More like this
- P.Venkateswara Rao#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: సంకటహర చతుర్థి / సంకష్టహర చతుర్ధి *🕉️🌺 సంకటహర చతుర్థి విశిష్టత 🌺🕉️* 🙏 సంకటహర చతుర్థి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణ పక్ష చతుర్థి రోజున ఆచరిస్తారు. ఈ రోజు శ్రీ గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అన్ని విఘ్నాలు, కష్టాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని శాస్త్రాలు 🌺 🕉️🙏 సంకటహర చతుర్థి పూజ విధానం 🙏🕉️ 🌺 సంకటహర చతుర్థి రోజున శ్రీ గణపతి స్వామిని ఈ విధంగా పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 🌅 ఉదయం 🛁 స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. 🪔 పూజా స్థలాన్ని శుభ్రపరచి గణపతి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించండి. 🌼 దీపం వెలిగించి ధూపం సమర్పించండి. 🌺 పూజకు కావలసిన సామగ్రి 🍃 దూర్వ (గరిక) 🌺 ఎర్ర పూలు లేదా జపా పుష్పాలు 🍌 అరటిపండ్లు 🥥 కొబ్బరికాయ 🍬 మోదకాలు లేదా ఉండ్రాళ్లు 🍎 పండ్లు 🪔 కర్పూరం, ధూపం, దీపం 💧 అక్షింతలు, గంధం, కుంకుమ 🙏 పూజ చేసే విధానం 🔸 గణపతికి గంధం, కుంకుమ, అక్షింతలు సమర్పించండి. 🔸 గరిక (దూర్వ) సమర్పించండి. 🔸 ఎర్ర పూలతో అర్చన చేయండి. 🔸 మోదకాలు లేదా ఉండ్రాళ్లు నైవేద్యంగా పెట్టండి. 🔸 "ఓం గం గణపతయే నమః" మంత్రాన్ని 21, 54 లేదా 108 సార్లు జపించండి. 🔸 సంకటనాశన గణేశ స్తోత్రం లేదా గణేశ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి. 🌙 చంద్రోదయం తర్వాత 🌕 చంద్రునికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. 🙏 గణపతికి కర్పూర హారతి ఇవ్వండి. 🍌 నైవేద్యాన్ని కుటుంబ సభ్యులతో ప్రసాదంగా స్వీకరించండి. 🌼 ఈ రోజు పాటించాల్సినవి ✅ సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండండి. ✅ కోపం, అబద్ధం, చెడు మాటలు నివారించండి. ✅ గోవులకు లేదా అవసరమైన వారికి ఆహారం దానం చేయండి. ✅ గణపతి నామస్మరణతో రోజంతా గడపండి. 🌺 పూజ ఫలితాలు ✨ విఘ్నాలు తొలగుతాయి 💰 ధన, ఐశ్వర్యాలు కలుగుతాయి 📚 విద్యలో, ఉద్యోగంలో విజయం లభిస్తుంది 👨👩👧 కుటుంబంలో శాంతి, ఆనందం పెరుగుతుంది 🙏 మనసుకు ప్రశాంతత, గణపతి స్వామి అనుగ్రహం లభిస్తుంది. 🌺 శ్రీ గణేశాయ నమః 🐘🙏 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ। నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా॥ 🕉️🌸 1శ్లోకం🌺ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ । భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే ॥ 📖 అర్థం: 🙏 గౌరీదేవి కుమారుడైన వినాయకుడికి నమస్కరిస్తూ, ఆయన్ను ప్రతిరోజూ స్మరిస్తే దీర్ఘాయుష్షు, కోరికలు, ధర్మ–అర్థ–కామ ఫలితాలు లభిస్తాయి. 🌺 శ్లోకం 2 య్కప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం । తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం ॥ 📖 అర్థం: 🐘 గణపతి స్వామి వివిధ దివ్యరూపాలను స్మరించడం ద్వారా విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి. 🌺 శ్లోకం 3 లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ । సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ ॥ 📖 అర్థం: 🌺 గణపతి నామాలను భక్తితో జపిస్తే జీవితంలోని ఆటంకాలు తొలగి విజయాలు సిద్ధిస్తాయి. 🌺 శ్లోకం 4 నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ । ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ॥ 📖 అర్థం: 🌸 ఈ పవిత్ర నామాలను స్మరించిన వారికి శుభం, ఐశ్వర్యం, సంతోషం కలుగుతాయి. 🌺 శ్లోకం 5 ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః । న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో ॥ 📖 అర్థం: 🙏 ఈ పన్నెండు నామాలను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం జపించిన వారికి విఘ్నాలు ఉండవు. అన్ని కార్యాల్లో విజయం లభిస్తుంది. 🌺 జపించడం వల్ల కలిగే ఫలితాలు 🌼 విఘ్నాలు తొలగుతాయి 💰 ధనలాభం కలుగుతుంది 📚 విద్యలో విజయం 💼 ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి 👨👩👧 కుటుంబ సుఖశాంతి 🕉️ మనశ్శాంతి, ఆధ్యాత్మిక పురోగతి 🌺🙏910
