వి శ్రీనివాస్
228ఫ6:
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
#######################
*ఆనందమే ఆధ్యాత్మికత*
➖➖➖✍️
#######################
ముభావంగా, గంభీరంగా ఉండడమే``` ఆధ్యాత్మిక జీవితమని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. కానీ ఉల్లాసంగా, ఆనందంగా ఉండడం, ‘నలుగురికీ దాన్ని పంచడమే’ నిజమైన ఆధ్యాత్మిక జీవితమని రామకృష్ణ సంఘ సాధువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
స్వయంగా రామకృష్ణ పరమహంస కూడా ఒకసారి జగన్మాతను “అమ్మా! నన్ను శుష్కసాధువుగా మాత్రం చేయవద్దు. ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటూ ఆనందాన్ని ఆస్వాదించే భక్తుడిగా ఉంచు తల్లీ!” అని ప్రార్థిస్తారు.
వారు తమ దగ్గరకు వచ్చే భక్తబృందాన్నీ, అభిమానుల్నీ నిరంతరం నవ్విస్తూ, ఆనందంలో ముంచెత్తుతూ ఉండేవారు. అందుకే రామకృష్ణ సంఘంలో చాలామంది సన్న్యాస సోదరులు సున్నితమైన హాస్యోక్తులతో, నవ్వుతూ, నవ్విస్తూ కనిపిస్తూ ఉంటారు.
దీనికి సంబంధించి షిల్లాంగ్ లోని రామకృష్ణ ఆశ్రమంలో ఒకసారి ఆసక్తికరమైన సంఘటన సంభవించింది.
అక్కడి ఆశ్రమానికి ఆనుకునే ముఖర్జీ వంశీకుల కుటుంబం ఒకటి ఉండేది. ఆ కుటుంబసభ్యులు రోజూ ఇక్కడి సన్న్యాసుల దినచర్యను గమనిస్తూ ఉండేవారు.
ఒకరోజు సాధు బృందమంతా రాత్రి భోజనం చేస్తున్న సందర్భంలో హఠాత్తుగా పక్కింట్లో నుంచి ఆ ఇంటి పెద్ద ముఖర్జీ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు షిల్లాంగ్ రామకృష్ణ ఆశ్రమానికి ‘స్వామి సౌమ్యానంద’ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు.
ముఖర్జీ అకస్మాత్తుగా తాము భోజనం చేస్తున్న దగ్గరకు వచ్చేసరికి, స్వామి సౌమ్యానంద ఆశ్చర్యపోతూ “ఏం ముఖర్జీ! ఇలా వచ్చావు. ఏమైనా ముఖ్యమైన పనుందా?” అని అడిగారు.
అప్పుడు ముఖర్జీ “క్షమించండి స్వామీజీ! ఇలా రావడం పొరపాటే! కానీ మా ఆవిడతో చిన్న వివాదం తలెత్తింది. దాన్ని పరిష్కరించుకునేందుకే ఇక్కడకు ఈ వేళలో రావాల్సి వచ్చింది” అన్నాడు.
“ఏమిటది?” అని స్వామీజీ ప్రశ్నించారు.
“మీ భోజనాల గదికి కొన్ని అడుగుల దూరంలోనే మా ఇల్లని మీకు తెలుసు కదా! మీరు మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం చేసేటప్పుడు ఎంతో సరదాగా, నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది విని మా ఆవిడ 'స్వామీజీలు మంచి, మంచి వంటకాలతో భోజనం చేస్తూ ఉంటారేమో! అందుకే ఎప్పుడూ అంత ఉల్లాసంగా ఉంటారు' అని అంటుంది. కానీ నేను ఆమెతో, 'లేదు! ఆశ్రమం ఆర్థికంగా అంత మంచి స్థితిలో ఏమీ లేదు. అన్ని రకాల వంటలు చేసుకునే అవకాశమే లేదు. అలాంటప్పుడు పాపం, స్వామీజీలు రుచికరమైన పదార్థాలు ఎలా తినగలుగుతారు? వాళ్ళు సహజంగానే సంతోషంగా ఉంటారు' అని అంటూ ఉంటాను. మా ఆవిడ నా మాటలను అంగీకరించడం లేదు. అందుకే నేను స్వయంగా చూసి అసలు విషయం తెలుసుకుందామని వచ్చాను” అన్నాడు ముఖర్జీ.
అప్పుడు స్వామి సౌమ్యానంద నవ్వుతూ, “ముఖర్జీ! దయచేసి మీరూ కూర్చోండి. ఈ రోజుకు మాతో కలసి భోజనం చేయండి. అప్పుడు మీకూ ప్రత్యక్షంగా విషయమేంటో అర్థమవుతుంది” అన్నారు.
కానీ ముఖర్జీ సున్నితంగా తిరస్కరిస్తూ, కేవలం భోజనం చేస్తున్న సాధువులను గమనిస్తూ కూర్చున్నాడు. అతి సాధారణమైన అన్నం,పప్పు,కూర మాత్రమే భోజనాల్లో ఉండడం చూసి ముఖర్జీ ఆశ్చర్యపోయాడు. ఆ రోజు నుంచి ముఖర్జీ కుటుంబసభ్యుల అపోహలన్నీ తొలగిపోయి, ఆశ్రమ సాధువులకు మరింత దగ్గరయ్యారు. విశేష పర్వదినాల్లో ముఖర్జీ సతీమణి స్వయంగా మిఠాయిలు, ఇతర ప్రత్యేక వంటకాలు తయారుచేసి ఆశ్రమానికి పంపిస్తూ ఉండేది.
ఇలా ఆనందానికీ, ఆధ్యాత్మికతకూ అవినాభావ సంబంధం ఉందనడానికి సంఘ వరిష్ఠ సాధువులెందరో నిదర్శనం. భగవాన్ శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులుగా స్వామి వివేకానంద నుంచి స్వామి శివానంద మహరాజ్ వరకు ఎందరో తమ జీవితకాలంలో ఎలాంటి అరమరికలు లేకుండా ఎప్పుడూ ఒకరితో మరొకరు ఉల్లాసంగా గడుపుతూ, గృహస్థ భక్తులకే కాకుండా, మాలాంటి సన్న్యాస సోదరులకు కూడా ఆదర్శంగా నిలిచారు.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
`🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
`*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*`
➖▪️➖
`ఇలాటి మంచి విషయాలకోసం…`
*“భగవంతుని విషయాలు గ్రూప్“* `లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏`
#📙ఆధ్యాత్మిక మాటలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి