చిటికల చండీశ్వరుడు............!!
ఒకానొకప్పుడు చిదంబరక్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు.
ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు.
ఆకొడుకు వేదం నేర్చుకున్నాడు.ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు.
ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు.
గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు.
ఒకరోజు ఆవులనుకాసే ఒకఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు.
అదిచూసిన ఆపిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటినుండి ఈఆవులను కాస్తాను.నీవు ఈఆవులను కొట్టవద్దు.తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు.
బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళోఉన్న వాళ్ళందరూ ఆవులవెనకాల ఈపిల్లవాడిని పంపించారు. ఈపిల్లవాడు వేదమంత్రములను చదువుకుంటూ వాటినిస్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు.వేదంలో కొన్నికొన్ని పన్నాలకు కొన్నికొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆపన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు.
ఆవులు సంతోషించి ఆపిల్లవాడు కూర్చున్నచోటికి వచ్చి అతడు మంచినీళ్ళుతాగడానికి ఒకకుండ తెచ్చుకుంటే ఆకుండలో పాలువిడిచి పెట్టేస్తుండేవి.
రోజూఇచ్చే పాలకన్నా ఎక్కువపాలను ఇంటిదగ్గర ఇచ్చేవి.ఈపిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈఆవులు విడిచిపెట్టినపాలతో శివాభిషేకము చేయదలచాడు.
రుద్రంచదవడం కన్నా గొప్పది మరొకటిలేదు.
అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం.
రుద్రాధ్యాయం అంత గొప్పది.అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి.
అటువంటి రుద్రంచదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈపాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు.ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు.‘అయ్యో, ఈపిల్లవాడు ఈపాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు.
ఇంకా ఆవులు ఎన్నిపాలిచ్చునో అని వెళ్ళి ఆపిల్లవాడి తండ్రికి చెప్పాడు.
చెప్తే యచ్చదత్తనుడికి కోపంవచ్చింది. ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటిరోజున కొడుకుకన్నా ముందేబయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసేచోట చేట్టిక్కి కూర్చున్నాడు.
పూర్వకాలం క్రూరమృగములు ఎక్కువ.
అందుకని కర్రగొడ్డలికూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు.కాసేపయింది.కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడఆవులను విడిచిపెట్టాడు.
ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి.
ఈయన సైకతలింగమును తయారుచేసి సైకత ప్రాకారములతో శివాలయనిర్మాణం చేశాడు.
తరువాత చక్కగా ఈఆవులు తమంత తాముగా విడిచిపెట్టినపాలతో రుద్రంచదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు.ఆయనమనస్సు ఈశ్వరుని యందు లయంఅయిపోయింది.
అతను పరవశించిపోతూ సైకతలింగమునకు అభిషేకం చేస్తున్నాడు.
అవును అతడు చెప్పింది నిజమే.
వీడు ఇసుకలో పాలుపోస్తున్నాడని దూరంగా చెట్టు మీదఉన్న తండ్రి చెట్టుదిగి పరుగెత్తుకుంటూవచ్చి పెద్ద పెద్ద కేకలువేసి పిల్లాడిని భుజములమీద కొట్టాడు.
ఆపిల్లవాడికి బాహ్యస్మృతి లేదు.
అతను అభిషేకంచేస్తూనే ఉన్నాడు.
కోపంవచ్చిన తండ్రి తనకాలితో అక్కడి సైకతలింగమును తన్నాడు.
అది ఛిన్నాభిన్నమయింది.
అప్పుడు ఆపిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది.
తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడపెట్టాడు.
ఈపిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు.
ఏపాదము శివలింగమును తన్నిందో ఆపాదము ఉండడానికి వీలులేదని గొడ్డలితీసి రెండుకాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు.
తండ్రి రెండుకాళ్ళు తొడలవరకు తెగిపోయాయి.
క్రిందపడిపోయాడు.
నెత్తుటి ధారలు కారిపోతున్నాయి.
కొడుకు చూశాడు.శివలింగమును తన్నినందుకు నీవీఫలితం అనుభవించవలసిందే’ అన్నాడు.
నెత్తురుకారి తండ్రి మరణించాడు.
ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నాభిన్నమయిన సైకతలింగం లోంచి పార్వతీపరమేశ్వరులు ఆవిర్భవించారు.
నాయనా, ఇంతభక్తితో మమ్మల్ని ఆరాధించావు.