- PSV APPARAO#నాగ స్తోత్రం 🐍 #నవ నాగ స్తోత్రం #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #సర్ప రక్షకురాలు మానస దేవి... నాగుల చవితి / నాగ పంచమి 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *నవనాగ స్తోత్రం......!!* *ప్రతీరోజూ తప్పకుండా ఒక్కసారైనా ఈ మంత్రం భక్తి శ్రద్ధలతో పఠిస్తే మంచిది.* *నవనాగ స్తోత్రము అంటే తొమ్మిది మంది ప్రముఖమైన నాగ దేవతల పేర్లను పఠించటం.* *ఈ స్తోత్రాన్ని పఠించటం వలన విష భయం తొలగిపోతుందని నమ్ముతారు.* *కాలసర్పదోషం,నాగ దోషం ఉన్నవారు దీనిని రోజూ పఠించాలి.* *నవ నాగ స్తోత్రం..* అనంతం వాసుకిం శేష పద్మనాభంచ కంబలమ్ శంఖుపాలం ధృతరాష్ట్రంచ తక్షకం కాళీయం తధా ఫలశ్రుతి... ఏతాని నవ నామాని నాగానాంచ మహాత్మనాం సాయంకాలే పఠనేనిత్యం ప్రాతః కాలే విశేషతః తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్| సర్పసూక్తం - సుబ్రహ్మణ్య సూక్తం.... తైత్తిరీయ సంహితా - ౪.౨.౮ ఋగ్వేదము నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను | యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః | యే ౭ దో రోచసే దివో యే వా సూర్యస్య రశ్మిషు | యేషామప్సు సదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః యా ఇషవో యాతుధానానాం యే వా వనస్పతీగ్ంరను | యే వా ౭ పటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః || ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టం | ఆశ్రేషా యేషామనుయంతి చేతః | యే అంతరిక్షం పృథివీం క్షియంతి | తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః | యే రోచసే సూర్యస్స్యాపి సర్పాః | యే దివం దేవీమనుసంచరంతి | యేషామాశ్రేషా అనుయంతి కామం | తేభ్యస్సర్పేభ్యో మధుమజ్జుహోమి || నిఘృష్వైరసమాయుతైః | కాలైర్హరిత్వమాపన్నైః | ఇంద్రాయాహి సహస్రయుక్ | అగ్నిర్విభ్రాష్టివసనః | వాయుశ్చేతసికద్రుకః | సంవథ్సరో విషూవర్ణైః | నిత్యాస్తే ౭ నుచరాస్తవ | సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం || ఇతి సర్ప సూక్తం..!! సర్ప స్తోత్రం.. భుజంగేషాయ విద్మహే క్షక్షు శివాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్! ఈ మంత్రం నాగ విగ్రహానికి పాలు పోస్తూ చెప్పుకొంటే ఎవ్వరికైన అనుకొన్నది జరుగుతుంది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*1413
- PSV APPARAO#శుభ శ్రావణ మంగళవారం ... మంగళ గౌరీ వ్రతం / నోములు #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శ్రావణ మాసం #శ్రావణమాసం విశిష్టత *మంగళగౌరీ వ్రతం* *మంగళగౌరీ వ్రతం సందర్భంగా...* శ్రావణమాసంలో స్త్రీలు మంగళగౌరీ, వరలక్ష్మీ వ్రతాలు జరుపుకుంటారు. ఈ రెండు వ్రతాలు సౌభాగ్యాన్ని, సుమంగళీత్వాన్ని కలిగిస్తాయని విశ్వసిస్తారు. శ్రావణమాసంలో మంగళగౌరిని శ్రీ తల్చుకోవడం ఏ ఇల్లాలికైనా మహాభాగ్యమే! గౌరీదేవి కేవలం ప్రతాలకు, నోములకే పరిమితం కాదు. ఆమె విభిన్న రూపాల్లో మనకు దర్శనమిస్తుంది.. మహాకవులు పద్యాల్లో, జానపదులు పాటల్లో గౌరీదేవిని పూజిస్తారు. బతుకమ్మ పండుగలప్పుడు తెలంగాణలో వాయనం పుచ్చుకునేటప్పుడు మహిళలు గౌరీదేవి పాట పాడతారు. సస్య సంపద అభివృద్ధి కోసం గౌరీదేవిని ప్రార్ధిస్తారు. జొన్నలు, వడ్లు, కందులు, పెసలు ఇలా అన్నీ బాగా పండాలని రైతులు గౌరమ్మను పూజిస్తారు. 'జొన్నల్ల పుట్టిన గౌరి, జొన్నల్ల పెరిగిన గౌరి అన్నవేసిన పొన్నల కింద. నేను వేసిన నిమ్మల కింద చల్లంగుండు సంపతి గౌరమ్మా వడ్లల్ల పుట్టిన గౌరీ, వడ్లల్ల పెరిగిన గౌరీ అన్నవేసిన పొన్నల కింద, నేను వేసిన నిమ్మల కింద చల్లంగుండు సంపతి గౌరమ్మా ఇలా కందుల గురించి, పెసల గురించి గౌరమ్మను ప్రార్థించి వాయనాలు ఇచ్చుకుంటారు మహిళలు, రైతన్నల బతుకులు బాగుండాలంటే గౌరీదేవి దయ కావాలనే విశ్వాసం బతుకమ్మ పాటల్లో కనిపిస్తుంది. గౌరీశ్వరుల ప్రణయంలో సరస శృంగార సంభాషణలు జానపద పాటల్లో కనిపిస్తాయి. చింత చెట్టు మీద కూర్చుని ఆలి పొడే పాటలను ఆలకిస్తున్నాడు. శివుడు. ఆ స్వామికి గౌరిపై కోపమొచ్చింది. 