JanaSena Party Telangana
601 views • 1 days ago
ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్గా శ్రీ @NagaBabuOffl బాధ్యతల స్వీకరణ
జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రీచ్మెంట్ (ఏపీ గ్రీన్) సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్గా శుక్రవారం అధికారిక బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్యభవన్లో జరిగిన కార్యక్రమంలో శ్రీ నాగబాబు గారు తన సతీమణి శ్రీమతి పద్మజ గారితో కలిసి పాల్గొన్నారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేదపండితులు శ్రీ నాగబాబు గారికి వేద ఆశీర్వచనం అందించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏపీ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ నాగబాబు గారికి ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్గా ఆయనకు ప్రభుత్వం కేబినెట్ ర్యాంకు హోదా కల్పించింది. ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నాగబాబు గారిని పీసీసీఎఫ్ శ్రీ పి.వి.చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ చీఫ్ శ్రీ రాహుల్ పాండే, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ శ్రీ ఎన్. నాగేశ్వరరావు, సీసీఎఫ్ గుంటూరు శ్రీ వై. శ్రీనివాసరెడ్డి, పీసీసీఎఫ్ విజిలెన్స్ శ్రీమతి రేవతి, సీసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ గ్రీన్ శ్రీ బి.ఎన్.ఎన్. మూర్తి , పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, ఉప ముఖ్యమంత్రి గారి ఓఎస్డీ శ్రీ వెంకటకృష్ణ, ఏపీ టిడ్కో ఛైర్మన్ శ్రీ వేములపాటి అజయ కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, తూర్పుకాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్గా శ్రీమతి పాలవలస యశస్వి, పొల్యూషన్ కంట్రోట్ బోర్డు మెంబర్ శ్రీ పంచకర్ల సందీప్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
#🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞పాలిటిక్స్ టుడే #👋విషెస్ స్టేటస్ #🏛️రాజకీయాలు
12 shares