿ 885" న్యాయవాది ನಾಲೈನು' ఖండిస్తున్నాము . తీవ్రంగా ఇద్వకేట్ ప్రాటెక్షన్ యాక్టీను వెంటనే ಅನುಲು చేయాలి . న్యాయవాదులకు ప్రభుత్వం వెంటనే రక్షణ కల్పించాలి; - అసోసియేషన్ జిఠర பவ ae] భద్రాద్రి కొత్తగూదెం జిలా . - ShareChat కాంగ్రెస్ - 585 ஓஒஸ6 09& 06 ನ್ಯಾಯವಾದುಲ ಐ5್ಯಲಿ ಏಶಿಲ್ಲಾಶಿ 885" న్యాయవాది ನಾಲೈನು' ఖండిస్తున్నాము . తీవ్రంగా ఇద్వకేట్ ప్రాటెక్షన్ యాక్టీను వెంటనే ಅನುಲು చేయాలి . న్యాయవాదులకు ప్రభుత్వం వెంటనే రక్షణ కల్పించాలి; - అసోసియేషన్ జిఠర பவ ae] భద్రాద్రి కొత్తగూదెం జిలా . 585 ஓஒஸ6 09& 06 ನ್ಯಾಯವಾದುಲ ಐ5್ಯಲಿ ಏಶಿಲ್ಲಾಶಿ 885" న్యాయవాది ನಾಲೈನು' ఖండిస్తున్నాము . తీవ్రంగా ఇద్వకేట్ ప్రాటెక్షన్ యాక్టీను వెంటనే ಅನುಲು చేయాలి . న్యాయవాదులకు ప్రభుత్వం వెంటనే రక్షణ కల్పించాలి; - అసోసియేషన్ జిఠర பவ ae] భద్రాద్రి కొత్తగూదెం జిలా . - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_779402_38f14619_1771336777821_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=821_sc.jpg)