'అన్నల్ని పాడేవు, తమ్ముల్ని పాడేవు నన్నేల పాడవే? సిరి గౌరిదేవి అన్నాడు శివుడు ఆమె వెంటనే 'సిగ్గు ఎగ్గుల మారి వ్యాపారి శివుడా యేమని పాడేది ఇందరిలోనా' అంది. అందరిలో భర్త గురించి ఎలా పాడేది అని ఆమె ఆలోచిస్తోంది ఎలా పాడాలో, ఏమి పాడాలో ఆమెకు చెప్పాడు శివుడు 'పూల బాణము తొడిగి పులి నందినెక్కి నా పుణ్య పురుషుడు వచ్చెను అని పాడు అన్నాడు శివుడు. ఆమె ముసిముసిగా నవ్వుకుంటోంది. మళ్లీ శివుడిలా అంటున్నాడు. నాగబాణము తొడిగి నవనందినెక్కి నా స్వామి వచ్చెను అని పాడు. 'సూర్య బాణము తొడిగి సూర్యరథమెక్కి నా పుణ్యాల రాశి వచ్చెను అని పాడు. ఇలా సాగుతాయి గౌరీశ్వరుల ప్రణయ సంభాషణలు ఈ సంభాషణల్లో శివతత్త్వం, గౌరి లాలిత్యం కనిపిస్తుంది. శ్రావణమాసంతో పాటు ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో కూడా గౌరీ పూజ చేస్తారు. ఆ మాసాల్లో బాలికలు గౌరీ నోము నోస్తారు. ఉయ్యాల ఊగుతూ పాటలు పాడతారు. బాలికలంతా చెరువు కుంటలోని బంకమట్టిని తెచ్చి గౌరమ్మ బొమ్మను చేసి పాటలు పాడుకుంటారు. 'గౌరం గౌరమ్మా యెవరాడీ చిడ్డమ్మా బచ్చన్నీ కుంట్లో నా బంకమన్నమ్మా కోలూ కోలన్నా ఎవని మేలు కొలన్నా గౌరమ్మొచ్చిందీ గుళ్లోన గూసుంది మాయమ్మ బోయిందీ సద్ది తేనీకి' ఇలా గౌరమ్మకి చల్లి నైవేద్యాలు పెడుతూ పాటలు పాడతారు. యక్షగానాల్లో గంగా గౌరీ సంవాదం చాలా ప్రసిద్ధమైంది. అయితే స్త్రీల పాటల్లో హాస్యంతో కూడిన సంవాదాలు గౌరీపరంగా ఉన్నాయి. 'గౌరీదేవి నీ శంభుదేవునకు గళమున నలుపేమమ్మా' అంటే నలుపేమిటో చెప్పక చెప్పటం ఇందులో విశేషం. 'నారీమణీ! నీ విష్ణుదేవుడూ నలుపు కాదటే కొమ్మా అని జవాబిస్తుంది. గౌరీదేవి. గోపికలు జలక్రీడలాడి గంగ ఒడ్డున నిలిచారు. ధూపదీప నైవేద్యాలతో గౌరమ్మను పూజించారు. వారి కోరికేమిటో చూద్దాం... ఆ కోరిక తీరిస్తే మల్లెపూలతో పూజ చేస్తామంటున్నారు. 'వినవమ్మ గౌరమ్మ విన్నపము లాలించి విని మా మనసులో కోర్కె లీడేర్చవమ్మా అచ్యుతునకు మాకు ఆలింగనము చేసితే ఇచ్ఛ మల్లెల పూజ చేతునే గౌరి' గౌరమ్మను ఎలా పూజించినా ఆమె భక్తులపై కరుణా కటాక్షాలు ప్రసరిస్తుంది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*1418
- PSV APPARAO#నవ నాగ స్తోత్రం #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్ఠత: శ్రావణ పంచమి / నాగ పంచమి / నాగుల పంచమి / గరుడ పంచమి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్ఠత శ్రావణ పంచమి / నాగ పంచమి / గరుడ పంచమి / నాగుల పంచమి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్ఠత: శ్రావణ పంచమి / నాగ పంచమి / నాగుల పంచమి / గరుడ పంచమి *నవనాగ స్తోత్రం......!!* *ప్రతీరోజూ తప్పకుండా ఒక్కసారైనా ఈ మంత్రం భక్తి శ్రద్ధలతో పఠిస్తే మంచిది.* *నవనాగ స్తోత్రము అంటే తొమ్మిది మంది ప్రముఖమైన నాగ దేవతల పేర్లను పఠించటం.* *ఈ స్తోత్రాన్ని పఠించటం వలన విష భయం తొలగిపోతుందని నమ్ముతారు.* *కాలసర్పదోషం,నాగ దోషం ఉన్నవారు దీనిని రోజూ పఠించాలి.* *నవ నాగ స్తోత్రం..* అనంతం వాసుకిం శేష పద్మనాభంచ కంబలమ్ శంఖుపాలం ధృతరాష్ట్రంచ తక్షకం కాళీయం తధా ఫలశ్రుతి... ఏతాని నవ నామాని నాగానాంచ మహాత్మనాం సాయంకాలే పఠనేనిత్యం ప్రాతః కాలే విశేషతః తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్| సర్పసూక్తం - సుబ్రహ్మణ్య సూక్తం.... తైత్తిరీయ సంహితా - ౪.౨.౮ ఋగ్వేదము నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను | యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః | యే ౭ దో రోచసే దివో యే వా సూర్యస్య రశ్మిషు | యేషామప్సు సదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః యా ఇషవో యాతుధానానాం యే వా వనస్పతీగ్ంరను | యే వా ౭ పటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః || ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టం | ఆశ్రేషా యేషామనుయంతి చేతః | యే అంతరిక్షం పృథివీం క్షియంతి | తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః | యే రోచసే సూర్యస్స్యాపి సర్పాః | యే దివం దేవీమనుసంచరంతి | యేషామాశ్రేషా అనుయంతి కామం | తేభ్యస్సర్పేభ్యో మధుమజ్జుహోమి || నిఘృష్వైరసమాయుతైః | కాలైర్హరిత్వమాపన్నైః | ఇంద్రాయాహి సహస్రయుక్ | అగ్నిర్విభ్రాష్టివసనః | వాయుశ్చేతసికద్రుకః | సంవథ్సరో విషూవర్ణైః | నిత్యాస్తే ౭ నుచరాస్తవ | సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం || ఇతి సర్ప సూక్తం..!! సర్ప స్తోత్రం.. భుజంగేషాయ విద్మహే క్షక్షు శివాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్! ఈ మంత్రం నాగ విగ్రహానికి పాలు పోస్తూ చెప్పుకొంటే ఎవ్వరికైన అనుకొన్నది జరుగుతుంది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*819
