• 16 shares
More like this
- hima#🙏🏻భగవద్గీత సందేశం1516
- Arjun.K Mudhiraj 👑 9393747279#🙏🏼భగవద్గీత #🙏🏻భగవద్గీత సందేశం #🙏🏻కృష్ణుడి భజనలు #📙ఆధ్యాత్మిక మాటలు #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ *"రక్తం చుక్క చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధమే మాట"* 💯 ఇది 100% భగవద్గీత చెప్పిన సత్యం 🙏 ### *భగవద్గీత మాట గురించి ఏమి చెప్తుంది?* #### *1. మాట = ఆయుధం* *Bhagavad Gita 17.15* *Telugu:* *_"అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ | స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ||"_* *అర్థం:* "ఎవరినీ ఉద్వేగపరచని, సత్యమైన, ఇంపుగా ఉండే, హితమైన మాట మాట్లాడడం. దీన్నే వాక్ తపస్సు అంటారు." *అంటే:* మాటతో కూడా తపస్సు చేయొచ్చు. మాటతో హింస కూడా చేయొచ్చు. #### *2. మూర్ఖుడు vs తెలివైనవాడు* *Bhagavad Gita 2.56* *"దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః"* *అర్థం:* "దుఃఖంలో కూడా కంగారు పడకుండా, మాటతో ఇతరులను బాధించకుండా ఉండేవాడే స్థితప్రజ్ఞుడు." #### *3. మాటతో జరిగే హింస - 3 రకాలు* Gita 17.15 లో కృష్ణుడు 3 rules ఇచ్చాడు. ఇవి break చేస్తేనే "మానసిక హింస" అవుతుంది: 1. *అసత్యం* - అబద్ధం చెప్పడం → నమ్మకం చంపుతుంది 2. *అప్రియం* - కటువుగా, నొప్పించే మాట → మనసు చంపుతుంది 3. *అహితం* - మంచి కోసం కాకుండా మాట → భవిష్యత్తు చంపుతుంది ### *Gita ఇచ్చే 4 సూత్రాలు - మాటను ఆయుధంగా కాకుండా ఔషధంగా వాడడానికి* 1. *10 సెకన్ల Rule - Gita 2.48* కోపం వచ్చినప్పుడు 10 sec ఆగు. _సమత్వం_ తో మాట్లాడు. 2. *3 ప్రశ్నల Rule* మాట్లాడే ముందు: ఇది *సత్యమా? అవసరమా? దయతో కూడిందా?* 3 లో 1 లేకపోతే మాట్లాడొద్దు. 3. *వాక్ సంయమం - Gita 17.16* అవసరం లేని మాట, gossip, criticism - ఇవి energy waste. మౌనం కూడా తపస్సే. 4. *ప్రియహితం* మంచి చెప్పాలి. కానీ ఇంపుగా చెప్పాలి. చేదు మందును కూడా తేనెతో ఇస్తారు కదా. *Gita 2.7* - _"శిష్యస్తేహం శాధి మాం"_ - "నేను నీ శిష్యుడిని. నాకు బోధించు" అదే సమయంలో దుర్యోధనుడు? మాటలతోనే మహాభారతం తెచ్చాడు. *_"కత్తి గాయం 7 రోజుల్లో మానుతుంది కానీ మాట గాయం 7 జన్మలకు మానదు__ __మూర్ఖుడు: మాట్లాడి తరువాత ఆలోచిస్తాడు జ్ఞాని: ఆలోచించి తరువాత మాట్లాడతాడు__ _- Bhagavad Gita 17.15_" --- *సారాంశం:* __మాటను వదిలే ముందు 2 సార్లు ఆలోచించు. ఎందుకంటే తిరిగి తీసుకోలేవు._*713
- మోహిని#📜శ్రీకృష్ణుని బోధనలు🌼 #🙏🏻భగవద్గీత సందేశం #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #📙ఆధ్యాత్మిక మాటలు #🙏🏻కృష్ణుడి భజనలు1214
- sweety#🙏🏻భగవద్గీత సందేశం1213