అపచారం జరిగిందని తండ్రిఅనికూడా చూడకుండా కాళ్ళురెండూ నరికేశావు.
మనుష్యుడవైపుట్టి తపస్సుచేయకపోయినా వరం అడగకపోయినా నీకువరం ఇస్తున్నాను.
ఇవాల్టినుండి నీవు మాకుటుంబంలో అయిదవ వాడవు.నేను,పార్వతి, గణపతి,సుబ్రహ్మణ్యుడు.
అయిదవస్థానం చండీశ్వరుడిదే.
నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు.
ఇకనుంచి లోకంలో వివాహంఅయితే భర్తభోజనం చేసి విడిచిపెట్టినదానిని పత్నీభాగం అనిపిలుస్తారు.
భార్యకు దానిని తినేఅధికారం ఉంటుంది.
దానిని ఎవరుబడితే వారు తినెయ్యకూడదు.
భార్యకొక్కదానికే ఆఅధికారం ఉంటుంది.
అది పత్నీభాగం.
కానీ శంకరుడు ఎంతఅనుగ్రహంచేశాడో చూడండి.
పార్వతీ నేనుఈవేళ చండీశ్వరుడికి ఒకవరం
ఇచ్చేస్తున్నాను.
నీవు అంతఃపురంలో నాకు భోజనంపెడతావు కదా. నేనుతిని విడిచిపెట్టినదానిని చండీశ్వరుడు తింటూంటాడు. వేరొకరు తినరాదు’ అన్నాడు.
ఆచండీశ్వరుడు ఎప్పుడూ శంకరునిధ్యానంచేస్తూ ఉత్తరముఖంలో కూర్చునిఉంటాడు.
చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు.
ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు.
ఎప్పుడూ శివధ్యానతత్పరుడై ఉంటాడు.
ఆయనను పిలిస్తే ఆయనకు కోపంవస్తుంది.
అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని పేరు.
మనలో చాలామంది తెలిసీతెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడలమీదపెట్టి వెళ్లిపోతుంటారు.
ప్రసాదతిరస్కారం మహాదోషం.
అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు.
శాస్త్రప్రకారం ఆయన దగ్గరకువెళ్ళినపుడు చిన్నచిటిక మాత్రం వెయ్యాలి.
అందుకే ఆయనకి చిటికలచండీశ్వరుడు అని పేరు.
చిటికవేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళువిప్పి కోపంగా చూస్తాడు.
ఓహో మాస్వామిని ఆరాధించావా?
ప్రసాదం తీసుకున్నావా? సరిఅయితే తీసుకువెళ్ళు’ అంటాడు.ఆయనకు చూపించినతర్వాత ఆప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది.
దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు.
లోపల శివుడికి ఒకముక్క ఉండిపోయింది.
అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది.
మీకు ఇచ్చినది ప్రసాదరూపము.
దానిని మీరు గుడియందు విడిచిపెట్టి వెళ్ళిపోతే
మీ కోరిక తీరదు.
అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరిచెక్కలు గాని, ప్రసాదంకానీ అక్కడ వదిలిపెట్టేయ్యకూడదు.
నందిమీద పెట్టడంకాదు.
చండీశ్వరస్థానమునందు తప్పట్లు కొట్టకూడదు.
చిటిక చిన్నగామాత్రమే వేయాలి.
అంత పరమపావనమయిన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు.
ద్రవిడదేశంలో శివాలయంలో ఊరేగింపుజరిగితే నందిని తీసుకువెళ్ళరు.
చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవమూర్తులలో.
పార్వతీపరమేశ్వరులు,గణపతి,సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈఅయిదింటిని ఊరేగింపుగా తీసుకువెడతారు.పరమేశ్వరుడు చండీశ్వరునికి అయిదవస్థానం ఇచ్చారు.
ఒక్కసారి శివాలయంలోకి మనం గడపదాటి అడుగుపెడితే అటువంటిమూర్తులను దర్శనంచేసి శివలింగదర్శనంచేసి అమ్మవారిని చూస్తాము.
మన భాగ్యమే భాగ్యం.
అందుకే శివాలయం విష్ణ్వాలయం ఈరెండూలేని ఊరు పూర్వం ఉండేదికాదు.ఈరెండూ ఉండితీరాలి.
#😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏🏻భక్తి సమాచారం😲 #హర హర మహాదేవ #🌅శుభోదయం