- PSV APPARAO#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్ఠత: శ్రావణ పంచమి / నాగ పంచమి / నాగుల పంచమి / గరుడ పంచమి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్ఠత శ్రావణ పంచమి / నాగ పంచమి / గరుడ పంచమి / నాగుల పంచమి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్ఠత: శ్రావణ పంచమి / నాగ పంచమి / నాగుల పంచమి / గరుడ పంచమి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *గరుడ పంచమి* *ఆగష్టు 17 సోమవారం గరుడ పంచమి సందర్భంగా...* గరుత్మంతుణ్ణి వైష్ణవులు గరుడాళ్వార్ అంటారు. గరుడుడు విష్ణు భక్తి పరాయణుడు, మాతృదాస్య విముక్తికి పాటుపడ్డవానిగా పురాణాలు ఆయనను అభివర్ణించాయి. స్వామికి వాహనంగా నిలిచిన గరుత్మంతుణ్ణి ఆయన జన్మతిథినాడు పూజించడం ఆచారం. గరుత్మంతుడు పక్షులకు రాజు, సర్పజాతికి శత్రువు. ఆయన గొప్పదనమంతా విష్ణుమూర్తిని వాహనరూపుడై సేవించడంలోనే ఉంది. నిరంతర స్వామి పాదసేవా పరాయణుడు గరుడుడు. అపార శక్తికి, అద్భుత గమనానికి సంకేతంగా ఆ పక్షిరాజును దేవతలు భావిస్తారు. _''వేదాత్మా విహగేశ్వరః"_ వేద స్వరూపుడు గరుత్మంతుడు. _మాతృదాస్య విముక్తి_ కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు. వినతకు ఇద్దరు కుమారులు కలిగారు. వీరిలో పెద్ద వాడైన అనూరుడు సూర్యునికి రథసారథయ్యాడు. రెండో కుమారుడైన గరుడుడు విష్ణుమూర్తికి వాహనమయ్యాడు. దేవేంద్రుని వజ్రాయుధం దెబ్బలను కూడా తట్టుకోగలిగిన శక్తి గరుత్మంతుని రెక్కలకు ఉంది. అందుకే ఆయనను సువర్ణుడు అన్నాడు. అందువల్లనే దేవేంద్రుని ఓడించి అమృతాన్ని తెచ్చి సవితి తల్లికిచ్చి కన్నతల్లికి దాస్య విముక్తి కలిగించాడు. ఈ విధంగా తల్లికి దాస్య విముక్తి కలిగించిన రోజే శ్రావణ శుద్ధ పంచమి. విష్యాలయాల్లో గర్భాలయానికి ఎదురుగా నిలిపే ధ్వజస్తంభానికి దిగువన గరుడుని విగ్రహం ఉంటుంది. స్వామికి -నమస్కరిస్తున్న భంగిమలో అక్కడ మనం గరుత్మంతుని చూస్తాం. ఈ కారణంగానే ధ్వజస్తంభాన్ని గరుడ స్తంభం, గరుడ కంబం అని కూడా పిలుస్తారు. విష్ణువు పతాకం మీద గరుత్మంతుడు అధిష్ఠించి ఉంటాడు. విష్ణునామాల్లో గరుడధ్వజుడనేది ప్రసిద్ధనామం. గరుత్మంతుని పేరుతోనే గరుడ పురాణం ఉంది. మరణించిన వ్యక్తికి కర్మకాండ పూర్తయ్యేంత వరకూ అశౌచ దినాల్లో గరుడ పురాణాన్ని పఠించడం ఒక ఆచారంగా వస్తోంది. ఇలా చేస్తే మరణించిన వ్యక్తికి పుణ్యలోకాలు లభిస్తాయని నమ్మకం. యుద్ధ వ్యూహాల్లో గరుడ వ్యూహం కూడా ప్రముఖమైనదే. యుద్ధ రంగంలో సైనికుల్ని గరుడుని ఆకారంలో నిలబెడతారు. ఈ వ్యూహాన్ని భేదించడం కష్టసాధ్యం. గోదావరి రాజమండ్రి దాటిన తరువాత ఏడుపాయలుగా విడిపోయింది. వాటిలో ''వైనతేయ' అనే పాయ గరుత్మంతుని పేరుమీదుగా ఏర్పడించే. నతేయగా విడిపోయిన చోట రాజోలు వద్ద గరుత్మంతునికి అరుదైన ఆలయం ఉంది. ఇందులో కొలువైన స్వామిని గరుడేశ్వర స్వామిగా ఆరాధిస్తారు. _వివిధ ప్రాంతాల్లో గరుడ పంచమి_ గరుడుడు తల్లి దాస్యాన్ని విముక్తి చేసిన శ్రావణ శుద్ధ పంచమినాడు గరుడ పంచమి పర్వదినంగా జరుపుకోవడం ఆచారం. కృష్ణా గోదావరి జిల్లాల్లోని వారు, సాగర తీర వాసులు ఈ పర్వాన్ని విశేషంగా జరుపుకుంటారు. వ్రతరత్నాకరం, గరుడ పురాణం ఈ రెండు గ్రంథాల్లోనూ గరుడ పంచమి వ్రత విధానం గురించి ప్రస్తావన ఉంది. సోదరులున్న స్త్రీలందరూ గరుడపంచమి వ్రతం చేసుకోవచ్చు. పంచమి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుచిగా కొయ్యతో చేసిన చతురస్రాకారంలో ఉన్న పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అయిదు రంగులతో ముగ్గు పెట్టాలి. పీటపై ముగ్గుమధ్యలో బియ్యం పొయ్యాలి. ఆ బియ్యం మధ్యలో తమలపాకు ఉంచి దానిపై బంగారు, వెండి లేదా మట్టితో చేసిన గరుత్మంతుని ప్రతిమ ఉంచాలి. ఇవేవీ వీలు కాని పక్షంలో గరుతంత్ముని చిత్రపటాన్ని ఉంచి పూజించవచ్చు. పూజకు ముందుగా అయిదు రంగుల దారాలకు అయిదు ముడులు వేసి అయిదు పూలతో కట్టిన తోరాన్ని ఉంచాలి. అనంతరం షోడశోపచారాలతో గరుడుణ్ణి పూజించాలి. చక్రపొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజించిన తోరాన్ని స్త్రీలు కుడి చేతికి ధరించాలి. ఇలాచేస్తే సర్ప భయం ఉండదని విశ్వసిస్తారు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩* .916
