sarvathomukhi SATSANGAM
#😃మంచి మాటలు వేదాంత సూత్ర సారమే శ్రీ పద్మావతీ అమ్మ వారి సహస్రనామములు
బ్రహ్మ సూత్రము
మూడవది శాస్త్ర యెానిత్వాత్
జగత్తునకు కారణమైన పరబ్రహ్మ మును వేద శాస్త్ర ముల ద్వారానే పూర్తిగా తెలియబడునవి యితర ప్రమాణములకు అగోచరుడని నిరూపిస్తుందు శ్రీ పద్మావతి అమ్మ వారి నామముల పరంగా ఈ సూత్ర పు తత్త్వము అమ్మ వారే సకల వేదమలకు మూల కారణమైన శక్తి స్వరూపిణీ అన వివరిస్తుంది.
శ్రీ పద్మావతీ అమ్మ వారు వేంకటేశ్వరుని అర్ధాంగి. ,మహా లక్ష్మీ స్వరూపము సృష్టికి జ్ణానానికీ మరియు వేదవాజ్మయానికి అధి దేవత.
వేదమయి శ్రుతిస్వరూపిణి అమ్మ వారు వేదాలలోని మంత్రశక్తికి మరియు ఉపనిషత్ ప్రకాశానికి నిలయము. శాస్త్రయెానిత్వాత్ సూత్రము ప్రకారము బ్రహ్మముఎలా శాస్త్రా నికి కారణమెా ,అలాగే అమ్మ వారు జగన్మాతగా వేదవాణిని ప్రసాదించే ఆదిశక్తి.
జ్ణాన గమ్య ఆమె
లౌకిక ప్రమాణాలైన ప్రత్యక్ష అనగా కంటికి కనిపించేది. లేదా అనుమా న ఊహించేది ద్వారా పరతత్త్వాన్ని కర్తగా అంచనా వేయ లేము. కేవలం దివ్యమైన శాస్త్ర జ్ణానంతోనే బ్రహ్మమును చేరవచ్చు.అదే విధంగా భక్తులు అమ్మ వారి అనుగ్రహాన్ని కేవలము భక్తి,వేదోపనిషత్తుల ద్వారా లభించే అంతర్దర్శనము తోనే అనుభవించ గలరు.
జగత్ కారణ శక్తి. విశ్వాన్ని సృష్టించి,రక్షించి నడిపించే పరమాత్మశక్తిికి రూపమే పద్మావతీ దేవి. మూడవ సూత్రము నిర్దేశించిన పరబ్రహ్మ లక్షణాలలోని సర్వజ్ణతకు, చైతన్యానికి అమ్మ వారే అభిన్నమైన శక్తి స్వరూపము.
కుండలినీ స మన్వయము
అలమేలు మంగ లేదా పద్మావతీ అమ్మ వారు సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపము మంత్రశాస్త్రంలో అమ్మ వారి నామాలు కేవలం పిలుపులు కావు.అవి కుండలినీ శక్తియెుక్కవిభిన్నస్థితులను,యెాగరహస్యాలను సూచిస్తాయి.
పద్మాసనే /పద్మస్థే/ పద్మమునందు ఆసీనురాలైనది
అమ్మవారిని సహస్రదళ పద్మస్థురాలిగా కీర్తిస్తారు.యెాగ సాధనలో కుండలినీ సహస్రార పద్మాన్ని చేరినప్పుడు సాధకుడికి అమృతవర్షము పరమానందం సిద్ధిస్తాయి అమ్మ వారి పద్మ నామం హృదయ కమలం అనాహత మరియు శిరః కమలం సహస్రారం లోని దివ్యత్వాన్ని సూచిస్తుంది.
క్షీరాబ్ధి తనయే పాలకడలి కూతురు
యెాగ పరంగా క్షీర సాగరము అంటే సహస్రార చక్రం నుండి స్రవించే అమృత ధార కుండలినీ పైకి చేరినప్పుడు కలిగే బ్రహ్మానంద స్థితికి యిది సంకేతము.
సర్వజ్ణే/ సర్వ వరదే
కుండలినీ శక్తి జాగృతి అయినప్పుడు సాధకుడికి లభించే త్రికాల జ్ణానము ,వాక్ సిద్ధి మరియు ముక్తి సారాంశాన్ని ఈ నామాలు తెలియ చేస్తాయి.
బ్రహ్మ సూత్రము లో మూడవ సూత్రము ఏ జ్ణానాన్ని సాధించమని చెప్తుందోశాస్త్రమూలమైన జ్ణానము ఆజ్ణానాన్ని సాధించే అంతర్గత యెాగ మార్గమేకుండలినీ సాధన. ఆ సాధనలో లభించే పరమశాంతి ,ఐశ్వర్యం మరియు మెాక్ష స్వరూపమే పద్మావతీ అమ్మ వారుఅమ్మ వారి నామాలను నిరంతరం స్మరించడం లేదా ఉపాసించడం వలన శరీరంలోని కుండ లినీ శక్తి సహజంగాఊర్ధ్వ ముఖంగా ప్రయాణించి జీవుడికీ, బ్రహ్మ సాక్షాత్కారాన్ని కల్గి సుందని విశ్వాసము
మూల ప్రకృతి రూపిణి
శాస్త్రయెాని అయిన పరాశక్తే కుండలినీ గా మారి మానవదేహంలో ప్రాణ శక్తిని నిలుపుంతుంది. అమ్మ వారి నా మ స్మరణ ఈ సుప్త శక్తిని మేల్కొల్పడానికి తోడ్పడుతుంది.
శాస్త్ర యెానిత్వాత్ మరియు కుండలినీ అంతరార్థము
1
అంశం యెాని, మూలము
బ్రహ్మ సూత్ర దృక్పధము సృష్టికి,జ్ణానానికి మూల కారణము
కుండలినీ అంతరార్ధము
మానవశరీరంలో కుండలినీ నివసించే మూలాధార చక్రము యెాని స్థానము
2
అంశము
శాస్త్రము జ్ణానము
బ్రహ్మ సూత్ర దృక్పధము..వేదాలు,శాస్త్రాలు బ్రహ్మమును తెలుపుతాయి
కుండలినీ అంతరార్ధము
కుండలినీ మేల్కొన్నప్పుడు సకల శాస్త్రసజ్ణానము,వాక్ సిద్ధి దక్కుతాయి.
పద్మావతీ అమ్మ వారి తత్త్వము
లక్ష్మీ స్వరూపమైన ఐశ్వర్యము ముక్తి
కుండలినీ సహస్రార పద్మాన్ని చేరినప్పుడు కలిగే
బ్రహ్మా నందమే నిజమైనఐశ్వర్యము
అధ్యాత్మిక రచయిత్రి
కలము పేరు కుండలినీ ప్రజ్ణ
దీక్షా నామము సర్వతోముఖీ