Mohan
735 views • 1 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #BRS party 🌊 నిండుగా శ్రీశైలం.. నీళ్లింకా ఎత్తరేం❗🚨 కృష్ణా జలాలపై నిమ్మకు నీరెత్తినట్టు రేవంత్ సర్కార్ 🆘
⚠️ పాలమూరు, కల్వకుర్తికి ఎత్తిపోసే వీలున్నా మౌనం
⛔ వరదను కిందికి వదిలి, సాకులు చెప్తున్న ప్రభుత్వం
🚫 జూరాల అవుట్ఫ్లో, శ్రీశైలం ఇన్ఫ్లో మధ్య భారీ తేడా
🛑 కృష్ణా నీటిని ఒడిసిపట్టకుండా సాగనంపుతున్న కాంగ్రెస్ సర్కార్
❌ ఏపీ కోసమేనా వెంపర్లాట? పట్టదా పాలమూరు గోస?
కండ్ల ముందే నీరున్నా పొలాలకు పారని దుస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులను ఇంకా వెంటాడుతూనే ఉన్నది. కృష్ణా నదిలో వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతున్నా రేవంత్ సర్కార్ కపట నీతితో అన్నదాత కంటనీరు పెట్టుకోవాల్సిన దుర్గతి పడుతున్నది. జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నా ఏపీకి దోచి పెట్టేందుకే తెలంగాణ రైతుల ఆశలను కాంగ్రెస్ నీరుగారుస్తున్నది.
ఒకవైపు కృష్ణా, భీమా నదులు పొంగిపొర్లుతూ శ్రీశైలం వైపు పరుగులు తీస్తుంటే, రాష్ట్ర సర్కార్ పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోయకుండా దోబూచులాడుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మరో నాలుగు మోటర్లతో కూడా నీటిని ఎత్తిపోయొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రెండు ప్రాజెక్టులకు నీటిని వదలకుండా కృష్ణా జలాలను వృథాగా దిగువకు వదిలిపెడుతున్నది.
ఆంధ్రా ప్రాజెక్టులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నీటిని తరలిస్తున్నా కృష్ణా రివర్ బోర్డు లెక్కల్లో మాత్రం కనిపించడం లేదు. వేల క్యూసెక్కులు గ్రావిటీ ద్వారా ఆంధ్రా దోచుకుపోతుంటే.. ఏపీ కనుసన్నల్లో ఉన్న బోర్డు ఈ నీటిని లెక్కించడమే లేదు. ఏపీ తన ప్రాజెక్టులకు నీటిని తరలిస్తూ లెక్కలు దాచిపెడుతుండగా, తెలంగాణ సర్కార్ మాత్రం ఉన్న రెండు ప్రాజెక్టులకు నీళ్లను తరలించలేక చేతులెత్తేస్తున్నది.
9 likes
11 shares