- PSV APPARAO#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్ఠత: శ్రావణ పంచమి / నాగ పంచమి / నాగుల పంచమి / గరుడ పంచమి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగలు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్ఠత శ్రావణ పంచమి / నాగ పంచమి / గరుడ పంచమి / నాగుల పంచమి *గరుడ పంచమి* *ఆగష్టు 17 సోమవారం గరుడ పంచమి సందర్భంగా...* గరుత్మంతుడు పక్షులకు రాజు. సర్పజాతికి శత్రువు. ఆయన గొప్పదనమంతా విష్ణుమూర్తిని వాహనరూపుడై సేవించడంలోనే ఉంది. నిరంతర స్వామి పాదసేవా పరాయణుడు గరుడుడు. అపార శక్తికి, అద్భుత గమనానికి సంకేతంగా ఆ పక్షిరాజును దేవతలు భావిస్తారు. వినతా సుతుడైనందున వైనతేయుడయ్యాడు. గరుత్మంతుని అన్న అయిన అనూరుడు సూర్యునికి రథసారథయ్యాడు. రెండో కుమారుడైన గరుడుడు విష్ణుమూర్తికి వాహనమయ్యాడు. దేవేంద్రుని వజ్రాయుధం దెబ్బలను కూడా తట్టుకోగలిగిన శక్తి గరుత్మంతుని రెక్కలకు ఉంది. అందుకే ఆయనను సుపర్ణుడు అన్నారు. అందువల్లనే దేవేంద్రుని ఓడించి అమృతాన్ని తెచ్చి సవతి తల్లికిచ్చి కన్నతల్లికి దాస్య విముక్తి కలిగించాడు. ఈ విధంగా తల్లికి దాస్య విముక్తి కలిగించిన రోజే శ్రావణ శుద్ధ పంచమి. విష్ణువు పతాకం మీద గరుత్మంతుడు అధిష్ఠించి ఉంటాడు. విష్ణునామాల్లో గరుడధ్వజుడనేది ప్రసిద్ధనామం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*1613
- PSV APPARAO#సర్ప రక్షకురాలు మానస దేవి... నాగుల చవితి / నాగ పంచమి 🙏 #శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగలు #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #నాగ పంచమి *సర్ప రక్షకురాలు మానసాదేవి* త్రినేత్రుడైన పరమేశ్వరుని మానస పుత్రిక శ్రీ మాతా మానసదేవి.. ఆమెను మనసారా పూజిస్తే భయంకరమైన కాల సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని బిల్వపర్వతంపై వెలసిన ఆమె యుగయుగాలుగా భక్తులను తన చల్లని చూపులతో సంరక్షిస్తు న్నారు. ఆమె దయ వుంటే చాలు ఏమైనా సాధించవచ్చని కోట్లాదిమంది భక్తుల నమ్మకం. సర్పాలకు మానవులు తెలిసిగానీ తెలియక గానీ చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పోగొడుతుంది. అందుకనే కాలసర్పదోష నివరణకు ఆ మాతను ప్రార్ధించాలి. అమ్మవారిని నిత్యం కొలిస్తే సకల సంప దలకు ఎటువంటి లోటు ఉండదని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి. సర్ప రక్షకురాలు మాతా మానసాదేవి అన్న వాసుకి, ఆమెను జరత్కారువు అనే మహర్షి కిచ్చి వివాహం చేస్తారు. ఆమెకు మరో పేరు కూడా జరత్కారువు కావడం గమనార్హం. ఈ దంపతులకు ఆస్తీకుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఒక రోజున జనమేజయ రాజు సర్పయాగం ప్రారంభిస్తాడు. తన తండ్రైన పరీ క్షిత్తు మహారాజును తక్షకుడు అనే నాగు చంపడంతో ఆయన ఆగ్రహం చెంది ఈ యాగం నిర్వహిస్తాడు. ఋత్వికుల మంత్ర పఠనంతో భూమండలంమీద వున్న వేలాది నాగులు వచ్చి యాగంలో పడిపోవడం ప్రారంభించాయి. నాగులలో శ్రేష్ఠు డైన వాసుకి భీతిల్లితుండటంతో సోదరి మానసదేవి తన కుమారుడైన అస్తికుడిని యజ్ఞం నిలిపివేసేందుకు పంపుతుంది. అస్తీకుని తల్లి నాగ స్త్రీ. తండ్రి" బ్రాహ్మణ మహర్షి. ఒకే పేరుతో వున్న దంపతుల పిల్లలే యాగాన్ని నిలిపి వేసేందుకు అర్హులు అని తెలియడంతో అస్తీకుడు ఆ కార్యాన్ని నెరవేర్చగల డని తల్లి భావించింది. యాగ ప్రదేశానికి వెళ్లిన ఆస్తీకునికి జనమేజయుడు సాదరంగా స్వాగతం పలుకుతాడు. ఏం కావాలో కోరుకోమన్న రాజును ఆయన తక్షణమే యాగాన్ని నిలిపి వేయమని విన్నవిస్తాడు. దీంతో మాటకు కట్టుబడిన జనమేజయుడు వెంటనే యాగాన్ని నిలిపివేయడంతో సర్ప సంహారం