- 🌷✿! శ్రీకాకుళం అబ్బాయి!✿🌷#🙏🏼భగవద్గీత #📙ఆధ్యాత్మిక మాటలు #✍️కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #💪మోటివేషనల్ కోట్స్2826
- Kiran#🙏🏼భగవద్గీత207101
- Tata Satyanarayana#🙏🏻భగవద్గీత సందేశం #🍯జన్మాష్టమి త్వరలో రాబోతోంది🙏 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #📜శ్రీకృష్ణుని బోధనలు🌼 #📜శ్రీకృష్ణుని బోధనలు🌼 #🙏🏼శ్రీకృష్ణుని కథలు📖1528
- వి శ్రీనివాస్. 👆 `అందరికీ సులభంగా అర్ధమయ్యే రీతిలో…` 2612c3;264e3;288ఫ3; భగవద్గీత… `ధారావాహిక-3` 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀3️⃣. `భగవద్గీత పఠనం…` `మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!` *భగవద్గీత* ➖➖➖✍️ `(సరళమైన తెలుగులో)` *తొలిపలుకు (Contd…3 భగవద్గీతలో మొదటి అధ్యాయము పేరు అర్జున విషాద యోగము. ``` ఈ అధ్యాయములో మనకు రెండు విషయాల గురించి చెప్పాడు వ్యాసులవారు. భగవద్గీత మహాభారతంలో అంతర్భాగం అని మనకు తెలుసు. కేవలం భారతం చదివినప్పుడే కాకుండా గీతను ప్రధాన గ్రంధంగా కూడా చదువుకోవచ్చు. అందుకే భగవద్గీత మనకు ప్రత్యేక పుస్తకంగా దొరుకుతూ ఉంది. కాని, గీతను ప్రత్యేకంగా చదివితే, భారతంలో ఉన్న పాత్రల గురించి మనకు అర్థం కాకపోవచ్చు. అందుకే వ్యాసుల వారు భగవద్గీతలో 1వ శ్లోకం నుండి 23వ శ్లోకం దాకా, భారతంలోని ముఖ్యమైన పాత్రలు, గీత చెప్పినప్పటి సన్నివేశము మొదలగు వాటి గురించి చెప్పాడు. 24వ శ్లోకం నుండి అర్జునునికి విషాదము ఎందుకు కలిగింది అనే విషయాన్ని వివరించాడు. ఇప్పుడు మొదటి భాగం గురించి తెలుసుకుందాము.. 1వ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నట్టు ఉంది.. “ధర్మక్షేత్రము అయిన కురుక్షేత్రములో యుద్ధము చేయడానికి కోరిక కలిగిన నా వాళ్లు, పాండురాజ కుమారులు ఏమి చేసారు?” అని అడిగాడు. ఈ శ్లోకంలో ఒక యుద్ధం జరుగుతూ ఉందనీ, ఆ యుద్ధము కురు భూములలో జరుగుతూ ఉందనీ, ఆ కురుభూములు ధర్మము వెల్లివిరిసే క్షేత్రాలనీ, ఇప్పుడు యుద్ధ క్షేత్రము అయిందనీ, ఆ యుద్ధములో ధృతరాష్ట్రుని సంతతి, పాండురాజు సంతతి యుద్ధమునకు సన్నద్ధము అయ్యారనీ మనకు తెలియజేసాడు వ్యాసులవారు. రెండవ శ్లోకంలో దుర్యోధనుడు రాజు అనీ, ఆయన గురువు ద్రోణుడు అనీ, పాండవ సైన్యము ఎదురుగా మోహరించి ఉందనీ తెలియజేసాడు. మూడవ శ్లోకంలో పాండవ సైన్యానికి ద్రుపదుని కుమారుడు (ధృష్టద్యుమ్నుడు అనేవాడు) సైన్యాధి పతి అనీ, ఆ ద్రుపదుని కుమారుడు ద్రోణుని శిష్యుడు అనీ వ్యాసులవారు తెలియజేసారు. అంటే అన్నదమ్ములే కాకుండా గురుశిష్యులు కూడా ఎదురు ఎదురుగా యుద్ధం చేయడానికి నిలబడ్డారు అని తెలుస్తూ ఉంది. నాలుగు నుండి ఆరు శ్లోకాలలో పాండవ పక్షాన ఉన్న వీరులను పరిచయం చేసారు వ్యాసుల వారు. భీముడు, అర్జునుడు, యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు మహారథులు, ధృష్టకేతుడు, కాశీరాజు మొదలగు వీరులు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు మొదలగు రాజులు, యుధామన్యుడు, విక్రాంతుడు, ఉత్తమౌజుడు మొదలగు వీరులు, సుభద్ర కుమారుడు(అభిమన్యుడు), ద్రౌపది కుమారులు(ఉపపాండవులు). వీరంతా మహారథులు అని భారతంలోని పాండవ పక్షాన మోహరించి ఉన్న ముఖ్యపాత్రలను పరిచయం చేసారు వ్యాసులవారు. తరువాత 8వ శ్లోకంలో దుర్యోధనుడు తన పక్షాన ఉన్న వీరుల గురించి చెప్పాడు. భీష్ముడు,ద్రోణుడు,కర్ణుడు, కృపాచార్యులు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తునికుమారుడు(భూరిశ్రవసుడు) మొదలగు వారిని పరిచయం చేసాడు. ఈ సైన్యాలకు అధిపతుల గురించి 10 వ శ్లోకంలో చెప్పాడు. కురుసేనలకు భీష్ముడు, పాండవ సేనలకు భీముడు అధిపతులు. ఆ రోజులలో, యుద్ధములలో మోగించే వాద్యవిశేషముల గురించి 13వ శ్లోకంలో పరిచయం చేసారు వ్యాసుల వారు. శంఖములు, భేరీ, పణవానకము, గోముఖము మొదలగు వాద్యములు. తరువాత మరొక విషయాన్ని కూడా ప్రస్తావించారు వ్యాసులవారు. యుద్ధము విశాలమైన కురుభూములతో జరుగుతూఉంది. అందరూ దూర దూరంగా ఉంటారు. కంటికి కనపడరు. ఎవరు ఎక్కడ ఉన్నదీ తెలుసుకోడానికి యుద్ధంలో ఉపయోగించే పరికరము శంఖము. ఒక్కొక్కరి శంఖము ఒకొక్కవిధమైన శబ్దం వెలువరిస్తుంది. పైగా శంఖము ఊదే వైఖరి, అంటే ఆగి ఆగి ఊదడం, సాఫీగా ఊదడం, ఉదృతంగా ఊదడం ద్వారా అక్కడ ఏం జరుగుతూ ఉందో తన వాళ్లకు తెలియజేయవచ్చు. అందుకనీ ఒక్కొక్క వీరునికి ఒక్కొక్క విధమైన శంఖము దానికో పేరు ఉంటుంది. హృషీకేశుడు అయిన కృష్ణుడికి పాంచజన్యము, ధనంజయుడు అయిన అర్జునుడికి దేవదత్తము, వృకోదరుడు అయిన భీమునికి పౌండ్రము, యుధిష్టిరునికి అనంత విజయము, నకులునికి సుఘోషము, సహదేవునికి మణిపుష్పకము అనే శంఖాలు ఉన్నాయి అని మచ్చుకు కొన్ని వివరించారు వ్యాసులవారు. 21వ శ్లోకంలో అర్జునుడు కృష్ణునితో, “కృష్ణా!నా రథము ఉభయసేనలమధ్య నిలుపు” అని ఆజ్ఞాపించాడు. దీనిని బట్టి అర్జునుడికి రథసారథిగా కృష్ణుడు నియమింపబడ్డాడు అని వ్యాసుల వారు తెలియజేసారు. 23వ శ్లోకంలో ‘దుర్యోధనుడు దుర్బుద్ధితో ఈ యుద్ధానికి తలపడ్డాడు’ అని తెలియజేసారు వ్యాసుల వారు. ఇప్పటికి యుద్ధం సీను వివరించడం పూర్తి అయింది. ఇంక అర్జునునికి విషాదం ఎందుకుకలిగింది అనే విషయాన్ని తరువాతి శ్లోకాలలో వివరించారు వ్యాసుల వారు.. ఒక మానవునికి విషాదం కలగడానికి మూడుకారణాలు. రాగం, శోకం, మోహం. రాగం అంటే అటాచ్ మెంట్.. అనుబంధం. మనిషిపుట్టగానే తల్లి, తండ్రి, అక్కలు. అన్నలు, తండ్రి పక్క బంధువులు, తల్లి పక్క బంధువులు. వీరితో అనుబంధం పెంచుకుంటాడు. తరువాత చదువుకునేటప్పుడు గురువుతోనూ, స్నేహితులతోనూ అనుబంధం కలుగుతుంది. తరువాత వివాహము. దానితో భార్య, భార్య పక్క