కిషోర్ గునుకుల
563 views • 14 hours ago
జనసేన అభివృద్ధి అడుగులు – సంక్షేమ వెలుగులు” కార్యక్రమంలో భాగంగా 16వ డివిజన్ రాంజీ నగర్ లో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఇంటింటి ప్రచారం శనివారం కూడా ఉత్సాహంగా కొనసాగింది.
#KishoreGunukula - #JanaSena
#JanaSenaParty
ఈ సందర్భంగా పలువురు గృహస్థులను కలుసుకున్న జనసేన నాయకులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రానున్న నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి, అభివృద్ధికి మరింత బలం చేకూర్చాలని ప్రజలను కోరారు.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి శ్రీ Dr. #PonguruNarayana గారి నాయకత్వంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను ఇంటింటికీ తీసుకెళ్లడం తమ బాధ్యతగా భావిస్తున్నామని కిషోర్ గునుకుల తెలిపారు. రోడ్లు, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమం తదితర రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించారు.
నెల్లూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వానికి ప్రజల సహకారం, మద్దతు అవసరమని, అభివృద్ధి నిరంతరంగా కొనసాగేందుకు రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్, విజయలక్ష్మి,శ్రీమతి చల్లా కవిత, ప్రశాంత్ గౌడ్, నరహరి, శివ,మహెష్,నాని తదితరులు పాల్గొన్నారు..
#PawanKalyanAneNenu #Nellorecity #Andhrapradesh #DoortoDoorCampaign ##janasena ##pawankalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
14 likes
9 shares