నిలిచిపోయింది. దీంతో నాగజాతి అస్తీకునికి కృతజ్ఞతలు తెలిపింది. అందరూ ఆయన తల్లి మానసాదేవి సమక్షానికి చేరుకొని నాగులను కాపాడినందుకు భక్తితో ప్రణ మిల్లారు. సర్పజాతిని సంరక్షించిన మాతా మానసాదేవి అంటే నాగులకు విశిష్టమైన గౌరవం. అందుకే ఆమెను పూజిస్తే అన్ని సర్పదోషాలు తొలగి పోతాయి. సంతానలేమికి కూడా కాలసర్పదోషం కారణమని చెబుతారు. అందుకనే ఆ మాతను పూజిస్తే సంతాన ఫలం కలుగుతుంది. బిల్వ పర్వతంపై ఆలయం హరిద్వార్ లోని బిల్వ పర్వతంపై అమ్మవారి ఆలయం వుంది. ఆలయాన్ని సిద్ధపీఠంగా వ్యవహరిస్తారు. సమీపంలోనే మాయాదేవి ఆలయం, సుందర దృశ్యం మనకు అలౌకిక దివ్యానుభూతిని మిగుల్చుతుంది. సన్ని ధానంలో మాత మానసదేవిని సందర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వున్న వృక్షానికి దారాలు కట్టి తమ కోరిక నెరవేర్చాలని వేడు కోవాలి. అమ్మవారి అభీష్ఠంతో కోరికలు నెరవేరిన అనంతరం తిరిగి ఆలయాన్ని దర్శించుకోవాలి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*1714
- PSV APPARAO#శ్రావణ మాసం ప్రత్యేకత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగలు #సర్ప రక్షకురాలు మానస దేవి... నాగుల చవితి / నాగ పంచమి 🙏 *నాగులచవితి* శివుని కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామివారిది సర్పరూపమే. వినాయకుడికి జందెం పాము. దుర్గాదేవి పరివారంలోకూడా సర్పజాతి ఉండటం విశేషం. చీనాబ్, రావి నదుల మధ్య, అస్సాం దక్షిణప్రాంతంలోని నాగాయ్ కొండలలో, కాశ్మీరంలో ఎప్పటి నుంచో నాగజాతివారు నివసిస్తున్నారు. అమరావతి, నాగార్జునకొండ శిల్పాలలో నాగరాజులూ, నాగినులూ, నాగాలూ కనబడతాయి. కటిభాగంపైన మానవరూపం, క్రిందిభాగం సర్పరూపంగా ఉన్న శిల్పాలు దర్శనమిస్తాయి. జ్యోతిషం ప్రకారం రాహుగ్రహం సర్పప్రతినిధి. రాహుదోషం కారణంగా సర్పదోషం కలిగి సంతానోత్పత్తికి అటంకం ఏర్పడుతుంది. అందుకే పిల్లలు లేనివారు, సంతాననష్టం కలిగినవారూ నాగప్రతిష్ఠ చేస్తారు. మనదేశంలో చాలాచోట్ల నాగప్రతిమలు కనిపిస్తాయి. శ్రీశైల ఆలయంలో ఉత్తరదిక్కున ఉన్న 'నాగులకట్ట' ఎంతో సుప్రసిద్ధమైనది. సనాతనధర్మంలో నాగబంధమనేది భార్యాభర్తల సంబంధానికి ఒక ప్రతీక. భార్యాభర్తలు ఆధ్యాత్మిక మార్గంలో పయనించి జయం పొందడం దాని ధ్యేయం. నాగబంధమనేది కంటికీ, చెవికీ ఎలాంటి సమస్యలు రాకుండా రక్షిస్తుంది. యోగశాస్త్రం ప్రకారం మానవుని మానసికశక్తికి సర్పం ఒక గుర్తు. మానవశరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలున్నాయి. అయితే అనేక నాడులతో నిండి ఉన్న వెన్నుబాములోని కుండలినీశక్తి మూలాధారచక్రంలో సర్పాకారంతో నిద్రావస్థలో ఉండి కామక్రోధాది అరిషడ్వర్గాలను ప్రకోపింపచేస్తుంది. దానివల్ల మనలో ఉండే సత్త్వగుణం అడుగంటుతుంది. నిద్రావస్థలో ఉన్న కుండలినీశక్తిని మేలుకొలిపి, వెన్నెముక మధ్యన ఉండే సుషుమ్నానాడిగుండా సహస్రారం వరకూ తీసుకుపోవడమే సర్పాన్ని పూజించడంలోని ఆంతర్యం. అంతేకాదు వృశ్చికరాశిలోని జ్యేష్ఠానక్షత్రం సర్పనక్షత్రం. విషజంతువులవల్ల బాధలూ, మృత్యువూ కలగడానికి వృశ్చికరాశి అధిష్ఠానం. అందుకే ఈ సర్పనక్షత్రంలో సూర్యుడు. ప్రవేశించినప్పుడు ఈ పండుగ నాడు అంటే నాగులచవితి రోజున పాములను పూజించి, పుట్టలో పాలు పోస్తే మానవుడిలో ఉన్న విషతుల్యపు ఆలోచనలు శాంతిస్తాయని ఒక నమ్మకం. కుజదోషం, కాలసర్పదోషం ఉన్నవారు. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజిస్తూ, నాగుపాము ఉండే పుట్టకు పూజ చేస్తే కళత్రదోషాలు తొలగుతాయని ఒక విశ్వాసం. నాగులచవితి పండుగను దీపావళి అమావాస్య తరువాత, కార్తికమాసం శుక్లపక్ష చవితినాడు చేసుకుంటారు. కొందరు శ్రావణమాసంలో కూడా జరుపుకోవడం కనిపిస్తుంది. ఈ పండుగను ముఖ్యంగా గ్రామీణప్రాంతాలలో ఉండేవారు ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, నూతన వస్త్రాలు కట్టుకొని, పూజామందిరంలో నాగదేవత విగ్రహాన్ని నెలకొల్పి పూజిస్తారు. లేదా పాముపుట్ట దగ్గఱకు పోయి అందులో పాలు పోసి, నువ్వుల ఉండలు, పప్పుతో చేసిన వంటకం, బియ్యపుపిండి -బెల్లంతో చేసిన తీపి పదార్థం నాగదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. పూలు, ఆవుపాలు, పసుపు, కుంకుమ, అరటిపళ్లు, తాంబూలం