నరసింహ గౌడ్
*🙏సర్వేజనా సుఖినో భవంతు🙏 -
🌺*శుభోదయమ్*🌺
-------------------
🌺 *మహనీయుని మాట*🌺
-------------------------
"సంతోషం ఒక జీవన విధానం.
ప్రతిరోజూ ఆనందాన్ని ఎంచుకోవడమే నిజమైన విజయం. పరిస్థితులు కాదు మన దృష్టికోణమే సంతోషాన్ని నిర్ణయిస్తుంది.
సంతోషంగా ఉండటం మన నిర్ణయం."
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌹
---------------------------
"అవమానం జరిగిన చోట నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది.
మళ్లీ తిరిగి నిలబడే ధైర్యాన్ని. అంతేకానీ తిరిగి అవమానించే గుణాన్ని మాత్రం నేర్చుకోకూడదు."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
卐ఓం శ్రీ గురుభ్యోనమః卐
ఆదివారం, ఆగష్టు 23, 2026
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం- వర్ష ఋతువు*
*శ్రావణ మాసం - శుక్ల పక్షం*
తిథి : *ఏకాదశి* తె3.36 వరకు
వారం : *ఆదివారం* (భానువాసరే)
నక్షత్రం : *మూల* సా6.25 వరకు #ఐ లవ్ షేర్చాట్ #⛳భారతీయ సంస్కృతి #శుభోదయం ఐ లవ్ షేర్ చాట్ #ఐ లవ్ షర్చాట్ #🌅శుభోదయం
యోగం : *విష్కంభం* ఉ8.07 వరకు
కరణం : *వణిజ* మ2.36 వరకు
తదుపరి *భద్ర* తె3.36 వరకు
వర్జ్యం : *సా4.38 - 6.25*
మరల *తె5.02 నుండి*
దుర్ముహూర్తము : *సా4.38 - 5.28*
అమృతకాలం : *ఉ11.19 - 1.05*
రాహుకాలం : *సా4.30 - 6.00*
యమగండ/కేతుకాలం : *మ12.00 - 1.30*
సూర్యరాశి: సింహం || చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 5.47 || సూర్యాస్తమయం:
6.19
👉 *సర్వ ఏకాదశి*
*పుత్రదా ఏకాదశి*
(శ్రావణమాసం శుక్లపక్షం)
23-08-2026 ఆదివారం
శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి / పవిత్రోపన ఏకాదశి అంటారు. వివాహమై సంతానం లేక బాదపడుతుండే జంట ఈ ఏకాదశి నాడు ఉపవసించి శ్రీ హరిణి విష్ణు సహస్రానామలతో అర్చిన్చినట్లయితే తప్పక సంతానం కలుగుతుంది. అందుకే దీనిని *పుత్రాద ఏకాదశి* అని అంటారు.
*శ్రీ కృష్ణుడు యుధిష్టర మహా రాజు కి వివరించిన పురాణ గాథ *
పూర్వము మహజిత్ అనే రాజు ఉండేవాడు. అతను మహా దైవ భక్తుడు ప్రతి నిత్యం దేవునికి ఎంతో భక్తీ శ్రద్దలతో పూజ కార్యక్రామాలు నిర్వహించేవాడు కాని రాజా వారికి సంతానం కలుగలేదు. ఎంతో మంది ఋషులను , పండితులను సంప్రదించిన తన సమస్య కు దారి దొరకలేదు.
చివరిగా లోమేష్ మహర్షి తన ఆశ్రమం లో తపస్సు చేసుకుంటూ ఉండగా మహారాజ వారు అక్కడికి చేరుకొని వెళ్లి తన దుఃఖాన్ని వివరిస్తాడు అప్పుడు మహర్షి నువ్వు పడుతున్న భాదలు ఏంటి , నువ్వు చేసిన పాపా కర్మములు ఏంటి అని అడుగగా అప్పుడు తన పూర్వవృతాంతం అంత చెప్పగా దయర్తా హృదయుడైన మహర్షి నీకు నేను ఒక ఉపాయం చెప్పేదను అని చెప్పి శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశి రోజు మీ దంపతులు ఇద్దరు భక్తీ శ్రద్దలతో ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును భక్తీ శ్రద్దలతో పూజిస్తే తప్పకుండ మీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు.
పూర్వం రాజు వర్తక వ్యపారం చేస్తూ ఒకసారి దప్పిక వేసి ఒక కొలను దగ్గరికి నీరు త్రాగడానికి వెళ్లి అక్కడే నీళ్లు త్రాగుతూ ఉన్న ఒక ఆవుని నీళ్లలోకి తోసేసాడట దానికి పాప పరిహారంగా రాజు గారికి సంతానం కలుగలేదు అని కథనం.
మహర్షి వారు చెప్పినట్లు మహజిత్ రాజు భక్తి శ్రద్దలతో కుటుంబ సమేతంగా ఉపవాసం ఉండి నియమ నిష్టలతో స్వామి వారిని పూజిస్తాడు. ఆ తరువాత రాజుకి గారి మంచి సంతానం కలుగుతుంది. దానికి రాజు చాల సంతోషపడి బ్రాహ్మణులకు , రాజ్యం లో ఉన్న ప్రజలకు చాల దాన ధర్మాలు చేసాడట.
శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశి ఉపవాసం ఉండడం వలన మనం చేసుకున్న పాపాలు అన్ని హరిస్తాయని , మంచి సంతానం కలుగుతుంది అని పురాణాలూ చెబుతున్నాయి. భవిష్య పురాణం లో వివరించడం జరిగింది.
🌺 శుభమస్తు🌺
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*