బంధువులు, పిల్లలు. ఇదీ సంసారము. ఈ అనుబంధాల వలన కలిగే శోకం రెండు రకాలు. ఉన్న వాళ్లకు ఏమైనా కష్టం కలిగితే కలిగే శోకం మొదటిది.. భవిష్యత్తులో ఏమన్నా కష్టం కలుగుతుందేమో అన్న భావనతో కలిగే శోకం రెండవది. ఇప్పుడు అర్జునుడికి కలిగింది రెండవ రకం శోకం. అదేవిషాదము. దాయాదులు తమ వద్ద నుండి అక్రమంగా లాక్కున్న అర్థ రాజ్యం తిరిగి ఇమ్మని అడిగారు పాండవులు. ఇవ్వను పొమ్మన్నాడు దుర్యోధనుడు. చేతనైతే యుద్ధం చేసి గెల్చుకో అన్నాడు. యుద్ధం అనివార్యంఅయింది. ఇరుపక్షాల సైన్యాలు యుద్ధానికి సన్నద్ధం అయ్యాయి. ఇంకా యుద్ధం మొదలు కాలేదు. ఎవరూచావలేదు. కాని అర్జునుడికి ఎదుటి పక్షంలోని వీరులను, సైనికులను, ముఖ్యంగా తాత భీష్ముని, గురువు ద్రోణుని, కృపాచార్యులవారిని చూచి విపరీతమైన శోకం పట్టుకుంది. నేను యుద్ధం చేస్తే, నా చేతుల్లో వీళ్లంతా చస్తే, వీళ్ల గతేంటి. ఇరుపక్షాలసైన్యంలో ఉన్న మగాళ్లు అందరూ చస్తే, వాళ్ల భార్యలు ఏమౌతారు. వాళ్లు చెడుతిరుగుళ్లు తిరిగితే, ఆ చెడుతిరుగుళ్ల వల్ల వారికి అక్రమ సంతానం కలిగితే, వర్ణసంకరం అవుతుంది. చచ్చిన వాళ్లకు పిండ ప్రదానం, జలతర్పణం ఎవరు చేస్తారు. అవి చెయ్యకపోతే అందరూ నరకానికి పోతారు కదా! అయినా చిన్నప్పటినుండి పెంచి పెద్ద చేసిన తాతగారిని, చదువు చెప్పిన గురువు కృపాచార్యుని, విలువిద్యలో మెళుకువలు నేర్పిన ద్రోణాచార్యుని, మిత్రుడు అశ్వత్థామను ఎలా చంపాలి. మామగారు ద్రుపదుడు, బావమరిది ధృష్టద్యుమ్యుడు, మేనమామ శల్యుడు, బావగారు కృష్ణుడు, శిష్యుడు సాత్యకి వీళ్లంతా యుద్ధంలో చస్తారుకదా! ఇదంతా నేను యుద్ధం చేయడం వల్ల కదా! అందుకని నేను యుద్ధం చేయను. సన్యాసం పుచ్చుకొని, బిక్షాటన చేసి బతుకుతాను. ఇదీ అర్జునుడి విషాదానికి కారణం. అప్పటికి యుద్ధం అసలే మొదలవ లేదు. ఎవరూ ఎవరినీ చంపలేదు. ఎవరూ చావలేదు. అందరూ బతికే ఉన్నారు. అంటే ఏమీ జరగని దానికి ఏదో జరుగుతుందని, జరగబోతోందని విషాదం పొందాడు అర్జునుడు. ఈ విషాదాన్ని అంతం చేయడానికి కృష్ణుడు చేసిన బోధ భగవద్గీత..! ఇంక ఒక్కొక్క శ్లోకం వివరంగా అధ్యయనం చేద్దాం…✍️```(సశేషం) . `🙏యోగక్షేమం వహామ్యహం🙏` `రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం` `(రిటైర్డ్ రిజిస్ట్రార్,ఏ.పి.హైకోర్టు.)` . *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* 🌷🙏🌷 `🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏` 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀 `*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*` ➖▪️➖ #📙ఆధ్యాత్మిక మాటలు #భగవ🙏ద్గీత #భగవద్గీత1813
- 🌷✿! శ్రీకాకుళం అబ్బాయి!✿🌷#🙏🏼భగవద్గీత #✍ జీవితం మీద కోట్స్👌 #✍️కోట్స్ #😃మంచి మాటలు #💪మోటివేషనల్ కోట్స్9071
- jayaraj#🙏🏻భగవద్గీత సందేశం1019