సమర్పించి, పూజిస్తారు. *తరువాత ఆ పుట్టచుట్టూ ప్రదక్షిణం చేస్తూ -* 'సర్ప సర్ప భద్రాంతే దూరం గచ్ఛ మహావిషమ్ జనమేజయ యాగాంతే ఆస్తీకవచనమ్ అనంతాయ నమస్తుభ్యం సహస్రశిరసే నమ: నమోస్తు పద్మనాభాయ నాగనాంపతయే నమః అనంతో వాసుకిం శేషాం తక్షకః కాళియస్తథా' అని చదువుతూ. పుట్టమన్నును పుట్టబంగారంగా భావించి చెవిదోషాలు పోవడానికి చెవులకు ధరిస్తారు. వస్త్రాలను పుట్టమీద పెట్టి ధరిస్తే కోరికలు తీరతాయని ఒక నమ్మకం. ఈ పండుగను ప్రధానంగా తమ పిల్లల శ్రేయస్సుకోసం వివాహిత స్త్రీలు తప్పక జరుపుకుంటారు. ఆనాడు ఉపవాసం కూడా ఉంటారు. *నాగుల చవితి పూజామంత్రం కూడా పఠించడం ఒక ఆచారంగా కనబడుతుంది.* 'సర్వే నాగా: ప్రీయతాం మే యే కేచిత్ పృథ్వీతలే యే చ హేలిమరీచిస్థా యేయంతరే దివి స్థితా: యే నదీషు మహానాగా యే సరస్వతీగామినః యే చ పీతంగేషు సర్వేషు వై నమః' ("భువిలో, స్వర్గంలో, సరస్సులలో, బావులలో, గుంటలలో నివసించేపాములన్నీ మమ్ములను ఆశీర్వదించుగాకు వాటికి మేమంతా నమస్కరిస్తాం") 'అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలమ్ శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా ఏతాని నవనామాని నాగానాం చ మహాత్మనామ్ సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః తస్యవిషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్' అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల, శంఖపాల, ధృతరాష్ట్ర, తక్షక, కాళీయ అనే తొమ్మిది సర్వనామాలను ప్రతినిత్యం ఉదయం, సాయంకాలం చదివినవారికి విషభయం అనేది లేకుండా సర్వత్రా విజయం కలుగుతుంది. ఉదయం అయితే చాలా మంచిది అలాగే సర్పసూక్తం, నాగరాజగాయత్రీమంత్రం, నాగేంద్ర అష్టోత్తరశతం పఠిస్తే విశేషఫలితం పొందవచ్చు. అదేవిధంగా జానపదాలలో 'దిగు దిగు నాగా', 'నాగా నాగా యెన్నియలో', 'ఓం' నాగరాజాయ', 'శరణు శరణు నాగరాజా' వంటి భక్తిగేయాలు ఎన్నో కనబడతాయి. వాటన్నింటినీ భక్తితో చదువుకోవచ్చు. దేవతలూ, రాక్షసులూ అమృతంకోసం పాలసముద్రాన్ని మథించిన సందర్భంలో మందరపర్వతం కవ్వంగా, పామును తాడుగా ఉపయోగించబడింది. మొట్టమొదట ఆ సముద్రంనుండి హాలాహలం వెలువడింది. దానిని పరమేశ్వరుడు మ్రింగి నీలకంఠుడయ్యాడు. ఆ సమయంలో కొన్ని విషపు చుక్కలు నేలమీద పడ్డాయి. ఆ విషప్రభావంనుండి రక్షించుకోడానికి ప్రజలు సర్పారాధన నిత్యపూజాప్రక్రియగా ఆచరించేవారు. అదే క్రమంగా ఈ ఆరాధన సనాతన సంస్కృతిలో ఒక ఆచారంగా మారింది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*1113
- PSV APPARAO#శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగలు #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #శ్రీహరిహరుల శుభ అధ్యాత్మిక పవిత్ర మాసం "శ్రావణ మాసం" ప్రారంభం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *నాగులచవితి* శివుని కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామివారిది సర్పరూపమే. వినాయకుడికి జందెం పాము. దుర్గాదేవి పరివారంలోకూడా సర్పజాతి ఉండటం విశేషం. చీనాబ్, రావి నదుల మధ్య, అస్సాం దక్షిణప్రాంతంలోని నాగాయ్ కొండలలో, కాశ్మీరంలో ఎప్పటి నుంచో నాగజాతివారు నివసిస్తున్నారు. అమరావతి, నాగార్జునకొండ శిల్పాలలో నాగరాజులూ, నాగినులూ, నాగాలూ కనబడతాయి. కటిభాగంపైన మానవరూపం, క్రిందిభాగం సర్పరూపంగా ఉన్న శిల్పాలు దర్శనమిస్తాయి. జ్యోతిషం ప్రకారం రాహుగ్రహం సర్పప్రతినిధి. రాహుదోషం కారణంగా సర్పదోషం కలిగి సంతానోత్పత్తికి అటంకం ఏర్పడుతుంది. అందుకే పిల్లలు లేనివారు, సంతాననష్టం కలిగినవారూ నాగప్రతిష్ఠ చేస్తారు. మనదేశంలో చాలాచోట్ల నాగప్రతిమలు కనిపిస్తాయి. శ్రీశైల ఆలయంలో ఉత్తరదిక్కున ఉన్న 'నాగులకట్ట' ఎంతో సుప్రసిద్ధమైనది. సనాతనధర్మంలో నాగబంధమనేది భార్యాభర్తల సంబంధానికి ఒక ప్రతీక. భార్యాభర్తలు ఆధ్యాత్మిక మార్గంలో పయనించి జయం పొందడం దాని ధ్యేయం. నాగబంధమనేది కంటికీ, చెవికీ ఎలాంటి సమస్యలు రాకుండా రక్షిస్తుంది. యోగశాస్త్రం ప్రకారం మానవుని మానసికశక్తికి సర్పం ఒక గుర్తు. మానవశరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలున్నాయి. అయితే అనేక నాడులతో నిండి ఉన్న వెన్నుబాములోని కుండలినీశక్తి మూలాధారచక్రంలో సర్పాకారంతో నిద్రావస్థలో ఉండి కామక్రోధాది అరిషడ్వర్గాలను ప్రకోపింపచేస్తుంది. దానివల్ల మనలో ఉండే సత్త్వగుణం అడుగంటుతుంది. నిద్రావస్థలో ఉన్న కుండలినీశక్తిని మేలుకొలిపి, వెన్నెముక మధ్యన ఉండే సుషుమ్నానాడిగుండా సహస్రారం వరకూ తీసుకుపోవడమే సర్పాన్ని పూజించడంలోని ఆంతర్యం. అంతేకాదు వృశ్చికరాశిలోని జ్యేష్ఠానక్షత్రం సర్పనక్షత్రం. విషజంతువులవల్ల బాధలూ, మృత్యువూ కలగడానికి వృశ్చికరాశి అధిష్ఠానం. అందుకే ఈ సర్పనక్షత్రంలో సూర్యుడు. ప్రవేశించినప్పుడు ఈ పండుగ నాడు అంటే నాగులచవితి రోజున పాములను పూజించి, పుట్టలో పాలు పోస్తే మానవుడిలో ఉన్న విషతుల్యపు ఆలోచనలు శాంతిస్తాయని ఒక నమ్మకం. కుజదోషం, కాలసర్పదోషం ఉన్నవారు. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజిస్తూ, నాగుపాము ఉండే పుట్టకు పూజ చేస్తే కళత్రదోషాలు తొలగుతాయని ఒక విశ్వాసం. నాగులచవితి పండుగను దీపావళి అమావాస్య తరువాత, కార్తికమాసం శుక్లపక్ష చవితినాడు చేసుకుంటారు. కొందరు శ్రావణమాసంలో కూడా జరుపుకోవడం కనిపిస్తుంది. ఈ పండుగను ముఖ్యంగా గ్రామీణప్రాంతాలలో ఉండేవారు ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, నూతన వస్త్రాలు కట్టుకొని, పూజామందిరంలో నాగదేవత విగ్రహాన్ని నెలకొల్పి పూజిస్తారు. లేదా పాముపుట్ట దగ్గఱకు పోయి అందులో పాలు పోసి, నువ్వుల ఉండలు, పప్పుతో చేసిన వంటకం, బియ్యపుపిండి -బెల్లంతో చేసిన తీపి పదార్థం నాగదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. పూలు, ఆవుపాలు, పసుపు, కుంకుమ, అరటిపళ్లు, తాంబూలం సమర్పించి, పూజిస్తారు. *తరువాత ఆ పుట్టచుట్టూ ప్రదక్షిణం చేస్తూ -* 'సర్ప సర్ప భద్రాంతే దూరం గచ్ఛ మహావిషమ్ జనమేజయ యాగాంతే ఆస్తీకవచనమ్ అనంతాయ నమస్తుభ్యం సహస్రశిరసే నమ: నమోస్తు పద్మనాభాయ నాగనాంపతయే నమః అనంతో వాసుకిం శేషాం తక్షకః కాళియస్తథా' అని చదువుతూ. పుట్టమన్నును పుట్టబంగారంగా భావించి చెవిదోషాలు పోవడానికి చెవులకు ధరిస్తారు. వస్త్రాలను పుట్టమీద పెట్టి ధరిస్తే కోరికలు తీరతాయని ఒక నమ్మకం. ఈ పండుగను ప్రధానంగా తమ పిల్లల శ్రేయస్సుకోసం వివాహిత స్త్రీలు తప్పక జరుపుకుంటారు. ఆనాడు ఉపవాసం కూడా ఉంటారు. *నాగుల చవితి పూజామంత్రం కూడా పఠించడం ఒక ఆచారంగా కనబడుతుంది.* 'సర్వే నాగా: ప్రీయతాం మే యే కేచిత్ పృథ్వీతలే యే చ హేలిమరీచిస్థా యేయంతరే దివి స్థితా: యే నదీషు మహానాగా యే సరస్వతీగామినః యే చ పీతంగేషు సర్వేషు వై నమః' ("భువిలో, స్వర్గంలో, సరస్సులలో, బావులలో, గుంటలలో నివసించేపాములన్నీ మమ్ములను ఆశీర్వదించుగాకు వాటికి మేమంతా నమస్కరిస్తాం") 'అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలమ్ శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా ఏతాని నవనామాని నాగానాం చ మహాత్మనామ్ సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః తస్యవిషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్' అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల, శంఖపాల, ధృతరాష్ట్ర, తక్షక, కాళీయ అనే తొమ్మిది సర్వనామాలను ప్రతినిత్యం ఉదయం, సాయంకాలం చదివినవారికి విషభయం అనేది లేకుండా సర్వత్రా విజయం కలుగుతుంది. ఉదయం అయితే చాలా మంచిది అలాగే సర్పసూక్తం, నాగరాజగాయత్రీమంత్రం, నాగేంద్ర అష్టోత్తరశతం పఠిస్తే విశేషఫలితం పొందవచ్చు. అదేవిధంగా జానపదాలలో 'దిగు దిగు నాగా', 'నాగా నాగా యెన్నియలో', 'ఓం' నాగరాజాయ', 'శరణు శరణు నాగరాజా' వంటి భక్తిగేయాలు ఎన్నో కనబడతాయి. వాటన్నింటినీ భక్తితో చదువుకోవచ్చు. దేవతలూ, రాక్షసులూ అమృతంకోసం పాలసముద్రాన్ని మథించిన సందర్భంలో మందరపర్వతం కవ్వంగా, పామును తాడుగా ఉపయోగించబడింది. మొట్టమొదట ఆ సముద్రంనుండి హాలాహలం వెలువడింది. దానిని పరమేశ్వరుడు మ్రింగి నీలకంఠుడయ్యాడు. ఆ సమయంలో కొన్ని విషపు చుక్కలు నేలమీద పడ్డాయి. ఆ విషప్రభావంనుండి రక్షించుకోడానికి ప్రజలు సర్పారాధన నిత్యపూజాప్రక్రియగా ఆచరించేవారు. అదే క్రమంగా ఈ ఆరాధన సనాతన సంస్కృతిలో ఒక ఆచారంగా మారింది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*1217